ప్రాణత్యాగమే యుద్ధ వ్యూహం – కిమ్ సంచలనం… వీరత్వానికి కొత్త అర్థం
సహనం వందే, హైదరాబాద్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనికులకు మరణ శాసనం రాశారు. శత్రువుకు దొరికి బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే మిన్నని పిలుపునిచ్చారు. సైనికులను మనుషులుగా కాకుండా యుద్ధ యంత్రాలుగా మార్చి రష్యా కోసం బలిపీఠం ఎక్కిస్తున్న కిమ్ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణమే ఆఖరి ఆయుధంయుద్ధభూమిలో శత్రువుకు పట్టుబడటం అవమానమని కిమ్ తేల్చి చెప్పారు. ఒకవేళ చిక్కుకునే పరిస్థితి వస్తే ఆత్మాహుతికి పాల్పడాలని కఠిన ఆదేశాలు జారీ…