సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More

అపార్ట్‌మెంట్లు డ్రగ్స్ అడ్డాలు – పబ్‌, రిసార్ట్‌, ఫామ్‌హౌస్‌లపై నిఘాతో మార్పు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లలో చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన నేరగాళ్లు… ఇప్పుడు తమ కార్యకలాపాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసుల నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుని అక్కడే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో జరిగిన సంఘటన ఈ ప్రమాదకరమైన పోకడకు అద్దం పట్టింది. పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రేవ్ పార్టీ…

Read More

కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

సహనం వందే, అమెరికా:ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు…

Read More

రాజమండ్రి శ్రీచైతన్యలో ర్యాగింగ్‌ భూతం – ఇస్త్రీ పెట్టెతో ఒళ్ళు కాల్చిన సీనియర్లు

సహనం వందే, రాజమండ్రి:విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన విద్యాసంస్థలు ముఖ్యంగా హాస్టళ్లు ఇప్పుడు హింసకు అడ్డాగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై సహచరులు దారుణంగా ర్యాగింగ్‌ కు పాల్పడిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గుఱ్ఱం విన్సెంట్ ప్రసాద్ అనే పదహారేళ్ల విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి…

Read More

యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More

1న పింఛన్ విద్రోహ దినం – సభా పోస్టర్ విడుదల చేసిన నేతలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నెల 1వ తేదీన పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర, జిల్లా శాఖలు మంగళవారం ఆర్థిక, గణాంకాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్లు శ్రీకాంత్, విక్రమ్, కన్వీనర్లు వెంకట్, కృష్ణ యాదవ్‌తో పాటు టీజీఓ, టీఎన్జీఓ వంటి ఇతర సంఘాల…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More