మందులు మింగేసిన వందల కోట్లు – 390 కోట్ల విలువైన ఔషధాలు మట్టిపాలు
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల చిల్లు పెట్టాయి. పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఆడిట్ నివేదికలో విస్తుపోయే నిజాలుతెలంగాణలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సేవల నిర్వహణపై కాగ్ నిర్వహించిన…