రూ.300 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం

జయత్రి గ్రూప్స్‌ పేరుతో మోసం సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో సుమారు రూ.300 కోట్ల స్కామ్‌కు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 జనవరిలో పోలీసులు సంబంధిత డైరెక్టర్ ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యతరగతి కుటుంబాలను, రిటైర్డ్ ఉద్యోగులను ఆర్థికంగా నిలువునా దోచుకున్న సంఘటనగా నిలిచింది. ప్రీ-లాంచ్…

Read More

వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై…

Read More

మార్క్ ఫెడ్ కు రూ. 93 కోట్ల నష్టం

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ అధికారుల నిర్వాకం వల్ల ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. కొందరు అధికారులు వ్యాపారులతో సిండికేట్ కావడం వల్లనే నష్టాలు మూటగట్టుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు తాజాగా జొన్నల విక్రయంలో జరిగిన లావాదేవీలే నిదర్శనం. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను వ్యాపారులకు అమ్మడం ద్వారా మార్క్ ఫెడ్ కు ఏకంగా రూ. 93 కోట్లు నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది జొన్నల మద్దతు…

Read More

తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

‘స్ట్రీట్‌ డాక్టర్స్’

సహనం వందే, హైదరాబాద్: ఈమె పేరు మిల్లీ-మే ఆడమ్స్. యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ కు చెందిన మెడికల్ స్టూడెంట్. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బ్రిటన్ లో అందాల పోటీల్లో ఆమె గతంలో విజయం సాధించారు. ఈ యువ డాక్టర్ అందాల పోటీలోనే కాదు… ఒక మెడికోగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్ట్రీట్ డాక్టర్స్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 2008లో వైద్య విద్యార్థులతో ప్రారంభమైన…

Read More

ఆసుపత్రుల్లో కరెంట్ కష్టాలు

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు రోగుల పాలిట శాపంగా మారాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతతో వైద్యులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో రోగులకు చికిత్స అందించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి, ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అయితే,…

Read More

‘హార్వర్డ్’లో కమ్యూనిస్టులకు శిక్షణ

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా అమెరికా విశ్వవిద్యాలయాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి చెందిన ఉన్నత, మధ్య స్థాయి అధికారులకు పాలనా శిక్షణ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ అధ్యయనాలకు వేదికగా నిలిచాయి. అయితే ఈ సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలతో తెరదించనుంది. సీసీపీతో సంబంధాలు ఉన్న విద్యార్థులను అమెరికా విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించకుండా చేసేందుకు ట్రంప్ సర్కారు కొత్త విధానాన్ని అమలు చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కుమార్తె కూడా హార్వర్డ్‌లో రహస్యంగా…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై రైతుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ గళమెత్తింది. సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ శక్తులు, కొందరు అధికారులు ఆయిల్ ఫెడ్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం తమ…

Read More

ఆయిల్ ఫెడ్ లో ‘సిద్ధిపేట’ కుంభకోణం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు ఆకాశాన్ని అంటాయి. అందులో పని చేసే కీలక అధికారులే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక ఎండీ ఈ అక్రమాలకు తెర లేపగా… దాన్ని ప్రస్తుతం ఒక మేనేజర్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రూ. 100 కోట్లకు పైగా మెక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు ఆయిల్ ఫెడ్ ను నట్టేట ముంచేశారు. వారి దుర్బుద్ధి కారణంగా ఆయిల్…

Read More