తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

చంద్రబాబు సరికొత్త సంప్రదాయం

సామాన్యులకు సలహాదారు పదవులు సహనం వందే, అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ…

Read More

రోడ్‌షోలు అవసరమా..?

సహనం వందే, ముంబై: బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు….

Read More

తిరుమలేశుని సేవలో ఆయిల్ ఫెడ్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ ఇద్దరి కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. వారిద్దరే ఆ సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆయిల్ ఫెడ్ లోని కీలక విభాగాల్లో పాగా వేశారు. దీంతో వారు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. వారు ఏం చెప్తే అది జరుగుతుంది. వారిద్దరి సేవలో ఆయిల్ ఫెడ్ సంస్థ పునీతమవుతుంది. వారే తిరుమలేశ్వర్ రెడ్డి… జొన్న సత్యనారాయణ. తిరుమలేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, కన్జ్యూమర్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ వంటి విభాగాలకు మేనేజర్…

Read More

డాక్టర్ కే చేతబడి

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒక డాక్టర్… హైదరాబాదు నగరంలో మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తులపై ఉప్పల్ ప్రాంతానికి చెందిన శివస్వామి అనే చేతబడి చేసే వ్యక్తి కన్నేశాడు. ఇంకేం రంగంలోకి దిగాడు. ‘నువ్వు నాకు గత జన్మలో సొంత అన్నవి. మనిద్దరం ఒక దేశానికి రాజులం. నాకున్న అతీంద్రియ శక్తులతో ఈ విషయాన్ని గుర్తించాను’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, ‘నువ్వు మామూలు డాక్టర్…

Read More

యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

Read More

మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…

Read More

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

సహనం వందే, బెంగళూరు: ‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేశం…ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్…

Read More

మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక…

Read More

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఘోరం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆసుపత్రి యంత్రాంగంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒకరు మృతి…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది….

Read More