గూగుల్‌కు ఎదురుదెబ్బ

వెబ్ యాడ్ వ్యాపారంలో గుత్తాధిపత్యం చెలాయించిందని కోర్టు తీర్పు సహనం వందే, వర్జినియా: టెక్ దిగ్గజం గూగుల్ తన వెబ్ ప్రకటనల వ్యాపారంలో చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్య సామ్రాజ్యాన్ని నిర్మించిందని అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు గూగుల్‌పై అమెరికా న్యాయశాఖ వేసిన యాంటీట్రస్ట్ కేసులో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో జడ్జి లియోనీ బ్రింకెమా గూగుల్ ఆన్‌లైన్ యాడ్ మార్కెట్‌లో పోటీని తగ్గించే విధంగా ప్రవర్తించిందని…

Read More

స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More

హంతకుడి చర్మంతో పుస్తకం

సహనం వందే, లండన్: బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా నిలిచిన పుస్తకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హంతకుడు విలియం కోర్డర్ చర్మంతో చేసిన అరుదైన పుస్తకం సఫోల్క్‌లోని మోయిసెస్ హాల్ మ్యూజియంలో త్వరలో సందర్శకులకు అందుబాటులో రానుంది. ఈ పుస్తకం ఊహించని విధంగా బయటపడటంతో దీని చుట్టూ చరిత్ర, నైతికతకు సంబంధించిన ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో సంచలనం సృష్టించిన “రెడ్ బార్న్ మర్డర్” కేసుతో ఈ పుస్తకానికి సంబంధం ఉంది. ఆనాటి…

Read More

హిందీ హిందువుల భాష… ఉర్దూ ముస్లింల భాష కాదు

సహనం వందే, ఢిల్లీ: హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి…

Read More

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More

ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

సహనం వందే, న్యూఢిల్లీ: 2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న…

Read More

కోవిడ్ తర్వాత పుంజుకున్న విమానయానం

సహనం వందే, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు భారీగా పడిపోయిన విమాన ప్రయాణాలు… గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ప్రపంచ వైమానిక ప్రయాణికుల సంఖ్య 2019 స్థాయిలను అధిగమించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం… 2024లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరుకుంది, ఇది 2019లో నమోదైన 4.5 బిలియన్ల కంటే ఎక్కువ. నాలుగేళ్లు దెబ్బ తిన్న విమానరంగం… 2020లో కోవిడ్ కారణంగా విమాన…

Read More