అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More

యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి…

Read More

కరెన్సీ వెనుక క్యాస్టిజం

(విజయ్ పుట్టపాగ, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి మహనీయుడి చిత్రం మన కరెన్సీ నోట్లపై లేకపోవడం కేవలం పొరపాటు కాదు, ఆధిపత్య వర్గాల కుట్ర. భారత రాజ్యాంగ శిల్పి, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక సూత్రధారి, కుల నిర్మూలన యోధుడైన అంబేద్కర్‌ను గౌరవించకపోవడం సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను సూచిస్తుంది. మహాత్మా గాంధీ జాతిపిత కాగా… అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన యోధుడు. దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరాధ్య…

Read More

ఢిల్లీలో రూ.10 లక్షలకు శిశువుల అమ్మకం!

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీలో మానవ సంబంధాలను మంటగలిపే ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక పెద్ద శిశువుల అక్రమ రవాణా ముఠాను సోమవారం పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా 35 మందికి పైగా పసి పిల్లలను ఒక్కొక్కరిని రూ.10 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హృదయ విదారకర సంఘటన ఆధునిక సమాజానికి మాయని మచ్చ. రాజస్థాన్, గుజరాత్ కేంద్రంగా దందా… ఈ స్మగ్లింగ్ ముఠా తమ కార్యకలాపాల కోసం రాజస్థాన్,…

Read More

బిలియనీర్ల ఆర్థిక ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: భారతదేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. మధ్యతరగతి కంటే తక్కువ పన్నులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమానతలకు కారణమవుతున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. అగ్రశ్రేణి బిలియనీర్లు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ తమ వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టి, సంపదను విదేశాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలు మాత్రం అధిక పన్నుల…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More

కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

26/11 రియల్ హీరో సదానంద్ డేట్

సహనం వందే, ఢిల్లీ:26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ విచారణకు 26/11 దాడుల్లో పోరాడిన హీరో, ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ నాయకత్వం వహిస్తుండటం విశేషం. అప్పుడు ముంబై దాడుల్లో గాయపడిన ఈ ఐపీఎస్, ఇప్పుడు అదే కేసులో అంతర్జాతీయ ఉగ్రవాదిని విచారణ చేయడం విశేషం. సదానంద్ డేట్ 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ముంబై దాడుల్లో అసమాన ధైర్యం…26/11 దాడుల…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More