ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

సహనం వందే, న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ…

Read More

మార్మోగిన ఔట్ సోర్సింగ్ గళం – మహా ధర్నా సక్సెస్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగ భద్రత, సమాన వేతనం కోసం పోరాడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గళం శనివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మార్మోగింది. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమాన వేతనం రాజ్యాంగ హక్కు:…

Read More

కారం చల్లి… సిగరెట్లతో కాల్చి…బహుజనుడిపై పోలీసుల రాక్షసత్వం

సహనం వందే, చెన్నై:పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఏ…

Read More

విశాఖ రైల్వేస్టేషన్‌లో జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్‌

సహనం వందే, విశాఖపట్నం:రైలు ప్రయాణికులకు విశ్రాంతి అందించేలా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సరికొత్త క్యాప్సుల్ హోటల్‌ ప్రారంభమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో తొలిసారిగా ఈ తరహా వసతి అందుబాటులోకి వచ్చింది. స్లీపింగ్ పాడ్స్ పేరుతో ఈ హోటల్‌ను మొదలుపెట్టారు. తక్కువ ధరకు ఏసీ గదులు, ఉచిత వైఫై, వేడి నీటి స్నానాలు, స్నాక్స్ వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు చక్కటి విశ్రాంతి కేంద్రంగా ఇది మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లోని మొదటి నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న మొదటి…

Read More

‘నాడి’పట్టే చెయ్యి’గాడి’తప్పుతోంది-డబ్బు కోసం వైద్యులు గడ్డి

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ ఇలా అనేకమంది వైద్యులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇప్పటికే లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు అందుతున్నా… ప్రైవేటు ప్రాక్టీస్ ఉన్నా కొందరు ఇంకా కోట్ల సంపాదనకు కుయుక్తులు చేస్తున్నారు. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా పేట్ల బుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసిన డాక్టర్ రజనీరెడ్డి ఎన్ఎంసీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆమె ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్…

Read More

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివ(క)క్ష

సహనం వందే, హైదరాబాద్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవమాన భారం మోస్తున్నారు. జీతం తక్కువ… ఛీత్కారాలు ఎక్కువ. నిబద్ధతతో సేవ చేస్తున్నప్పటికీ అవమానంతో మనుగడ సాగిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా… కనీసం విచారణ, నోటీసు లేకుండా ఒక సాధారణ ఫోన్ కాల్ ద్వారా తొలగిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు లేదు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 25-30% ఏజెన్సీలు తినేస్తున్నాయి. తెలంగాణలో రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు….

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల పోరుబాట -12వ తేదీన మహాధర్నా

సహనం వందే, హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఏజెన్సీలు కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు శనివారం (12వ తేదీన) హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాకు…

Read More

సీబీఐ వలలో డాక్టర్ రజినీరెడ్డి – మాజీ సూపరింటెండెంట్ పై కేసు

సహనం వందే, హైదరాబాద్:నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉల్లంఘించి పలు వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో మరో కీలక పేరు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జ్ మాజీ సూపరింటెండెంట్ రజినీరెడ్డి ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు. తనిఖీ బృందంలో పాత్ర…ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలో మాజీ సూపరింటెండెంట్ సభ్యులుగా ఉన్నారు. గత నెల 30న…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More