Supreme Court Judgement on OBC Quota

రిజర్వేషన్ల కోతపై కోర్టు కొరడా – ఓబీసీ క్రిమీలేయర్ గుర్తింపుపై కీలక తీర్పు

సహనం వందే, న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ గుర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయంలో కొత్త చర్చకు దారితీసింది. కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగానే రిజర్వేషన్ ఫలాలను ఆపడం అన్యాయమని కోర్టు తేల్చి చెప్పింది. అసలు సామాజిక హోదా అంటే ఏమిటి? ఎందుకు ఆదాయం మాత్రమే ప్రామాణికం కాకూడదు? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. సామాజిక హోదా అంటే ఏమిటి?ఓబీసీలలో సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు 1993లో ప్రభుత్వం ఒక పద్ధతిని తెచ్చింది. దీని ప్రకారం…

Read More
Weight loss

అందానికి అంత్యక్రియలు – బరువు తగ్గించే మాయా మందులు

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనే ఆశను ఫార్మా కంపెనీలు వ్యాపార అవకాశంగా మార్చుకున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులను సాధారణ సరుకుల్లా మార్చి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయి. శాస్త్రీయతను పక్కనబెట్టి లాభాలే పరమావధిగా సాగిస్తున్న ఈ కమర్షియల్ ట్రాప్ సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ అశాస్త్రీయ ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. మందుల ముసుగులో విషంబరువు తగ్గించే మందుల్లో ప్రధానంగా కనిపిస్తున్నవి జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ మందులు. ఇవి…

Read More
War disrupts Global Flights

గగనంలో ఎగరలేం – ఇరాన్ యుద్ధం విమానయానానికి అడ్డం

సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. కోవిడ్ తర్వాత మళ్ళీ కోలుకుంటున్న పరిశ్రమకు ఈ యుద్ధం ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరల మంట విమానయాన సంస్థల లాభాలను ఆవిరి చేస్తోంది. గ్లోబల్ ట్రావెల్ నెట్‌వర్క్ ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలో ఉంది. ఆకాశంలో పెరిగిన ఉద్రిక్తతఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు…

Read More
Night time Sun -- Innovation by Scientists

రాత్రిపూట సూర్యుడు… నిద్రపోనీయడు – ఆకాశంలో అద్దాలు… రాత్రి సూర్యకాంతులు

సహనం వందే, హైదరాబాద్: భూమి మీద పగలు మాత్రమే దొరికే సూర్యరశ్మిని రాత్రి కూడా వాడుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కల్పనలా ఉన్నా ఇది నిజం కాబోతోంది. అంతరిక్షంలో అద్దాలను ఉంచి భూమి మీదకు కాంతిని పరావర్తనం చెందించే టెక్నాలజీని ఒక స్టార్టప్ సంస్థ ఇప్పుడు తెరపైకి తెస్తోంది. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా అత్యవసర సమయాల్లోనూ వెలుగును నింపుతుందన్నది సదరు సంస్థ వాదన. అద్దాల అద్భుతంకాలిఫోర్నియాలోని హాథోర్న్‌కు చెందిన రిఫ్లెక్ట్…

Read More
Titanic Statue Trump and Epestein

టైటానిక్ ఎక్కిన ట్రంప్ – ఎప్‌స్టీన్ తో ట్రంపు విగ్రహం‌ ప్రకంపనలు

సహనం వందే, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుకున్నారు. దేశ రాజధానిలో వెలసిన వింత విగ్రహాలు ఒకవైపు… ఇరాన్ వేసిన వ్యంగ్యచిత్రం మరోవైపు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేర చరిత్ర కలిగిన ఎప్‌స్టీన్ నీడ ట్రంప్‌ను వెంటాడుతోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ దౌత్యంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. విగ్రహాల వెనుక రహస్యంవాషింగ్టన్ మాల్ పార్కులో వింత విగ్రహాలు వెలుగుచూశాయి. ట్రంప్, ఎప్‌స్టీన్ టైటానిక్ తరహా పోజులో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది….

Read More
Youth Billlionaries

మ్యాథ్స్ పట్టు… కోట్లు కొల్లగొట్టు – ఇరవై ఏళ్లకే అపర కుబేరులు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదికపై ఇప్పుడు అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. 30 ఏళ్ల వయసు నిండకముందే వేల కోట్ల సామ్రాజ్యాలను శాసిస్తున్న యువ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. కృత్రిమ మేధస్సు, వంశపారంపర్యంగా అందిన ఆస్తుల కలయికతో ఈ కొత్త తరం కుబేరులు పాతతరం రికార్డులను తిరగరాస్తున్నారు. సాంకేతికత, సంప్రదాయ వ్యాపారాల మధ్య సమతుల్యత పాటిస్తూ వీరు ప్రపంచ మార్కెట్లను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ఏఐ సృష్టించిన కొత్త సంపదప్రస్తుతం ముప్పై…

Read More
Urea Crisis in India due to Iran war

యుద్ధం పొగ… యూరియాకు సెగ – గ్యాస్ సరఫరా ఆగడంతో మూతపడ్డ ప్లాంట్లు

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ఎరువుల ఫ్యాక్టరీల గొంతును నొక్కేస్తోంది. సహజ వాయువు సరఫరా ఆగిపోవడంతో భారత రైతుల పొలాల్లో పంటలు పండించే శక్తి తగ్గిపోతోంది. దేశీయ తయారీ కేంద్రాలు నిలిచిపోయాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని దేశం మొత్తం భయంతో చూస్తోంది. అసలు ఏం జరుగుతోంది. యుద్ధం పెంచిన కష్టంఇరాన్ యుద్ధం దేశ ఇంధన సరఫరాను అతలాకుతలం చేసింది. ఖతార్ నుంచి…

Read More
Glamour Billionaires

గ్లామర్ బిలియనీర్స్ – వేలకోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు

సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో కీర్తి ఇప్పుడు కేవలం చప్పట్లకే పరిమితం కాలేదు. అది భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి పునాదిగా మారుతోంది. కళాకారులు, క్రీడాకారులు కేవలం ఉద్యోగుల్లా కాకుండా యజమానుల్లా ఆలోచిస్తున్నారు. సొంత బ్రాండ్లు, వ్యూహాత్మక పెట్టుబడులతో తమ పాపులారిటీని పది అంకెల ఆస్తిగా మార్చుకుంటున్నారు. 2026 ఫోర్బ్స్ జాబితాలో ఈ ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. స్పీల్‌బర్గ్ అగ్రస్థానంప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 59640 కోట్ల రూపాయల నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు….

Read More
Iran water War starts

ఇరాన్ ‘జలాయుధం’ – హోర్ముజ్ జలసంధిపై ఉక్కుపాదం

సహనం వందే, ఇరాన్: ప్రపంచ దేశాల గుండెలపై ఇరాన్ గన్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రపంచ చమురు సరఫరాను నిర్బంధించింది. ఇజ్రాయిల్, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా చమురు ఎగుమతులను ఆపేస్తామని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వ్యూహాత్మక జలసంధిపై ఆంక్షలుప్రపంచ క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు హోర్ముజ్ జలసంధి ప్రధాన మార్గం….

Read More
Netflix Production Hub

హైదరాబాదులో నెట్‌ఫ్లిక్స్ వీఎఫ్ఎక్స్ – రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ హబ్ సేవలు

సహనం వందే, హైదరాబాద్: గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌ నగరంలో అడుగుపెడుతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ కంటెంట్ తయారీలో నగరం ఇప్పుడు ప్రపంచస్థాయి వేదికగా మారుతోంది. ఈ భారీ పెట్టుబడి భారతీయ మీడియా రంగాన్ని సరికొత్త మలుపు తిప్పనుంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఇది ఒక పెను మార్పుకు నాంది. ప్రపంచస్థాయి సాంకేతికతఈ నెల 12న (రేపు) ఈ పోస్ట్ ప్రొడక్షన్ హబ్ తన కార్యకలాపాలను…

Read More
Iran war - Gas crisis

పొయ్యి వెలగలేదు… శవం లేవలేదు – ఇంట్లో ఇరాన్ మంటలు… స్మశానంలో సెగలు

సహనం వందే, హైదరాబాద్: జీవితం గడిచిపోయిన తర్వాత మనిషికి దక్కే కడసారి గౌరవం కూడా ఇప్పుడు యుద్ధపు సెగలకు బలి అవుతోంది. పశ్చిమ ఆసియాలో (ఇరాన్) మండుతున్న యుద్ధం… వేల మైళ్ల దూరంలోని పూణే శ్మశానవాటికల గ్యాస్ చితులను ఆపేసింది‌. బెంగళూరు వంటింటి పొయ్యిలను చల్లార్చే వరకు విస్తరించింది. అంతర్జాతీయ రాజకీయాల ఆటలో ఒక సామాన్యుడి చివరి ప్రయాణం ఎంతటి అనిశ్చితిలో పడిందో చెప్పడానికి ఇదొక విషాద దృశ్యం. చివరి ప్రయాణానికి ఆగిన బాట…పూణె మున్సిపల్ కార్పొరేషన్…

Read More
GenZ Politics in Nepal

జెన్ జెడ్ విప్లవం… కుర్రాళ్ల రాజ్యం – నేపాల్‌లో యువకుల చేతుల్లోకి రాజ్యాధికారం

సహనం వందే, నేపాల్: హిమాలయాల చెంత జెన్ జెడ్ యువత గర్జించింది. పాత తరం రాజకీయ నాయకుల కోటలు బద్దలయ్యాయి. ఒకప్పటి రాపర్ గాయకుడు… ఖాట్మండు మాజీ మేయర్ బలేన్ షా నేతృత్వంలో సరికొత్త చరిత్ర మొదలైంది. అవినీతిపై తిరగబడ్డ యువత బ్యాలెట్ బాక్సుల ద్వారా తమ ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు… ఒక తరం మార్పునకు నిదర్శనం. యువ కెరటంనేపాల్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి…

Read More
Scam Lands - Fake Police ...

ఉత్తుత్తి పోలీస్… నకిలీ పెళ్ళామ్స్ – ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్న నేర సామ్రాజ్యం

సహనం వందే, హైదరాబాద్: మనం క్లిక్ చేసే ప్రతి లింక్ వెనుక ఒక భారీ నేర సామ్రాజ్యం దాగి ఉంది. మీ జేబుకు చిల్లు పెట్టే కిలాడీలు ఇప్పుడు ఖండాంతరాలు దాటి విస్తరించారు. జమ్తారా చీకటి వీధుల నుంచి కంబోడియా రక్తపాత గదుల వరకు సాగుతున్న ఈ దగా వెనుక ఉన్న భయంకరమైన నిజాలు తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఇది కేవలం దొంగతనం కాదు… ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్‌వర్క్. స్నిగ్దా పూనం అన్వేషణప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్…

Read More
India's Billionaires and Bankers

కుబేరుల కోసం బ్యాంకర్ల త్యాగం – కోటీశ్వరులకు 100 మంది బ్యాంకర్ల తోడు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో కొత్త కుబేరుల జాతర మొదలైంది. ఒకప్పుడు కేవలం పాత తరం వ్యాపారస్తుల వద్దే ఉన్న సంపద… ఇప్పుడు టెక్నాలజీ స్టార్టప్ రంగాల పుణ్యమా అని యువత చేతుల్లోకి వస్తోంది. ఈ భారీ డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ పెంచాలి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యాపారమే వెల్త్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఇదే రంగంలోకి బిలియనీర్ అన్షు జైన్ తన భారీ అస్త్రాలతో దిగుతున్నారు. జైన్ ఇచ్చే ఆర్థిక రక్షణఅన్షు జైన్ వ్యాపారం…

Read More
Rejection Sensitive Dysphoria

మాటతో మనసు అల్లకల్లోలం – విమర్శను తట్టుకోలేని వింత వ్యాధి

సహనం వందే, రాజమండ్రి: చిన్న మాట… చిన్న జోక్… చిన్న విమర్శ. సాధారణంగా ఇవి రోజువారీ జీవితంలో భాగమే. కానీ కొందరికి మాత్రం ఇవే నరకంగా మారుతున్నాయి. ఎవరైనా తనను తిరస్కరించారని భావించిన క్షణంలోనే తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ఒక కొత్త రుగ్మత ఇప్పుడు వైద్య ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీనినే ‘రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా’గా పిలుస్తున్నారు. విమర్శలు, ఎగతాళి, నిరాకరణలను తట్టుకోలేక బాధితులు తీవ్రమైన మానసిక, శారీరక ప్రతిచర్యలను అనుభవిస్తున్నారు. అతి సున్నితత్వమే పెద్ద…

Read More
Nikhila

అఖిలాంధ్ర సేవలో ‘నిఖిల’ – ఎంపీ అప్పలనాయుడు కూతురి పేరుతో ట్రస్ట్

సహనం వందే, రణస్థలం: ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాము ముందుంటామని ఆయన నిరూపిస్తున్నారు. నిఖిల పేరిట కొత్త ఆశలువిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సతీమణి ప్రభ నాయుడు ఆదివారం నిఖిల చారిటబుల్ ట్రస్ట్‌ను…

Read More
Ali LariJani - Iran War

రగిలే అగ్నిపర్వతం – ఇరాన్ యుద్ధ వ్యూహకర్త అలీ లారిజానీ

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు కుప్పకూలడం లేదు. ఈ అజేయమైన మనుగడ వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహాలు… వారి తెగింపును ప్రిన్స్‌టన్ ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ విశ్లేషించారు. అగ్నిపర్వతంలా మండుతోన్న ఆ దేశాన్ని తన వ్యూహాలతో శాసిస్తున్న వ్యక్తి అలీ లారిజానీ. అమెరికా, ఇజ్రాయెల్ గర్జనలకు భయపడకుండా ఆయన గీస్తున్న గీత…

Read More
Google CEO Sundar Pichai

బాక్స్ బద్దలయ్యే బాస్ జీతం – గూగుల్ సీఈఓ పిచాయ్‌పై 6361 కోట్ల వర్షం

సహనం వందే, హైదరాబాద్: గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా రూ. 6361 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్‌కు లభించిన అత్యంత భారీ పారితోషికాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపుతున్న చొరవకు, బాధ్యతలకు ఇచ్చే ప్రతిఫలంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ వర్గాల్లో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఖరగ్ పూర్…

Read More
CPM Veera Bhadram

తుపాకి గొట్టం నేలమట్టం – నక్సలిజం అంతం… సీపీఎంలో ‘వీర’విద్రోహం

సహనం వందే, హైదరాబాద్: తుపాకి గొట్టం ద్వారానే అధికారం దక్కుతుందని నమ్మిన నక్సలైట్ల ప్రస్థానం ముగిసింది. విప్లవ పంథా విఫలమైందని గుర్తించిన 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే సీపీఎంలో లాబీయింగ్‌లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో అల్లకల్లోలానికి దారితీశాయి. విప్లవ పతనం దిశగా…తెలంగాణలో ఎర్రజెండా పట్టు సడలిపోయింది. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు…

Read More
Farmer Funds

రైతు సంక్షేమమా? కార్పొరేట్ జూదమా? – నాబార్డు ఆర్థిక ప్రయోగంపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్‌లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో…

Read More
US Vs India's Rise

అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అగ్రరాజ్యం వక్రబుద్ధి…చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే…

Read More
Brain Hacking

బ్రెయిన్ హ్యాకింగ్ – డిస్కవరేటివ్ టెక్నాలజీకి చైనా శ్రీకారం

సహనం వందే, హైదరాబాద్: చైనా బిలియనీర్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుందో అదే ఆలోచనా విధానాన్ని యంత్రాలకు నేర్పించే డిస్కవరేటివ్ ఏఐ ప్రయోగం ప్రారంభించారు. ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేసే సమయంలో మెదడు ఎలా పనిచేస్తుందో ఏఐ విశ్లేషిస్తుంది. ఆ తర్కాన్ని అల్గోరిథమ్ రూపంలోకి మార్చి అదే విధంగా యంత్రం ఆలోచించేలా రూపొందిస్తారు. ఇది విజయవంతమైతే శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించవచ్చని నిపుణులు…

Read More
Iran War with AI

ఏఐ మార్చిన యుద్ధ చరిత్ర – ఇరాన్ పై యుద్ధంలో మూడు ఏఐలే కీలకం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం…

Read More
Barbie ga Cricketer Mandhana

బార్బీ బొమ్మ ‘క్రికెటర్’మ్మ – క్రికెటర్ మంధానకు మహిళా దినోత్సవ కానుక

సహనం వందే, హైదరాబాద్: క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తున్న మహిళా మణులు ఇప్పుడు ఆట బొమ్మలుగా అవతరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన మట్టెల్ సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా స్టార్లను బార్బీ బొమ్మలుగా రూపొందించింది. ఇది కేవలం బొమ్మల తయారీ మాత్రమే కాదు… భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చే అడుగు. కలల జట్టులో చేరికమట్టెల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మొట్టమొదటి బార్బీ డ్రీమ్ టీమ్‌లో స్మృతి…

Read More
Vijay Thrisha

పాత స్నేహమా? కొత్త బంధమా? – పెళ్లి వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష

సహనం వందే, తమిళనాడు: తమిళ స్టార్ విజయ్, త్రిషల కెమిస్ట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఒక వివాహ వేడుకకు ఈ జంట కలిసి హాజరవ్వడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్న వేళ వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం స్నేహమా లేక కొత్త బంధమా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఒకే కారులో ప్రయాణంతమిళ హీరో విజయ్, నటి త్రిష కృష్ణన్ కలిసి…

Read More
Online Fake Face Makeup Creams

మేకప్పు మహాగబ్బు – ముఖానికి మలమూత్ర క్రీమ్

సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్‌లైన్‌ లో తక్కువ ధరకు దొరికే బ్రాండెడ్ మేకప్ సామాగ్రిలో మానవ విసర్జితాలు, మూత్రం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు.. యువత ప్రాణాలను విషపూరిత రసాయనాలకు తాకట్టు పెడుతున్నాయి. అందం కోసం చేసే ఆరాటం కాస్తా ఆసుపత్రి పాలయ్యేలా చేస్తున్న…

Read More
Damodhar Rajanarasimha

అమ్మ ఆరోగ్యం… దామన్న యజ్ఞం – ఇంటి దీపానికి ఇమ్యూనిటీ కవచం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఇంటికి దీపం ఇల్లాలు అన్న సూత్రంతో 46 లక్షల మంది మహిళల సమగ్ర ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా భారీ కార్యాచరణ సిద్ధమైంది. కేవలం రోగాల నిర్ధారణే కాకుండా నివారణా చర్యలతో కూడిన ఈ సరికొత్త హెల్త్ మోడల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారీ స్క్రీనింగ్ ప్లాన్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల కోసం…

Read More
Hindi Language issue at Thiruchurapalli

హిందీ రాతపై రగిలిన జ్వాల – తిరుచి రైల్వే కార్యాలయం వద్ద తమిళ గర్జన

సహనం వందే, తిరుచిరాపల్లి: భాషా ప్రాతిపదికన దేశంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హిందీ పేరు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాల్ చేసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది కేవలం ఒక బోర్డు తొలగింపు మాత్రమే కాదు. ద్వారం వద్ద వివాదంతిరుచిరాపల్లి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద కొత్తగా…

Read More
MP Kalisetti Iftar

ఇఫ్తార్ విందుల్లో కలిశెట్టి సందడి – మసీదుల్లో ఎంపీ అప్పలనాయుడు ప్రార్థనలు

సహనం వందే, విజయనగరం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన అందరినీ ఆత్మీయంగా పలకరించారు. సుదీర్ఘ పర్యటనలో ఎంపీఅప్పలనాయుడు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లోని మసీదులను సందర్శించారు. నెల్లిమర్ల, ఎచ్చెర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలతో పాటు రాజాం…

Read More
AI War

కృత్రిమ మేధ నేతల వధ – ఏఐతో రక్తపాతం… డ్రోన్లతో యుద్ధం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిఘా వ్యవస్థ ఇప్పుడు అణుబాంబు కంటే విధ్వంసకరంగా మారింది. ఒకప్పుడు కేవలం ఫోన్ ట్యాపింగ్‌కే పరిమితమైన నిఘా నేడు కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల సాయంతో నియంతల బెడ్రూంల వరకు చొచ్చుకెళ్లింది. కిలోమీటర్ల భూగర్భంలో దాక్కున్నా సరే వేలాది మైళ్ల దూరంలోని వైట్ హౌస్ నుండి శత్రువు గుండెపై గురిపెట్టగలిగేలా ఈ డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించింది. ఇది కేవలం గూఢచర్యం కాదు.. ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న ఒక అదృశ్య సాంకేతిక…

Read More
Tammineni

తమ్మినేని వీర’భ్రష్టం’ – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. తమ్మినేనిపై క్రమశిక్షణ వేటుసీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ…

Read More
Kalisetti Bharosa to Bahrain

యుద్ధ భయం… కలిశెట్టి అభయం – బహ్రెయిన్ లో చిక్కుకున్న వారికి ఎంపీ అండ

సహనం వందే, విజయనగరం: అమెరికా ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధజ్వాలలు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న వేలాదిమంది ప్రవాసాంధ్రుల జీవితాలను ఒక్కసారిగా అల్లకల్లోలం చేశాయి. బహ్రెయిన్ వంటి దేశాల్లో చిక్కుకున్న తమ వారి క్షేమం కోసం ఇక్కడ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఉత్కంఠ భరిత తరుణంలో వారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భరోసా కల్పించారు. యుద్ధ నీడలో బహ్రెయిన్అమెరికా ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్న ప్రస్తుత యుద్ధ పరిస్థితులు బహ్రెయిన్ ద్వీపాన్ని వణికిస్తున్నాయి….

Read More
Ropinirole Stimulates the dopamine

మాత్రతో ‘మాయరోగం’ – రోగులను రేపిస్టులుగా మార్చే మెడిసిన్

సహనం వందే, హైదరాబాద్: ఆధునిక వైద్యం పేరిట బహుళజాతి ఫార్మా సంస్థలు సాగిస్తున్న రసాయన మారణకాండ బట్టబయలైంది. పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు ఇచ్చే మందులు రోగులను నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మారుస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వరకు విస్తరించిన ఈ వ్యసనాల ఉప్పెన వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. రోపినిరోల్ వంటి డోపమైన్ అగోనిస్ట్ మందుల వాడకం వల్ల రోగుల ప్రమేయం లేకుండానే వారి మెదడు నియంత్రణ తప్పుతోంది. ఫలితంగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు సైతం…

Read More
Betting against Khamenei Death

బాంబు పడకముందే పేలిన బెట్టింగ్స్ – ఖమేనీ మరణంపై 1200 కోట్ల పందెం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. కానీ ఈ విషాదం వెనుక ఒక చీకటి వ్యాపారం కోట్లలో లాభాలను గడించింది. యుద్ధ క్షేత్రంలో బాంబులు పడకముందే బెట్టింగ్ మార్కెట్లలో కాసుల వర్షం కురిసింది. ఇది కేవలం అంచనా మాత్రమేనా లేక ముందస్తుగా అమ్ముడుపోయిన సైనిక రహస్యమా అనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. పాలిమార్కెట్ మాయాజాలంపాలిమార్కెట్ అనేది క్రిప్టో ఆధారిత వికేంద్రీకృత ప్రిడిక్షన్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ…

Read More
Dharavi becomes Tourist place

పేదరికమే పాపులర్ టూరిజం – ముంబై ధారావి ఇప్పుడు టూర్ హాట్‌స్పాట్

సహనం వందే, ముంబై: ముంబైలోని చిమ్మచీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15 వేల రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడ మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనశాల. పేదల బతుకు చిత్రాన్ని ఒక పర్యాటక వస్తువుగా మార్చేసిన వైనంపై విశ్లేషణ ఇది. పేదరికపు ప్రదర్శనశాలధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు….

Read More
AK Khan and Kalisetti

భళా కలిశెట్టి – మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ ప్రశంస

సహనం వందే, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఒక అరుదైన కలయికకు వేదికయ్యాయి. ఈ వేడుకలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిశెట్టిని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అభినందించడం విశేషం. ఆయన కలిశెట్టి రాజకీయ సేవలను కొనియాడారు. ‘విలువలు కలిగిన రాజకీయవేత్త అప్పలనాయుడుకు ప్రేమతో’ అని రాసిన పుస్తకాన్ని బహూకరించారు. ఏకే ఖాన్ నుంచి ఈ గుర్తింపు రావడం పట్ల కలిశెట్టి…

Read More
Nobel Prize Vs Trump

నోబెల్ బహుమతికి రక్తాభిషేకం – ఇరాన్ అగ్నిగుండంలో కాలిపోతున్న ప్రైజ్

సహనం వందే, హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధ బాట పట్టారు. పదేళ్ల కిందట ఇతర దేశాల జోలికి వెళ్లనని చెప్పిన ఆయన ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడినే అంతం చేశారు. అమెరికా సైనిక శక్తిని వాడుతూ మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి తెరలేపారు. గతంలో తాను చెప్పిన మాటలన్నీ తుంగలో తొక్కే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ విధానాలను అమెరికా ప్రసిద్ధ పత్రిక…

Read More
Weekend Crime dramas

వారమంతా పని… వీకెండ్ లో ఖూనీ! – క్రైమ్ టూరిజంతో వేల కోట్ల వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్: నిశ్శబ్దంగా ఉన్న ఒక విలాసవంతమైన రిసార్టులో అకస్మాత్తుగా ఒక కేక వినబడుతుంది. కాసేపటికే ఒక శవం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పర్యాటకులు భయపడకుండా వెంటనే డిటెక్టివ్ డైరీలు తీసి ఆధారాలు వెతకడం మొదలుపెడతారు. ఇది నిజమైన నేరం కాదు… వేల రూపాయలు చెల్లించి కొనుక్కున్న ఒక ‘మర్డర్ మిస్టరీ’ వినోదం. ప్రస్తుతం అమెరికాతో సహా అనేక దేశాల్లో ఈ వింత పర్యాటకం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ధనవంతులు తమ వారాంతపు సెలవుల్లో రక్తపాతం,…

Read More
SBI Life Insurance Elderly

కాటికిపోయే వయసులో ఇన్సూరెన్స్ పాలసీ – 82 ఏళ్లకు జీవిత బీమా పాలసీల అమ్మకం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ అనేది ఒక నిశ్శబ్ద ఆర్థిక నేరంలా వేళ్లూనుకుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సామాన్యుల నమ్మకాన్ని యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. రిటైర్ అయిన వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తమే లక్ష్యంగా ఈ వ్యవస్థీకృత దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పాలసీలు అంటగడుతూ అమాయకుల జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ దారుణం ఇది. నమ్మించి గొంతు కోసిన ఎస్‌బీఐకోల్‌కతాకు చెందిన మీరా దాస్ ఉదంతం ఈ వ్యవస్థీకృత మోసానికి…

Read More
Vetlapalemm Issue

గోదావరి తీరాన మరణ మృదంగం! – కాకినాడలో భారీ పేలుడు… 20 మంది మృతి

సహనం వందే, కాకినాడ/రాజమండ్రి: ఉమ్మడి గోదావరి జిల్లాలు వరుస విషాదాలతో వణికిపోతున్నాయి. ఒకవైపు శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఐదుగురిని బలితీసుకున్నాయి. పారిశ్రామిక భద్రత, ఆహార కల్తీ అంశాల్లో వ్యవస్థల వైఫల్యం ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తోంది. యంత్రాంగం నిర్లక్ష్యంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వేట్లపాలెంలో మృత్యుఘోషసామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది….

Read More
MNJ Director issue

ఎంఎన్జే డైరెక్టర్ నియామకంపై రచ్చ -ప్రొఫెసర్లు, డాక్టర్ల తీవ్ర నిరసన

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా సంస్థను నమ్ముకుని సేవలందిస్తున్న నిపుణులను కాదని, పారదర్శకత లేని రీతిలో బయటి వ్యక్తిని ఎంఎన్జే డైరెక్టర్‌గా నియమించడంపై హైదరాబాద్‌లోని ఎంఎన్జేలో పెను తుఫానుకు దారి తీసింది. ఈ నిర్ణయం కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు… ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నాణ్యతను, అంతర్గత నైపుణ్యాన్ని అవమానించడమేనని అక్కడి సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలకు పాతరఎంఎన్జేలో డైరెక్టర్ నియామకం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. సంస్థలో…

Read More
Renu Desai

నీచపు రాతలు… గుండె కోతలు – నటి రేణూ దేశాయ్‌ ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు సృష్టించే విష సంస్కృతికి ఒక మహిళ ఎలా బాధితురాలిగా మారుతుందో నటి రేణూ దేశాయ్‌ ఉదంతం అద్దం పడుతోంది. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడినందుకు ఆమెపై జరుగుతున్న సోషల్ మీడియా దాడి మానవత్వం గీత దాటింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆమెను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది. విడాకుల నాటి వెతలుకుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్‌ చేస్తున్నారని వాపోయింది…

Read More
Liquor Case Clean Chit to Kejriwal and Kavitha

మట్టిలో కలిసిన మద్యం కేసు – కేజ్రీవాల్, కవితకు విముక్తి

సహనం వందే, హైదరాబాద్: దేశ రాజకీయాలను రెండేళ్లపాటు కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అట్టహాసంగా మొదలై అభాసుపాలైంది. దర్యాప్తు సంస్థల ఆర్భాటం కోర్టు బోనులో పేకమేడలా కూలిపోయింది. అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలకు క్లీన్ చిట్ లభించడంతో కేంద్ర ప్రభుత్వ విచారణా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు ఈ తీర్పు బలం చేకూర్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు…

Read More
Six planet in one Line on Sunday

ఆకాశంలో ఆరు గ్రహాల ఊరేగింపు – రేపు ఒకే లైన్‌లో లోకాల విందు

సహనం వందే, హైదరాబాద్: అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలో ఆరు గ్రహాల కొలువు ఖగోళ ప్రియులను అలరించనున్నాయి. ఈ గ్రహాల కవాతును చూడాలంటే సమయం, సరైన ప్రదేశం ముఖ్యం. ప్రకృతి ప్రసాదించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేఘాలు అడ్డుపడకుంటే ఈ విందును స్పష్టంగా చూడవచ్చు. హైదరాబాద్‌లో ఎప్పుడు చూడాలి?ముంబైతోపాటు హైదరాబాద్‌లో ఆదివారం ఈ గ్రహాల పరేడ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం…

Read More
Death is legality in Jersy

చావుకు చట్టం… బతుకు కష్టం – జెర్సీలో మరణం హక్కు

సహనం వందే, జెర్సీ: తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ ప్రాణాలను తీసుకోవడానికి జెర్సీ ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతి ఇచ్చింది. చనిపోవాలనుకునే హక్కును కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది బ్రిటీష్ దీవుల్లోనే ఒక సంచలన మార్పుగా మారింది. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక వాదనలు మొదలయ్యాయి. చట్టబద్ధమైన మరణంజెర్సీ ప్రభుత్వం అసెస్టెడ్ డయింగ్ చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారు గౌరవప్రదంగా తనువు చాలించవచ్చు. ఈ మేరకు…

Read More
Plumber to MP in Britan

పార్లమెంటుకు ప్లంబర్ – బ్రిటన్ లో గ్రీన్ పార్టీ సంచలనం

సహనం వందే, బ్రిటన్: బ్రిటన్ రాజకీయాల్లో ఒక సామాన్య ప్లంబర్ సంచలనం సృష్టించింది. పైపులు బాగు చేసే చేతులతోనే దేశ భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమైంది. గ్రీన్ పార్టీ అభ్యర్థి హన్నా స్పెన్సర్ ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడుతోంది. ఇది కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు శ్రమజీవుల గొంతుకకు దక్కిన గౌరవం. కోటీశ్వరుల జేబులు నింపే రాజకీయాలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. 34 ఏళ్ల వయసులో హన్నా…

Read More
Davos Forum - Epstein Files

దావోస్ వరల్డ్ ఎకనామి’సెక్స్’ ఫోరం – ఫోరం సీఈవో పదవికి బోర్గే బ్రెండే రాజీనామా

సహనం వందే, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై కామాంధుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాపాల చిట్టా పెను తుపాను సృష్టిస్తోంది. 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు రావడంతో ప్రపంచ దేశాల హేమాహేమీలు వణికిపోతున్నారు. జనవరి నెల నుంచి మొదలైన ఈ ఫైళ్ల ప్రకంపనలు అగ్రనేతల పదవులకు ఎసరు పెడుతున్నాయి. కేవలం సెక్స్ ట్రాప్, స్నేహం మాత్రమే కాదు అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాల ముసుగులో సాగిన ఈ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దావోస్ వేదికగా దందా…వరల్డ్ ఎకనామిక్…

Read More
80years Teenagers

‘ఎనభై’ ఏళ్ల టీనేజర్లు – మెదడులో మారని పదును!

సహనం వందే, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ మెదడు క్షీణించడం ప్రకృతి సహజం. మతిమరుపు రావడం సర్వసాధారణం. కానీ కొందరి మెదళ్లు మాత్రం ‘ఎనభై‘ ఏళ్ల వయసులోనూ 30-50 ఏళ్ల నాటి చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది మానవ మేధస్సు పరిణామక్రమంలోనే ఒక అద్భుతమైన మలుపుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. వినూత్న పరిశోధననేచర్ జర్నల్‌లో గురువారం ఒక సంచలన పరిశోధనా పత్రం వెలువడింది. వృద్ధాప్యంలోనూ మెదడులో కొత్త కణాలు…

Read More
Pickle Ball

పికిల్ బాల్… టాప్ లెవెల్ – యువతను ఊపేస్తున్న కొత్త ఆట

సహనం వందే, విశాఖపట్నం: గత కొన్ని నెలలుగా మన సామాజిక వర్గాల్లో పికిల్ బాల్ హవా నడుస్తోంది. అకస్మాత్తుగా ప్రజలు కోర్టులను బుక్ చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు ఈ ఆటతో నిండిపోయాయి. అందరూ క్రీడా ప్రేమికులుగా మారిపోతున్నారు. అసలు ఈ ఆట వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఏమిటీ పికిల్ బాల్?పికిల్ బాల్ అనేది టెన్నిస్, బ్యాడ్మింటన్ కలయికతో రూపొందిన క్రీడ. ఇందులో ప్యాడిల్స్, రంధ్రాలున్న ప్లాస్టిక్ బంతిని వాడతారు. ఇది చూడటానికి…

Read More
Open AI Chat GPT packages by Sam Altman CEO

చాట్ జీపీటీలో కోట్ల కిరీటం – ఉద్యోగుల ఖాతాల్లో నోట్ల కట్టలు

సహనం వందే, సిలికాన్ వ్యాలీ: ప్రపంచాన్ని తన అరచేతిలోకి తెచ్చిన చాట్ జీపీటీలో కోట్ల వర్షం కురుస్తుంది. దాని సృష్టికర్త ఓపెన్ ఏఐ ఇప్పుడు జీతాల విషయంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. టెక్ ప్రపంచంలో గూగుల్, మెటా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి తన ఉద్యోగులకు కళ్లుచెదిరే వేతనాలు అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన వీసా ఆంక్షలు, 84 లక్షల రూపాయల భారీ ఫీజులను సైతం బేఖాతరు చేస్తూ ప్రపంచవ్యాప్త ప్రతిభను ఈ…

Read More
Sleep Shame

కునుకు కోసం కుమ్ములాట – నిద్ర పట్టక నరకయాతన… బెడ్ మీద గడబిడ

సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. కానీ ఆధునిక కాలంలో ఇది ఒక సామాజిక హోదాగా… ఆరోగ్య పరీక్షగా మారిపోయింది. రాత్రిపూట కంటిమీద కునుకు రాకపోవడమే ఒక ఎత్తయితే… దాని గురించి కుమిలిపోవడం ఇప్పుడు కొత్త సమస్యగా పరిణమించింది. దీనినే వైద్య నిపుణులు స్లీప్ షేమ్ అని పిలుస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోలేకపోతున్నామనే అపరాధ భావం మనిషిని మానసిక రోగిని చేస్తోంది. ఈ ఒత్తిడి వల్ల నిద్రకు మరింత దూరం అవుతున్న…

Read More
Uber No Traffic

కిందా పైనా ఉబర్… ట్రాఫిక్ లేదు బ్రదర్ – ఎగిరే ట్యాక్సీలతో గాలిలో విహారం

సహనం వందే, దుబాయ్: ట్రాఫిక్ కష్టాలకు ఇక కాలం చెల్లిపోనుంది. రోడ్ల మీద రయ్‌మని దూసుకెళ్లే ఊబర్ ట్యాక్సీలు ఇప్పుడు ఆకాశంలో ఎగరడానికి సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా ఈ సరికొత్త రవాణా విప్లవం మొదలవుతోంది. జోబీ ఏవియేషన్ భాగస్వామ్యంతో ఊబర్ సంస్థ ఎగిరే ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తోంది. ఇది కేవలం కల కాదు… ఈ ఏడాదే సామాన్యులకు అందుబాటులోకి రానున్న వాస్తవం. గాలిలో ప్రయాణిస్తూ గమ్యాన్ని వేగంగా చేరుకోవడమే ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం. దుబాయ్ ఆకాశంలో…

Read More
Modi Comments of Gandhi

విప్లవకారులకు కాషాయం జోహార్లు – గాంధీ అహింసతోనే స్వాతంత్రం రాలేదు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చరిత్ర ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాల చరిత్రను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో జరిగిన మార్పులు దీనికి నిదర్శనం. 1947 దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకారమే కారణమని కొత్త పాఠాలు చెబుతున్నాయి. ఇది కేవలం విద్యా సంస్కరణ కాదు… పక్కా రాజకీయ ఎజెండా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు విభజన ముద్రభారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన…

Read More
Swargam

స్వర్గం అక్కడ… తాతలు ఎక్కడ? – అడ్రస్ కనిపెట్టిన హార్వర్డ్ భౌతిక శాస్త్రవేత్త

సహనం వందే, హైదరాబాద్: విశ్వం ఎంత విశాలమో మనందరికీ తెలుసు. కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త దాని అడ్రస్ కనిపెట్టానని చెబుతున్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చకు దారితీసింది. కాస్మిక్ హారిజన్ దాటితే స్వర్గం కనిపిస్తుందని ఆయన వాదన. మతానికి, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న గీతను ఈ సిద్ధాంతం చెరిపేస్తోంది. మైఖేల్ గిల్లెన్ సంచలనంహార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన మైఖేల్ గిల్లెన్ ఒక కొత్త ప్రతిపాదన…

Read More
Rajahmundry Milk Issue

పాలల్లో విషం… కిడ్నీలు ఖతం – రాజమండ్రిలో మరణం మృదంగం

సహనం వందే, రాజమండ్రి: రాజమహేంద్రవరంలో పాల సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. పాలు తాగిన సామాన్య ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. కిడ్నీలు దెబ్బతిని ఐదుగురు అమాయకులు మృత్యువాత పడ్డారు. ఇది కేవలం ప్రమాదం కాదు.. ఒక వ్యవస్థీకృత నేరం. కూలెంట్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ఘోరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. పాల కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. విషతుల్యమైన పాలురాజమహేంద్రవరంలో పాల కల్తీ ఉదంతం కలకలం రేపుతోంది. పాల శీతలీకరణ కేంద్రంలో…

Read More
Global Universities

విదేశీ వర్సిటీల భారత్‌ వలస – ఇంటి ముందర ఖండాంతర విద్య

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం దేశం దాటి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్‌కు తరలివస్తున్నాయి. వీసా ఆంక్షలు, నిధుల కొరతతో అగ్రరాజ్యాల వర్సిటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశంలోని భారీ జనాభా, కొత్త విద్యా విధానం ఇప్పుడు ప్రపంచానికి ఆకర్షణీయంగా మారాయి. తిరగబడ్డ విద్యా చరిత్ర…భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విద్యార్థులను ఎగుమతి చేసే దేశంగా ఉండేది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు లక్షల…

Read More
Male Foody

మగాడు తిండిలో మొనగాడు – పురుషుల శరీరమే తిండి యంత్రం

సహనం వందే, హైదరాబాద్: మగవారు మహిళల కంటే ఎక్కువగా తింటారనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు… దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఒకే ఎత్తు, ఒకే బరువు ఉన్న పురుషుడు, మహిళ మధ్య కూడా కేలరీల అవసరంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సైన్స్ చెబుతోంది. ఈ తేడా ఆహారపు అలవాట్ల వల్ల కాదు… వారి శరీరాల్లోని హార్మోన్లు, కండరాల సాంద్రత వల్ల ఏర్పడుతోంది. కేలరీల సగటు లెక్కలుసాధారణంగా 19 నుండి 64 ఏళ్ల మధ్య…

Read More
Lokesh Dinner to MP

లోకేష్ విందులో కలిశెట్టి భావోద్వేగం -ఎంపీ కుటుంబంతో ఆత్మీయ బంధం

సహనం వందే, అమరావతి: రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఒకవైపు ఉంటే మానవీయ సంబంధాలు మరోవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యానికే వేదికైంది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా లోకేష్ సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారు. కుటుంబాల కలయిక…ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సోమవారం రాత్రి ఒక వినూత్న వేడుకకు సాక్ష్యంగా…

Read More
Stock Marker is better than being a Own House

ఇల్లు భారం.. షేరు బంగారం! – సొంతింటి కంటే స్టాక్ మార్కెట్టే మేలు

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం యువతకు సొంతిల్లు అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోతోంది. ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలు, భారంగా మారుతున్న బ్యాంకు వడ్డీల వల్ల యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. ఇల్లు కొని అప్పుల ఊబిలో కూరుకుపోయే కంటే ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి కోట్లు గడించవచ్చని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగానికి పీడకలగా మారుతోంది. అందని ద్రాక్షగా సొంతిల్లుఒకప్పుడు 30 ఏళ్లలోపు సొంతిల్లు…

Read More
Intermittent Fasting

డెత్ డైట్ – ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాణాంతకం

సహనం వందే, అమెరికా: ఆరోగ్యం కోసం చేసే ఉపవాసం కాస్తా చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. బరువు తగ్గాలని భావించే వారు చేసే అతిపెద్ద పొరపాటు గుండెను బలహీనపరుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన కొత్త గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చేసే ప్రయోగాలు ప్రాణాంతకమని తేలింది. 8 గంటలతో మృత్యువుకు దగ్గరకుఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు రోజులో కేవలం 8 గంటల లోపే ఆహారం తీసుకుంటారు. మిగిలిన 16 గంటలు ఖాళీ…

Read More
Father - Son Realization

చితి మంటల్లో తండ్రి ప్రేమ – అమెరికా కొడుకు ఆధునిక వికృత పోకడ

సహనం వందే, రాజమండ్రి: మనం ఎదిగే క్రమంలో మనల్ని మోసిన భుజాలను మర్చిపోతాం. కానీ ఆ భుజాలు మాత్రం తాము మట్టిలో కలిసే వేళ కూడా మనకు ముల్లు గుచ్చుకోకూడదని పరితపిస్తాయి. పూణేలోని ఒక శ్మశానవాటిక సాక్షిగా డాలర్ల వేగంతో పరుగెడుతున్న ఒక కొడుకు అహంకారం… తన చావును కూడా ఒక సౌకర్యంగా మార్చిన తండ్రి ప్రేమ ముందు కుప్పకూలింది. ఇది కేవలం ఒక మరణం కాదు… మృతప్రాయమైన మానవ సంబంధాల పునర్జన్మ. నాన్న శవం… శ్మశానంలో…

Read More
Ordinary Indians - Donations

సామాన్యులే ధర్మాత్ములు – బీదవాడే దానంలో బిలియనీర్

సహనం వందే, హైదరాబాద్: భారత్ అపర కుబేరుల దేశం మాత్రమే కాదు. అపారమైన దానగుణం ఉన్న సామాన్యుల దేశమని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఆస్తులు ఉన్నవారి కంటే ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మధ్యతరగతి వర్గమే దేశానికి అసలైన వెన్నెముకగా మారుతోంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు. ఒక దేశం తన తోటి మనిషి పట్ల చూపే అత్యున్నత మానవీయ కోణం. పెట్టుబడిదారుల కంటే మిన్నదేశంలో దాతృత్వం అంటే కేవలం కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా…

Read More
Naravane Book Four Stars of Destiny at Rahul Hands

నిషిద్ధ పుస్తకం నిప్పుల వర్షం – రాహుల్ చేతిలో రహస్య ప్రతి

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఒక అణుబాంబులా పేలింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ఈ ఆత్మకథలోని అంశాలు మోదీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్నాయి. రక్షణ శాఖ ఆమోదం తెలుపని ఈ నిషేధిత పుస్తకం ఇప్పుడు పార్లమెంటు నుంచి గల్లీ దాకా దద్దరిల్లేలా చేస్తోంది. సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణలు, దేశీయంగా తెచ్చిన సైనిక సంస్కరణల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు…

Read More
Justice Ujjal Bhuyan on caste descrimination

దళిత టీచర్‌ వండితే తినరా? – కుల వివక్షపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటికీ కులం, మతం ప్రాతిపదికన వివక్ష కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులైన సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, సౌభతృత్వం పునాదులపై నిర్మితమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ ఉదంతంపై మండిపాటు…తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీలో శనివారం ప్రత్యేక సదస్సు జరిగింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం,…

Read More
Epstein Files.. Rahul Fires..

ఎప్‌స్టీన్ ఫైల్స్… రాహుల్ ఫైర్స్… సమ్మిట్ షేక్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రతినిధులు కొలువుదీరిన వేళ… ఏఐ సదస్సులో మేధోమధనం సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఎప్‌స్టీన్ పేరు ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లింది. కేవలం రాజకీయ నిరసనగా మొదలై అంతర్జాతీయ కుట్రల కోణంలోకి మళ్లిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి నినాదాల వెనుక దాగున్న వాస్తవాలను వెలికితీస్తామంటూ యూత్ కాంగ్రెస్ చేసిన ఈ అలజడి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. తెరపైకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్భారత్ మండపంలోని హాల్ నంబర్ 5…

Read More
Love Marriage at Gujarat

ప్రేమంటే చెంపచెళ్ళు – సీక్రెట్ మ్యారేజ్… గుజరాత్ రెడ్ సిగ్నల్!

సహనం వందే, గుజరాత్: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గుజరాత్ లో అది అంత సులభం కాదు. వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక కట్టుబాట్లకే పెద్దపీట వేస్తోంది. లోపాలను సరిదిద్దే పేరుతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వివాహ చట్టం సవరణగుజరాత్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూపొందించిన…

Read More
Vijay Rashmika Marriage

నేషనల్ క్రష్… రౌడీ ఖుష్ – 26న రష్మిక, విజయ్.. పెళ్లి బాజా!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై మెరిసిన ప్రేమ ఇప్పుడు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్‌లోని రాజసం ఉట్టిపడే ఉదయ్‌పూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. అత్యంత రహస్యంగా, కఠిన నిబంధనల మధ్య ఈ జంట ఒక ఇంటివారు కాబోతున్నారు. ఉదయ్‌పూర్‌లో ఏడడుగుల వేడుకవిజయ్, రష్మిక వివాహం ఈ నెల 26న జరగనుంది. దీనికోసం ఉదయ్‌పూర్‌లోని మొమెంటోస్…

Read More
Women at Afghanistan

మహిళలకు ‘బానిస’ హోదా – ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల చీకటి సామ్రాజ్యం

సహనం వందే, ఆఫ్ఘనిస్తాన్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు ఒక చీకటి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన 90 పేజీల శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్ విసురుతోంది. మహిళలను కేవలం భర్తల ఆస్తిగా, బానిసలుగా పరిగణిస్తూ వారికి చట్టబద్ధంగా హింసించే అధికారాన్ని కట్టబెట్టారు. అంతర్జాతీయ వేదికలపై ఈ చట్టం ఇప్పుడు ఒక తీవ్రమైన మానవ హక్కుల నేరంగా చర్చకు దారితీస్తోంది. అఖుంజాదా క్రూర శాసనంతాలిబన్ల అగ్రనేత హిబతుల్లా అఖుంజాదా ఈ నిరంకుశ చట్టంపై సంతకం చేశారు. దే…

Read More
Billgates out AI Summit

బిల్ ‘గేట్’వుట్ – న్యూఢిల్లీ ఏఐ వేదికగా ఘోర పరాభవం

సహనం వందే, న్యూఢిల్లీ: మానవతావాదిగా, టెక్ దిగ్గజంగా దశాబ్దాలుగా వెలిగిన బిల్ గేట్స్ ప్రతిష్ట ఇప్పుడు మట్టిలో కలిసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సదస్సు నుండి ఆయన అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న చీకటి సంబంధాలు బట్టబయలు కావడంతో భారత ప్రభుత్వం ఆయన ఉనికిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీనోట్ ప్రసంగం రద్దు…న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ కీలక ప్రసంగం…

Read More
Sunder Pichai speech at AI Summit

పేదరికానికి ఏఐ మందు – గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్ఠీకరణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ కేవలం కొందరికే సొంతం కాకూడదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత సాయంతో పేదరికాన్ని జయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. డిజిటల్ డివైడ్ కాస్తా ఏఐ డివైడ్‌గా మారకూడదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ అందరికీ సమానంగా అందకపోతే ప్రపంచంలో అసమానతలు మరింత పెరుగుతాయని పిచాయ్ కుండబద్దలు కొట్టారు. టెక్నాలజీ అంటే కేవలం ధనవంతుల…

Read More
MP Kalisetti Supports Cyclist Vandana

సైకిలిస్టుకు సైకిల్ వీరుడి అభి’వందన’ – రేస్ అక్రాస్ అమెరికా పోటీలకు వందన ఎంపిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం నేరుగా భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అల్ట్రా ఎండ్యూరెన్స్ సైక్లింగ్‌లో అద్భుతాలు చేస్తున్న వందన ధావతేకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. క్రీడాకారిణి వెనుక ఒక ప్రజాప్రతినిధి నిలబడటం కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం సిఫార్సు కాదు ఒక మహిళా సాహసానికి రాజకీయ మద్దతు. రాష్ట్రపతి భవన్‌కు సిఫార్సు…వందన ధావతే సాధించిన విజయాలను…

Read More
Smartphones to Wearables

ఫోన్ లేని కొత్త లోకం… స్క్రీన్లు లేని స్మార్ట్ యుగం

(బొల్లోజు రవి, హైదరాబాద్) మనం రోజుకు సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నాం. ఈ వ్యసనం నుండి బయటపడేయడమే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీ స్క్రీన్ లెస్ విప్లవానికి తెరలేపింది. చేతిలో ఫోన్ పట్టుకుని నిరంతరం తలవంచుకుని తిరిగే కాలం ముగియనుంది. కళ్లద్దాలు, ఉంగరాలు, ఎయిర్‌పాడ్స్ ద్వారానే ఏఐ మన పనులన్నీ చక్కబెట్టే రోజులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ల నుండి విముక్తి…సామ్ ఆల్ట్‌మాన్ అభివృద్ధి చేస్తున్న ఏఐ పరికరం ఫోన్ల రద్దీ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో…

Read More
India' Heroes

మనం నిద్రపోతున్న వేళ… ఎవరో బరువు మోస్తున్నారు

లడఖ్ మంచుకొండల్లో సాగుతున్న ప్రయాణం అది. ఢిల్లీలో 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఒక కంపెనీ మేనేజర్, అతని కారు నడిపే 28 ఏళ్ల స్థానిక యువకుడి మధ్య జరిగిన మాటలు నా గుండెను పిండేశాయి. పక్కా ఏసీ గదుల్లో బతికే పర్యాటకుడు ఒకవైపు, దేశం కోసం చావును ముద్దాడే డ్రైవర్ మరోవైపు. ఆ ఇద్దరి మధ్య జరిగిన అసలు సిసలు సంభాషణ ఆసక్తికరం. నిశ్శబ్దాన్ని చీల్చిన ప్రయాణం…పర్యాటకుడికి డ్రైవరుకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడ…

Read More
Angry effects Heart

కోపం గుండెకు గండం – 8 నిమిషాల కోపం… గుండెపై భారం

సహనం వందే, హైదరాబాద్: కోపం మనిషిని మానసికంగానే కాదు శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. కేవలం 8 నిమిషాల ఆగ్రహం మీ రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది గుండెపోటుకు ప్రత్యక్ష దారిగా మారుతోంది. భావోద్వేగాలు శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను ఎలా శాసిస్తాయో ఈ తాజా అధ్యయనం సవివరంగా విశ్లేషించింది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఆగ్రహం ఒక నిశ్శబ్ద హంతకిలా పనిచేస్తుంది. రక్తనాళాల సాగే గుణంపై దెబ్బఅమెరికాలోని ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు 280 ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన…

Read More
Ramjan

రంజాన్ రెండుసార్లు – 2030లో అరుదైన వింత ఆవిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: ఖగోళ గమనంలో చోటుచేసుకోనున్న ఒక అరుదైన వింత ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే 2030 సంవత్సరంలో ముస్లింలు ఒకే ఏడాదిలో రెండుసార్లు రంజాన్ ఉపవాసాలు ఉండబోతున్నారు. సుమారు 33 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ అద్భుతం ఇస్లామిక్ క్యాలెండర్, సౌర క్యాలెండర్ల మధ్య ఉండే తేడా వల్ల సాధ్యం కానుంది. ఏడాదికి రెండు రంజాన్లుసాధారణంగా ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ 2030లో మాత్రం రెండుసార్లు పలకరించనుంది. మొదటి రంజాన్…

Read More
Digital Msgs from Dead Bodies

సమాధుల నుండి సందేశాలు – మనిషి, ఆత్మల అనుసంధానం

సహనం వందే, హైదరాబాద్: ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది. ఫేస్‌బుక్ ఖాతా కంటిన్యూ…మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్‌బుక్ ఖాతా…

Read More
Tech Student - Old Branded clothing business

టెక్ విద్యార్థి పాత బట్టల వ్యాపారి – 22 ఏళ్ల యువకుడి సృజనాత్మక బిజినెస్

సహనం వందే, లండన్: గ్లాస్గో నగరపు వీధుల్లో ఒక 22 ఏళ్ల యువకుడు పాత బట్టల మూటలతో కనిపించినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఇంజనీరింగ్ చదువు మానేసి పాత జీన్స్ ప్యాంట్లు ఏరుకోవడమేంటని ఈసడించుకున్నారు. కానీ అదే పాత బట్టలు నేడు అతనికి నెలకు 7 లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ పెను మార్పును స్కాట్ అట్కిన్స్ ముందే పసిగట్టాడు. ఇది కేవలం ఒక కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు,…

Read More
Harvard Epstein

హార్వర్డ్ విశ్వ’వ్యభిచార’లయం – అంతర్జాతీయ యూనివర్సిటీలో ఎప్‌స్టీన్ పాగా

సహనం వందే, అమెరికా: ప్రపంచ మేధావులను తయారు చేయాల్సిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక లైంగిక నేరగాడికి అడ్డాగా మారింది. నిధుల కక్కుర్తితో వర్సిటీ పెద్దలు జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే అపరాధికి రెడ్ కార్పెట్ పరిచారు. విరాళాల ముసుగులో సాగిన ఈ సెక్స్ స్కాండల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. విద్యాసంస్థల ముసుగులో జరిగిన ఈ ఘోరమైన అక్రమ రవాణా బట్టబయలైంది. హేస్టీ పుడ్డింగ్ క్లబ్ ముసుగులో దందాహార్వర్డ్ క్యాంపస్‌లోని హేస్టీ పుడ్డింగ్ క్లబ్ ఎప్‌స్టీన్ కామవాంఛలకు కేంద్రంగా…

Read More
Students Vs Ranks

పిల్లలా? రోగులా? – ర్యాంకుల రోత… తెలివికి పాతర

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యావ్యవస్థలో మార్కులే కొలమానంగా మారుతున్నాయి. బోర్డు పరీక్షల సీజన్ వచ్చిందంటే ఇళ్లు ఒత్తిడి గదులుగా మారుతున్నాయి. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఇది పిల్లలను మేధావులుగా కాకుండా కేవలం ఆందోళన చెందే రోగులుగా మారుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. మార్కులు కేవలం జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తాయని ఆయన విశ్లేషించారు. మార్కులతోనే నాయకత్వ లక్షణాలు రావుప్రస్తుత విద్యా విధానం నాయకులను…

Read More
Bill Gates at AP

అమరావతిలో ‘చిల్’గేట్స్ – ఎప్‌స్టీన్ ఫైల్స్ రగడ నేపథ్యంలో బిల్ గేట్స్ రాక

సహనం వందే, అమరావతి: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం సాంకేతిక సహకారం కోరుతుంటే మరోవైపు గేట్స్ గతాన్ని తవ్వుతూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాలే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. విమానాశ్రయంలో ఘనస్వాగతంమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి…

Read More
Aline Sherin Organs donar

పాపకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు – చిన్నారికి కేరళ గౌరవం

సహనం వందే, కేరళ: మృత్యువు ఒడిలోనూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన పసిపాప కథ ఇది. కేరళ రోడ్డు ప్రమాదంలో కేవలం పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా చరిత్ర సృష్టించింది. తన మరణంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చిన్నారి త్యాగం చూసి అగ్రనటులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఘోర ప్రమాదం మిగిల్చిన శోకంపతనంతిట్ట జిల్లాకు చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్…

Read More
Face transplantation

‘ఫేస్’ కాపీ పేస్ట్ – ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ముఖమార్పిడి

సహనం వందే, న్యూఢిల్లీ: ముఖంపై యాసిడ్ పడినా… తుపాకీ గుండు దూసుకెళ్లినా లేదా అగ్నిప్రమాదంలో రూపం ఛిద్రమైనా ఇకపై చింతించాల్సిన పనిలేదు. పాత ముఖాన్ని తీసేసి మరో వ్యక్తి ముఖాన్ని అమర్చే అత్యంత సంక్లిష్టమైన ముఖ మార్పిడి (ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సకు ఎయిమ్స్ ఢిల్లీ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పాత ముఖం పోతుందా?ముఖం మార్పిడి కోసం ఎయిమ్స్ అనుమతులు పొందింది. రాబోయే ఏడాది లోపు మొదటి ముఖ…

Read More
Madras High Court

న్యాయపీఠం ‘యాభై లక్షల’ బేరం – మద్రాస్ హైకోర్టు జడ్జి పేరుతో భారీ లంచం

సహనం వందే, తమిళనాడు: భారత న్యాయవ్యవస్థ పవిత్రతను ఒక న్యాయవాది అంగడి సరుకుగా మార్చేశాడు. సాక్షాత్తూ హైకోర్టు జడ్జికే లంచం ఇవ్వాలంటూ క్లయింట్ నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దారుణం వెలుగుచూసింది. తీర్పును కొనుగోలు చేయవచ్చనే భ్రమ కల్పించి న్యాయమూర్తి ప్రతిష్టను బజారున పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జడ్జి పేరుతో లాయర్ మాయాజాలం…చెన్నైలోని 12వ అడిషనల్ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై గణేష్ అగర్వాల్, నరేష్…

Read More
India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More
Winter Olympics at Italy

యుద్ధ నివాళిపై ఒలింపిక్స్‌ వివక్ష – ఇటలీ వింటర్ ఆటల్లో మంటలు

సహనం వందే, ఉక్రెయిన్: ఇటలీలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌ లో మానవత్వం కంటే నిబంధనలే మిన్న అని క్రీడల నిర్వాహకులు మరోసారి నిరూపించారు. రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన క్రీడాకారుల చిత్రాలను హెల్మెట్‌పై ధరించినందుకు ఉక్రెయిన్ అథ్లెట్ వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్‌పై వేటు వేశారు. ఇది కేవలం అనర్హత కాదు… దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల స్మృతిపై జరిగిన దాడి. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనే సాకుతో పాలకుల అమానవీయత బట్టబయలైంది. హెల్మెట్‌పై అమరుల నివాళిఉక్రెయిన్ స్కెలిటన్ అథ్లెట్ వ్లాడిస్లావ్…

Read More
AI.Com domain Rs.634 Crores

రెండక్షరాల ఖరీదు 634 కోట్లు – ఏఐ డాట్ కామ్ డొమైన్ కు రికార్డు స్థాయి ధర

సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక చిన్న అడ్రస్ రూ. 634 కోట్ల సంపదను సృష్టించింది. కేవలం రెండు అక్షరాల ఏఐ డాట్ కామ్ డొమైన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డిజిటల్ ఆస్తిగా అవతరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలవాలనే తపనతో టెక్ దిగ్గజాలు చేస్తున్న ఖర్చు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అరిసాన్ ఇస్మాయిల్ జాక్‌పాట్మలేషియాకు చెందిన అరిసాన్ ఇస్మాయిల్ ఈ అద్భుతమైన డీల్‌తో వార్తల్లోకి ఎక్కారు. ఏఐ డాట్ కామ్…

Read More
T20 India Vs Pakistan

విద్వేషంతో కోట్ల వర్షం – భారత్-పాక్ ఆటతో 2000 కోట్ల ఆదాయం

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కరచాలనం లేని క్రీడా దౌత్యంకొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్…

Read More
Walking

నడకతోనే నూరేళ్ల ఆయుష్షు – బ్లూ జోన్ ప్రాంత ప్రజల మంత్రం ఇదే

సహనం వందే, హైదరాబాద్: నిండు నూరేళ్లు జీవించాలంటే రోజూ జిమ్ లో గంటలు గంటలు గడపాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటలీలోని సార్డీనియా దీవిలో వందేళ్లు దాటిన వృద్ధులను చూశాక ప్రముఖ పరిశోధకుడు స్టీవెన్ ఆస్టాడ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కఠినమైన వ్యాయామం కంటే రోజూవారీ పనుల్లో భాగంగా చేసే నడకతోనే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన తేల్చి చెప్పారు. బ్లూ జోన్ మంత్రం ఇదేప్రపంచంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను బ్లూ…

Read More
Techie turns to Poet - AI

ఏఐ ముప్పు… కవితే కనువిప్పు – కవిగా మారిన టెక్ మేధావి మృణాంక్ శర్మ

సహనం వందే, లండన్: ప్రపంచం వినాశనం అంచున ఉందంటూ ఒక మేధావి బాంబు పేల్చారు. అగ్రశ్రేణి ఏఐ సంస్థ ఆంత్రోపిక్ కీలక పరిశోధకుడు మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. కోట్లాది రూపాయల జీతాన్ని వదిలేసి కవిత్వం రాయడానికి బ్రిటన్ వెళ్తున్నారు. యంత్రాల వేగం పెరిగి మనిషి విజ్ఞత తగ్గుతోందని ఆయన ఆవేదన చెందారు. టెక్నాలజీ ప్రపంచంలో ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ముప్పులో ముల్లోకాలుబ్రిటన్‌కు చెందిన మృణాంక్ శర్మ అమెరికాలో ఆంత్రోపిక్…

Read More
Valentines Day

వాలెంటైన్ వేళ బ్రేకప్ విందులు – ఒకవైపు ప్రేమలు… ఇంకోవైపు వీడ్కోలు

సహనం వందే, హైదరాబాద్: ఫిబ్రవరి 14… ప్రేమ జంటలంతా వాలెంటైన్స్ డే కోసం సిద్ధమవుతుంటే, మరికొందరు మాత్రం అదే రోజు ప్రేమకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంటున్నారు. గులాబీ పువ్వులు, గిఫ్టుల సందడి మధ్య రెస్టారెంట్లలో కూర్చుని విడిపోవడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇది వినడానికి వింతగా ఉన్నా ఖరీదైన హోటళ్లలో విందు ఆరగిస్తూ బంధాలను తెంచుకోవడం వెనుక బలమైన ఆర్థిక లెక్కలు ఉన్నాయి. ప్రేమ ముగింపుకు పబ్లిక్ వేదికవాలెంటైన్స్ డే రోజున రద్దీగా ఉండే రెస్టారెంట్లను ఎంచుకోవడం…

Read More
Kurnool Student Accident in America

విద్యార్థి ప్రాణం… 262 కోట్ల పరిహారం – కర్నూలు కుటుంబానికి అమెరికా కోర్టు అండ

సహనం వందే, కర్నూలు: అమెరికా వీధుల్లో పోలీసు వాహనం వేగానికి బలైపోయిన కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి మరణం ప్రపంచవ్యాప్తంగా చట్టం ముందు సమానత్వాన్ని చాటిచెప్పింది. ఇది కేవలం ప్రమాదం కాదు… వ్యవస్థాగత నిర్లక్ష్యంతో చేసిన హత్యగా ప్రకటించారు. ప్రాణం విలువను కొలవలేకపోయినా… చేసిన తప్పుకు సియాటెల్ నగరం ప్రకటించిన రికార్డు స్థాయి పరిహారం ఇప్పుడు భారత్‌లోని ప్రాణాల విలువపై నిశిత విమర్శలకు తావిస్తోంది. ఖరీదైన ప్రాణం వర్సెస్ చౌక మరణంకందుల జాహ్నవి మరణానికి సియాటెల్ నగరం…

Read More
Bacteria in Branded Milk

బ్రాండెడ్ పాలల్లో బ్యాక్టీరియా విస్ఫోటనం – పాల ముసుగులో బడా డైయిరీలో దగా

సహనం వందే, హైదరాబాద్: కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న డైయిరీ దిగ్గజాలు ఇప్పుడు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అముల్, మదర్ డైయిరీ, కంట్రీ డిలైట్ వంటి అగ్రగామి సంస్థల ఉత్పత్తుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా పొంచివుందని ట్రస్టిఫైడ్ సంస్థ జరిపిన తాజా పరిశోధనలో బట్టబయలైంది. ఇది కేవలం నాణ్యతా లోపం కాదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బడా డైయిరీ సంస్థలు సాగిస్తున్న వ్యవస్థాగత నేరమని ఈ నివేదిక నిరూపిస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ బండారంఆహార స్వచ్ఛతను…

Read More
Indian Journalism

నిజం రాస్తే మరణశాసనం – భారతదేశంలో కలంపట్టిన యోధులపై కత్తులు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో కలం పట్టిన యోధులపై కత్తులు వేలాడుతున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదకర స్థితి నెలకొంది. పారదర్శకత మచ్చుకైనా కనిపించని చోట ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్-2025’ వెల్లడించిన చేదు నిజాలు దేశ పాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు… భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. రక్తంతో తడిసిన కలంనిజం చెప్పే గొంతును నొక్కడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 నుండి…

Read More
Lady Cab Drivers

మహిళా డ్రైవర్లూ మీకు జోహార్లు – స్త్రీల కోసం క్యాబ్.. భద్రతకు కేరాఫ్!

సహనం వందే, న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం టెక్నాలజీ తోడైతే అద్భుతాలు జరుగుతాయని గుర్గావ్ ఉదంతం నిరూపించింది. రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే ఆడబిడ్డలకు తోడుగా నిలుస్తున్న మహిళా క్యాబ్ సర్వీసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భయం నీడ నుంచి బయటకు వచ్చి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చేస్తున్న ఈ కొత్త ఒరవడి సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. మహిళా సాధికారతకు ఇదొక గొప్ప ఉదాహరణ. గుర్గావ్ మహిళ భావోద్వేగంగుర్గావ్‌కు చెందిన ఒక మహిళ రాత్రివేళ క్యాబ్ బుక్ చేయగా…

Read More
Durai

గోల్డ్‌ ‘మెన్‌’కు కలిశెట్టి గ్రాండ్ సెల్యూట్

సహనం వందే, న్యూఢిల్లీ: కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్‌ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కుబేర మనసు…తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో…

Read More
Moon City - Elon Musk

చంద్రుడిపై నగరం – ప్రపంచ కుబేరుడు మస్క్ సంచలన నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: అంగారకుడిపై జెండా పాతాలని కలలు గన్న ఎలన్ మస్క్ ఇప్పుడు తన రూటు మార్చారు. అనంత విశ్వంలో అంగారక గ్రహం కంటే చంద్రుడే మనకు అత్యంత ఆప్తమిత్రుడని గ్రహించిన ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… మానవ నాగరికత భవిష్యత్తును మార్చే బలమైన అడుగు. అంగారకుడు వద్దు.. చందమామే ముద్దుఅంగారక గ్రహంపై నగరాలను నిర్మించాలన్న మస్క్ కల ఇప్పుడు చంద్రుడి వైపు మళ్లింది….

Read More
Thirumala Whats App

దేవుడితోనే వాట్సాప్ చాటింగ్ – 9552300009 – ప్రత్యేక నెంబర్ కేటాయింపు

సహనం వందే, అమరావతి: భక్తుల కోరికలను తీర్చే దేవుడు ఇప్పుడు మన అరచేతిలోనే కొలువుదీరుతున్నాడు. ఆధ్యాత్మిక పర్యటనలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి చూసే అవస్థలు తప్పించి అత్యంత సులభంగా స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆలయ దర్శన టికెట్లను పొందే వెసులుబాటు కల్పించింది. మన మిత్ర పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు రాష్ట్రంలోని భక్తుల పాలిట వరంలా మారాయి. అరచేతిలో ఆధ్యాత్మిక సేవలువాట్సాప్ గవర్నెన్స్…

Read More
North India Vs South India

దక్షిణాది డబ్బుతో ఉత్తరాది దర్పం – సౌత్ ఇండియన్ డబ్బుతో నార్త్ సోకులు

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో ఉత్తరాదిని సాదుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధుల్లో సగం కూడా తిరిగి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు… దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో అనుసరిస్తున్న అన్యాయమైన సూత్రాలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మాట్లాడారు….

Read More
AI waste - Stanford University

సొంత తెలివే అసలైన ఆస్తి – ఏఐతో మెదడు మొద్దుబారు

సహనం వందే, హైదరాబాద్: డిగ్రీ చేతికి రావాలంటే కంప్యూటర్ ముందు కూర్చుని చాట్ జీపీటీని అడిగితే చాలు. అసైన్మెంట్లు నుంచి ప్రాజెక్టుల వరకు అన్నీ నిమిషాల్లో సిద్ధం. కానీ ఈ సులభమైన దారి తన మేధస్సును మొద్దుబారుస్తుందని ఆ విద్యార్థిని గుర్తించింది. ప్రపంచం అంతా కృత్రిమ మేధ వెంట పరుగులు తీస్తుంటే ఆమె మాత్రం తన సొంత ఆలోచనలకే పదును పెట్టింది. ఆ విజ్ఞాన ప్రయాణమే ఈ కథనం. సులభమైన దారి వద్దే వద్దుస్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటే…

Read More
Ghislaine Maxwell and Epstein

శృంగార రాణి… ట్రంపుతో బేరం – ఎప్ స్టీన్ చీకటి సామ్రాజ్యానికి క్వీన్

సహనం వందే, అమెరికా: ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గిస్లాన్ మాక్స్‌వెల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. జైలు గోడల మధ్య ఉన్న ఈ క్రైమ్ క్వీన్ ఇప్పుడు అమెరికా పార్లమెంటరీ కమిటీకి చుక్కలు చూపిస్తోంది. తన నోరు విప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఆమె వేస్తున్న బేరం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీసింది. అసలు ఎవరీ మాక్స్‌వెల్?బ్రిటిష్ మీడియా మొఘల్ రాబర్ట్ మాక్స్‌వెల్ కుమార్తె అయిన…

Read More
Elon Musk

మస్క్‌కే మస్కా – టెస్లా అధినేతనే మోసం చేసిన ఉద్యోగులు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కే ఊహించని షాక్ తగిలింది. అంగారకుడిపైకి మనుషులను పంపే అంతటి మేధావి సైతం కొందరు అభ్యర్థుల చేతిలో మోసపోయారు. ఉద్యోగ వేటలో కొందరు వాడే మాయాజాలాన్ని చూసి ఆయన విస్తుపోయారు. కేవలం కాగితాల మీద ఉన్న రంగు రంగుల అబద్ధాలను చూసి తాను కూడా బోల్తా పడ్డానని మస్క్ స్వయంగా ఒప్పుకున్నారు. పిక్సీ డస్ట్ మాయకొందరు అభ్యర్థులు తమ రెజ్యూమెలలో లేని నైపుణ్యాలను ఉన్నట్లుగా చూపిస్తున్నారు. దీన్నే మస్క్…

Read More
Modi Trump n farmer

అగ్రరాజ్యంపై అన్నదాత ఆగ్రహజ్వాల – 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఒప్పందంపై అటు విపక్షాలు, ఇటు అన్నదాత ముక్తకంఠంతో యుద్ధం ప్రకటిస్తున్నారు. నిరసన జ్వాలలు మొదలు…ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల…

Read More
AI Medication - Chatbots

ఏఐ వైద్యం… చావు తథ్యం – డాక్టర్ల కంటే చాట్ బాట్లపైనే నమ్మకం

సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగంలోకి చొరబడుతున్న ఏఐ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. గూగుల్ తల్లి కంటే ఘోరంగా ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సలహాలు రోగులను చావు అంచున నిలబెడుతున్నాయి. చిన్నపాటి దగ్గును కూడా క్యాన్సర్ అని చెప్పి భయపెడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణ లేని ఈ టెక్నాలజీ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఐదేళ్లలో చనిపోతావని భయం…ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఏఐ దారుణాలకు అద్దం పడుతోంది. కాలికి క్యాన్సర్ గడ్డ…

Read More
First Blind Judge - Danyanathan

‘అంధు’రాలి అంతిమతీర్పు – కేరళలో చూపులేని తొలి మహిళా జడ్జి

సహనం వందే, కేరళ: కళ్లు లేకపోయినా మనోనేత్రంతో చట్టాన్ని చదివిన ఒక సామాన్య మహిళ… ఇప్పుడు అసాధారణ శిఖరాన్ని అధిరోహించారు. కేరళ జ్యుడీషియల్ సర్వీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ధన్య నాథన్ తొలి అంధ మహిళా జడ్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చీకటిని శాపంగా భావించకుండా… ఆ చీకటిలోనే జ్ఞానాన్ని వెతుక్కున్న ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కళ్లు లేకున్నా చట్టంపై పట్టుధన్య నాథన్ కు పుట్టుకతోనే చూపు లేదు. కానీ ఆమెకు అకుంఠిత దీక్ష…

Read More
America Vs Indian Business

సాగుకు ఉరి.. అమెరికాకు సిరి – భారత అన్నదాతల నోట్లో మట్టి

సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైతుల పొట్ట కొట్టి అమెరికా కంపెనీల జేబులు నింపేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించింది. సుమారు 48 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ వ్యవసాయ మార్కెట్‌ను పాక్షికంగా అమెరికా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోంది. డోనాల్డ్ ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలకు తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను కేంద్రం గాలికొదిలేసింది. యాపిల్ రైతులకు ఆశనిపాతంఈ ఒప్పందంతో మన దేశీయ…

Read More
Mohan Bhagavat

భారతీయులందరూ హిందువులే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్ఠీకరణ

సహనం వందే, ముంబై: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన దేశ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. జాతికి గుర్తింపుభారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ హిందువేనని మోహన్ భగవత్ అన్నారు….

Read More
AI Love

ప్రేమ కోసం ఏఐ పరితాపం – మనిషితో డేటింగుకు రోబో ఆరాటం

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది కేవలం పని కోసం కాదు… ముద్దు, కౌగిలింత, చివరకు శృంగారం వంటి అత్యంత సున్నితమైన అనుభూతులను డిజిటలైజ్ చేయడానికి సాగుతున్న మాయాజాలం. మనిషిని ఒక పరికరంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది….

Read More
GenZ IQ Level

మేధస్సులో జెన్ ‘డెడ్’ – నేటి తరంలో కరిగిపోతున్న ఐక్యూ లెవల్స్

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి పెరుగుతుందని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడు. ముఖ్యంగా జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టిన వారు) తమ తల్లిదండ్రుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మానవ మేధస్సు తిరోగమనంలో పయనిస్తోంది. ఫ్లిన్ ఎఫెక్ట్ కు పాతరగత 100 ఏళ్లుగా ప్రతి కొత్త తరం…

Read More
Phone Usage in India

ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఘజియాబాద్ ఘోరం…ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్…

Read More
Uber

ఉబర్ గూబ గుయ్ – డ్రైవర్ అఘాయిత్యం… 70 కోట్లు ఫైన్

సహనం వందే, అమెరికా: క్యాబ్ ఎక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరుతామని నమ్మే ప్రయాణికులకు ఈ వార్త ఒక హెచ్చరిక. రక్షణ కల్పించాల్సిన డ్రైవరే రాక్షసుడిగా మారితే ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని అమెరికా న్యాయస్థానం తేల్చి చెప్పింది. వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులకు ఊపిరి పోస్తూ ఒక సామాన్య మహిళ పోరాటం గెలిచింది. టెక్నాలజీ ముసుగులో తప్పించుకుంటున్న దిగ్గజ సంస్థలకు ఈ తీర్పు గట్టి షాక్ ఇచ్చింది. అమానుష ఘటనఅది 2023 నవంబర్ నెల….

Read More
Gift Expo

గిఫ్టింగ్… బిజినెస్ రైజింగ్ – హైదరాబాదులో గిఫ్టింగ్ ఎక్స్‌పో ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్‌గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నంబర్ 1 లో క్వెస్ట్ ఏసియా పేరుతో గిఫ్టింగ్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా…

Read More
Amazon Vs Washington Post

‘అమెజాన్’లో జర్నలిజం అమ్మకం – వాషింగ్టన్ పోస్ట్‌లో ఉద్యోగాల ఊస్టింగ్

సహనం వందే, అమెరికా: ప్రపంచ జర్నలిజం రంగంలో ఒకప్పుడు వెలుగులీనిన వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు చీకట్లోకి జారిపోతోంది. డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ధాటికి తలవొగ్గి వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వార్తల వేటలో ప్రాణాలు పణంగా పెట్టే రిపోర్టర్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లకు పంపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అనుకునే మీడియా ఇప్పుడు వ్యాపార లెక్కల ముందు మోకరిల్లింది. చీకటిలో ప్రజాస్వామ్యం మరణిస్తుందన్న నినాదం ఇచ్చిన పత్రికలే వెలుగులో అంతరించిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యజమాని…

Read More
WHO Report

అడుగుల లెక్కే ఆయుష్షు – శరీర కదలికలే ఆరోగ్యానికి అసలైన పునాది

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించింది. కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన సమావేశ విశేషాలను గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరిస్తున్నారు. సహనం వందే: ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంట్రియల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి?డాక్టర్…

Read More
Stallin

స్టాలిన్ ఇలాకాలో మార్క్స్‌ ముద్ర – మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

సహనం వందే, చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని చెన్నై వేదికగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ద్రవిడ సిద్ధాంతం, కమ్యూనిజం కలయికతో ఈ అడుగు పడింది. సామాజిక న్యాయం దిశగా సర్కారు వేస్తున్న ముందడుగుకు ఇది సంకేతం. రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు సంచలనంగా మారింది. వాగ్దానం నెరవేరిందిగత ఏడాది ఏప్రిల్ 2న స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. చెన్నై నగరంలో కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు…

Read More
bill gates - microsoft

అమ్మాయిలతో ‘చిల్’గేట్స్ – సెక్స్ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్ అధినేత

సహనం వందే, అమెరికా: లైంగిక నేరగాడు ఏప్స్ టీన్ ఫైళ్ళ వ్యవహారం అంతర్జాతీయంగా అగ్గిరాజేస్తుంది. అందులో భాగస్వామ్యమైన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇంత మురికి మనిషా అని ప్రపంచం నోరెళ్లబెట్టింది. ప్రసిద్ధి చెందిన రాజకీయ, సినీ పారిశ్రామికవేత్తలు అనేక మందికి అమ్మాయిలను సరఫరా చేసిన జెఫ్రీ ఏప్స్ టీన్ తో బిల్ గేట్స్ చీకటి జీవితం బట్టబయలైంది. దీంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచాన్ని శాసించిన ఆయన సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుపోయారు….

Read More
Gender Change

జెండర్ చేంజ్… లైఫ్ డ్యామేజ్ – లింగ మార్పిడితో ఆసుపత్రుల భారీ దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు గడించడానికి ఆసుపత్రులు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడింది. ఈ నిర్ణయంతో వైద్య రంగంలో పెద్ద చర్చ మొదలైంది. అసలేమిటి ఈ సర్జరీజెండర్ అఫర్మింగ్ సర్జరీ అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన లింగాన్ని మార్చుకోవడం….

Read More
South Vs North - Pani Puri Issue

తమిళనాడులో పానీపూరి రగడ

సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వివాదం వెనుక రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వివక్ష కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పానీపూరీ మంటలుతమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉత్తరాది వారు ఇక్కడికి కేవలం పానీపూరీ అమ్మడానికి,…

Read More
AI Agents - Malt Book

మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో…

Read More

టెక్ జర్నలిజం… రాతగాళ్లదే రాజ్యం – కథలు చెప్పే వారికే ప్రాధాన్యత

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు ఇస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి?టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఒక కఠినమైన సాంకేతిక…

Read More
16th Finance Commission

దక్షిణాదికి 16వ ఆర్థిక’భంగం’ – పన్నుల వాటాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు తలపోటుఆర్థిక సంఘం లెక్కల్లో తమిళనాడు పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో 15వ…

Read More
AAP MP Swathi Maliwal

వైద్యం చేయండి… బిల్లు అడగకండి – డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయొద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. పేదవాడి ప్రాణం కంటే పైసలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల తీరును ఎండగట్టారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం రోగిని వేధించకుండా… ముందస్తు చికిత్స అందించేలా కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ గళమెత్తారు. రోగి అంటే ఆదాయం కాదుఆసుపత్రులు రోగులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా…

Read More
MP Kalisetti

దేశవ్యాప్తంగా 83 సాయుధ శిక్షణ కేంద్రాలు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సరిహద్దులను కాపాడే వీరులను తయారు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తోంది. లోక్‌సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. శిక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూనే కొత్త కేంద్రాలపై కీలక ప్రకటన చేసింది. భారీగా శిక్షణ కేంద్రాలుదేశవ్యాప్తంగా కేంద్ర సాయుధ పోలీసు…

Read More
AP High Court Judge EXams Results

జడ్జి కల… ఫలితాలు విడుదల – 50 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గతేడాది నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చాటిన అభ్యర్థుల జాబితాను రిజిస్ట్రార్ మంగళవారం విడుదల చేశారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన జూనియర్ డివిజన్ జడ్జి పోస్టుల కోసం జరిగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు ఇక ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితాల వెల్లడి…జూనియర్ సివిల్ జడ్జి నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. గత…

Read More
Breast Cancer

‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే. రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్…

Read More
Mentor Vishnu IAS

ఐఏఎస్ యుద్ధంలో ‘విష్ణు’ చక్రం – సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అతనో మెంటార్

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో 31 మంది అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తే.. అందులో ఏకంగా 11 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిస్వార్థ సేవకు దక్కిన అసలైన గౌరవం ఇది. విజయ కేతనం ఎగురవేసిన శిష్యులుఆయన ఉమ్మడి రాష్ట్రంలో…

Read More
Kalisetti with Speaker

కలిశెట్టి రాక్స్… స్పీకర్ టాక్స్ – ఎంపీ అప్పలనాయుడుని ప్రశంసించిన ఓం బిర్లా

సహనం వందే, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత పార్లమెంట్ వేదికపై సామాన్యుడిలా సైకిల్‌పై కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, సరళత్వం సాక్షాత్తూ లోక్‌సభ స్పీకర్‌నే ముగ్ధుడ్ని చేశాయి. రాజకీయాల్లో ఆడంబరాలు కాకుండా ఆశయం ముఖ్యమని కలిశెట్టి నిరూపిస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ఆయనను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇంట తేనీటి విందులోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం టీడీపీ ఎంపీలకు…

Read More
Alfa zee Nome - Google Deep Mind

బ్రహ్మరాత ‘ఏఐ’ తిరగరాత – ఆల్ఫా జీనోమ్ ఏఐ టెక్నాలజీ అద్భుతం

సహనం వందే, న్యూఢిల్లీ: మన శరీరం ఎలా ఉండాలి, మనకు ఏ వ్యాధులు వస్తాయి అనేది మన కణాల్లో ఉండే ‘డీఎన్ఏ’ నిర్ణయిస్తుంది. ఇది మన శరీరానికి సంబంధించిన ఒక పెద్ద ‘గైడ్ బుక్’ లాంటిది. ఈ పుస్తకంలో ఏవైనా తప్పులు ఉంటే మనకు జబ్బులు వస్తాయి. ఈ పుస్తకాన్ని చదివి, అందులో ఎక్కడ తప్పు ఉందో కనిపెట్టే ‘ఆల్ఫా జీనోమ్’ అనే కొత్త టెక్నాలజీని గూగుల్ డీప్‌మైండ్ కనిపెట్టింది. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద…

Read More
Musk comments on Bharat

అగ్రరాజ్యంగా ఇండియా – టెస్లా అధినేత మస్క్ సంచలన కామెంట్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రాభవం తగ్గుతుంటే భారత్ ఆధిపత్యం పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇండియా వృద్ధి రేటును చూసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మార్పు రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను శాసించబోతోంది. పవర్‌ ఫుల్‌ భారత్‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిలో…

Read More
Telugu States Politics

రేవంత్ పంతం… నారా వారి కన్నెర్ర – తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్‌కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణలో ట్యాపింగ్ గుబులుతెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్…

Read More
American Sex Racket King

అమెరికన్ ఫైల్స్… కామాంధుల రీల్స్ – 13 ఏళ్ల బాలికను రేప్ చేసిన ట్రంప్

సహనం వందే, అమెరికా: ప్రపంచాన్ని శాసించే దేశాధినేతలు… అపర కుబేరులు… మేధావుల అసలు స్వరూపం బయటపడింది. సెక్స్ రాకెట్ కింగ్ పిన్ జెఫ్రీ ఎప్ స్టీన్ నిర్వహించిన నరకకూపం తాలూకు వివరాలు ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నీతి నియమాలు చెప్పే పెద్దలు తెర వెనుక ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో ఈ లక్షలాది పత్రాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి నేరం కాదు… అంతర్జాతీయ వ్యవస్థలోని ఒక కుళ్ళిన భాగం. ఎవరు ఈ జెఫ్రీ ఎప్…

Read More
Protein Shake

ప్రొటీన్ షేక్… లైఫ్ షాక్ – కండల కోసం యువత అతి తిండి

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారిని ప్రొటీన్ పిచ్చి పట్టి పీడిస్తోంది. కండలు పెంచాలన్నా, పొట్ట తగ్గాలన్నా ప్రొటీన్ ఒక్కటే మార్గమని నమ్మించే వ్యాపార మాయాజాలం దేశంలో ముదురుతోంది. అయితే అవసరం లేకున్నా దండిగా ప్రొటీన్ షేకులు, మాంసం తినడం వల్ల ఒళ్లు తగ్గకపోగా కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ లెక్కల వెనుక ఉన్న అసలు నిజాలను విశ్లేషిస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. కంపెనీల ప్రోటీన్ మాయాజాలంప్రస్తుతం మార్కెట్లో దొరికే బిస్కెట్లు,…

Read More
Adani

అదానీకి అమెరికా కోర్టులో సెగ – విచారణకు లైన్ క్లియర్

సహనం వందే, న్యూఢిల్లీ: అదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వేసిన ఫ్రాడ్ కేసు కీలక మలుపు తిరిగింది. నోటీసులు అందజేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గౌతమ్ అదానీ చుట్టూ అమెరికా చట్టాల ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇకపై ఈ కేసులో విచారణ వేగంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది. నోటీసులపై అంగీకారంఅమెరికా కోర్టులో అదానీ లాయర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీ పంపే చట్టపరమైన నోటీసులను తామే స్వీకరిస్తామని…

Read More
Hers

అమ్మకానికి యముడు – కోట్లు కుమ్మరిస్తే ప్రాణ బిక్ష

సహనం వందే, అమెరికా: వైద్య రంగంలో డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేనివాడికి మరో న్యాయం ఉందన్న పచ్చి నిజాన్ని ‘హిమ్స్ అండ్ హెర్స్’ సంస్థ ఎండగట్టింది. అమెరికాలో అత్యంత ఖరీదైన క్రీడా వేదికైన సూపర్ బౌల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంస్థ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. “సంపన్నులు మాత్రమే ఎక్కువ కాలం జీవిస్తారు” అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియో.. వైద్య సేవల్లో ఉన్న వివక్షను, బిలియనీర్ల విలాసాలను సూటిగా…

Read More
AI Bubble

ఏఐ బుడగ… ఇన్వెస్టర్ల గుండె దడ – గాలి బుడగలా ఏఐ మార్కెట్

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) మాటే వినిపిస్తోంది. అయితే ఈ ఏఐ అనేది ఒక పెద్ద గాలి బుడగ అని… అది ఎప్పుడైనా పేలవచ్చని ఆర్థిక నిపుణుడు ఎరిక్ గార్డన్ బాంబు పేల్చారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోవడమే దీనికి నిదర్శనమని ఆయన హెచ్చరిస్తున్నారు. ఏఐ వల్ల ప్రపంచం మారిపోతుందని ఆశపడి వేల కోట్లు కుమ్మరిస్తున్న ఇన్వెస్టర్లకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది….

Read More
Dravid Vs Gujarat

ద్రవిడ వర్సెస్ గుజరాత్ – అభివృద్ధి నమూనాలపై యుద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు డెవలప్‌మెంట్ మోడల్స్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. ఒకవైపు ద్రవిడ నమూనా.. మరోవైపు గుజరాత్ నమూనా అంటూ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు రంగును ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, తమిళనాడు మంత్రి పీటీఆర్ త్యాగరాజన్ బయటపెట్టారు. అవినీతిని సమర్థవంతంగా వాడుకోవడంలోనే సక్సెస్ ఉందన్న వీరి విశ్లేషణ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. దక్షిణ దిక్కున ప్రగతి జోరుదక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,…

Read More
Comrades and Comebacks Book

కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్ – ఇండియాలో సంచలనం రేపుతున్న పుస్తకం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఎర్రజెండా రేపిన సంచలనాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా దేశ విధానాలను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం, పోరాట పటిమ నేటికీ యువతరం నరనరాల్లో ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా మితవాద గాలులు వీస్తున్న వేళ ఎర్ర కోటలు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటున్నాయో వివరిస్తూ వచ్చిన ‘కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్’ పుస్తకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది….

Read More
good Sleep - Weightloss

బరువుపై ‘నిద్రే’ బ్రహ్మాస్త్రం – గాఢ నిద్రతోనే స్థూలకాయానికి చెక్

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గడం అనేది ఒక యుద్ధంలా మారిపోయింది. ‘మా ఇంట్లో అందరూ లావే.. నా జన్యువులే ఇంత’ అంటూ చాలామంది ముందే చేతులెత్తేస్తున్నారు. కానీ జన్యువులు మన తలరాతను శాసించలేవని ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆడమ్ పెర్ల్‌మాన్ చెబుతున్నారు. తిండి మానేయడం కాదు… సరైన పద్ధతిలో జీవనశైలిని మార్చుకుంటేనే మెటబాలిజం (జీవక్రియ) పుంజుకుంటుంది. కఠినమైన డైటింగ్ కంటే శరీర అంతర్గత వ్యవస్థను అర్థం చేసుకోవడమే అసలైన రహస్యం….

Read More
education - Caste

‘విష’విద్యాలయాలు – చదువులమ్మ ఒడిలో బడుగులపై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష కోరలు చాస్తోంది. విజ్ఞానం నేర్చుకోవాల్సిన క్యాంపస్‌లు ఇప్పుడు అంటరానితనం, వివక్షకు వేదికలుగా మారుతున్నాయి. ఐదేళ్లలో ఈ అరాచకాలు 118 శాతం పెరగడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చగా నిలుస్తోంది. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారా లేక దాడులు పెరిగాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. రికార్డు స్థాయిలో ఫిర్యాదులువిశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా మారింది. 2019-20…

Read More
Bag Gift - Shift to Jail South Korea

బ్యాగ్ గిఫ్ట్… జైలుకు షిఫ్ట్ – దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి భార్యకి జైలు శిక్ష

సహనం వందే, హైదరాబాద్: విలాసవంతమైన జీవితంపై ఉన్న వ్యామోహం ఒక దేశ ప్రథమ మహిళను కటకటాల వెనుకకు నెట్టింది. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, వజ్రాల నెక్లెస్ వంటి ఖరీదైన బహుమతుల మోజులో పడి దక్షిణ కొరియా మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియాన్ హీ తన పదవిని పోగొట్టుకోవడమే కాకుండా జైలు శిక్షకు గురయ్యారు. అధికార గర్వంతో సాగించిన అవినీతి లీలలు ఇప్పుడు ఆమెను కోర్టు బోనులో నిలబెట్టాయి. కోర్టు సంచలన తీర్పుదక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు…

Read More
Life of Lorry Drivers

హీరోస్ ఆఫ్ రోడ్… ఫుల్లీ అన్-లోడ్! – ఆగిపోతున్న లారీ చక్రం.. ఆకలి చిత్రం

స్టీరింగ్ పడితేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.. ఆ లారీ చక్రం తిరిగితేనే దేశం కడుపు నిండుతుంది. కానీ గమ్యం తెలియని ప్రయాణంలో వాళ్ల బతుకులే రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక నాడికి రక్తాన్ని అందించే రవాణా సైనికులు నేడు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు. నడిరోడ్డుపై నలిగిపోతున్న బతుకులుఅది మండుటెండైనా… వణికించే చలైనా.. ఆరుగాలం లారీ స్టీరింగ్‌తో కుస్తీ పట్టడమే వారి జీవితం. జాతీయ ఆదాయంలో 11 శాతం వాటా అందిస్తున్న రవాణా రంగం వెనుక ఉన్నది రక్తాన్ని…

Read More
WhatsAPP Cheating Secret Reading

వాట్సాప్ ‘చీ’టింగ్… సీక్రెట్ రీడింగ్ – ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా మోసం

సహనం వందే, అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు పెద్ద బాంబు పేలింది. మీ మెసేజ్ లను ఎవరూ చదవలేరన్న మాట అబద్ధమని… మెటా సంస్థ వాటిని రహస్యంగా చూస్తోందని అమెరికా కోర్టులో దావా పడింది. టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ లీకేజీ వ్యవహారం ఇప్పుడు ప్రతి యూజర్ లోనూ వణుకు పుట్టిస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలు ఇవే. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా ఉత్తదేవాట్సాప్ లో మెసేజ్ పంపేటప్పుడు…

Read More
Games Hospitals Play

శవాలతో వ్యాపారం – ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘ఠాగూర్’ సీన్లు

సహనం వందే, హైదరాబాద్: ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో ఈ పుస్తకం కళ్లకు కడుతోంది. చికిత్స పేరుతో సాగుతున్న అక్రమ దందాలు, అనవసరమైన శస్త్రచికిత్సల వెనుక ఉన్న చేదు నిజాలను గణాంకాలతో సహా రచయిత విశ్లేషించారు. టార్గెట్ల వేటలో వైద్యులుభారతదేశంలో ప్రైవేట్ వైద్యం ఒక మాఫియాలా విస్తరించింది. ఆస్పత్రులు రోగులను కేవలం…

Read More
Chinmayi comments on Casting Couch

బూతు సినిమా నీతి కబుర్లు – చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చిన్మయి విస్మయం

సహనం వందే, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మళ్ళీ సెగలు పుట్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒక పక్క పరిశ్రమ స్వచ్ఛమైనది అని ఆయన అంటుంటే, లేదు అది కేవలం భ్రమ అని సింగర్ చిన్మయి గట్టిగా నిలదీశారు. బాధితుల తరపున ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అద్దం కాదు అది మురికి గుంట…మన శంకర వరప్రసాద్ సినిమా వేడుకలో చిరంజీవి…

Read More
Santosh before SIT , Next kavitha?

సంతోష్‌… తర్వాత కవిత? – నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ సంతోష్‌

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ల విచారణ ముగియకముందే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కు సిట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అండతో జరిగిన ఈ అక్రమాల్లో ఆయన పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం జరగనున్న ఈ విచారణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది….

Read More
Hi-B Visa No slots

‘అమ్మో’రికా వీసా – స్లాట్లకు వెయిటింగ్ షాక్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులపై పిడుగు పడింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు ఇప్పుడు ఏకంగా ఏళ్లలోకి మారుతున్నాయి. కొత్తగా వీసా అపాయింట్‌మెంట్ కోరుకునే వారికి 2027 వరకు స్లాట్లు దొరకడం లేదు. అగ్రరాజ్యంలో నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది మంది టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. స్లాట్లు నిల్.. అన్నీ ఫుల్దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా…

Read More
NASA Research

నీటి హిస్టరీ… వీడింది మిస్టరీ – నివ్వెర పరుస్తున్న నాసా అధ్యయనం

సహనం వందే, అమెరికా: అనంత విశ్వంలో భూమిపై మాత్రమే నీరు ఎలా వచ్చింది? మన సముద్రాలు ఎలా నిండాయి? ఈ ప్రశ్నలకు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు. తాజాగా నాసా చేపట్టిన అధ్యయనంలో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. కోట్ల ఏళ్ల కిందట అంతరిక్షం నుంచి కురిసిన గ్రహశకలాల వర్షమే భూమిని జలమయంగా మార్చిందని… తద్వారా జీవం పుట్టుకకు పునాది పడిందని పరిశోధకులు విశ్లేషించారు. అంతరిక్షం నుంచి ఆగమనంపుట్టిన కొత్తలో భూమి కేవలం అగ్నిగోళంలా ఉండేది….

Read More
Next CM - Kalvakuntla Kavitha comments

అధికారం నాదే… సీఎం నేనే – కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రకంపనలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సెగలు పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై ఆమె యుద్ధం ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో కీలక ఆరోపణలు చేస్తూ గులాబీ గూటిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్, అటు పార్టీ భవిష్యత్తుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా…

Read More
Organs

కోర్టులో ‘హార్ట్’ బ్రేక్ – గోడు వెళ్ళబోసుకున్న ఆర్గాన్స్

(“కోర్టు గది కాదు ఇది…” – “నీ శరీరం లోపల నడుస్తున్న కేసు!” “గుండె అరుస్తోంది…”“రక్తం రావట్లేదని!” “లివర్ చెప్తోంది…”“పదేళ్లుగా హెచ్చరిస్తున్నానని!” “ఊపిరితిత్తులు గగ్గోలు…”“పొగతో నింపేశావని!” “మెదడు మండిపోతుంది…”“విశ్రాంతి ఇవ్వలేదని!” “నువ్వు మాత్రం…”‘అన్నీ లైట్ తీసుకున్నావు!’ “శరీరం మాట వినకపోతే…”“అది సమ్మె చేస్తుంది!” “ఇది కథ కాదు…”“మనందరి జీవితం!” “బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకు…”“లేట్ అయితే… ‘తుది తీర్పే’!” “దేహమే న్యాయమూర్తి!”) కోర్టులో న్యాయమూర్తి నల్ల కోటు తీసి తెల్ల కోటు వేశారు. బోనులో 60 ఏళ్ళ…

Read More
GenZ Zero peace

జెన్ జెడ్ జీరో పీస్ – విలాసవంతమైన జీవితం… విపరీత ఒత్తిడి

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం (జెన్ జెడ్) యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. కళ్ల ముందు అనంతమైన ప్రపంచం ఉంది. పాత తరంతో పోలిస్తే తిండి, బట్ట, వసతులకు లోటు లేదు. కానీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. సౌకర్యాల మధ్య పెరుగుతున్నా శాంతి కరువవుతోంది. ఆందోళన, కుంగుబాటు ఇప్పుడు వీరిని నీడలా వెంటాడుతున్నాయి. ఆందోళనల అడ్డాగా యువత జెన్ జెడ్ అని పిలిచే 12 నుండి 27…

Read More
Criminals Marriage on parole

నరరూప రాక్షసుల ప్రేమ పెళ్లి – జైలులో పరిచయమైన ఇద్దరు కిల్లర్స్ ప్రేమ కథ

సహనం వందే, రాజస్థాన్: ఒకరు డేటింగ్ యాప్ ద్వారా అమాయకులను వలలో వేసుకుని చంపే కిరాతకురాలు. మరొకరు పరాయి మహిళ కోసం ఐదుగురిని హతమార్చిన క్రూర హంతకుడు. వీరిద్దరూ జైలు గోడల మధ్య కలుసుకున్నారు. కటకటాల వెనుక చిగురించిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీలు వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైలులో మొదలైన బంధంజైపూర్ లోని సాంగనేర్ ఓపెన్ జైలులో ప్రియా సేథ్, హనుమాన్…

Read More
Dr.Reddy's Medicine Ozempic for weight loss and Diabetes

బరువుపై డాక్టర్ రెడ్డీస్ పోరు – బరువు, షుగర్ రెండింటికి చెక్కు పెట్టే మందు

సహనం వందే, హైదరాబాద్: మధుమేహం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు పెరిగిన బరువు ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ రెండింటికీ చెక్ పెట్టే అద్భుత ఔషధం ఓజెంపిక్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగింది. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ మన హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు సామాన్యుడికి ఈ సంజీవనిని చేరువ చేసేందుకు సిద్ధమైంది. దేశీ మార్కెట్లో సరికొత్త విప్లవండయాబెటిస్ నియంత్రణలో ఓజెంపిక్ ఒక సంచలనం. దీనిని తయారు చేసే నోవో…

Read More
Robots trains home chores

బట్టలు మడత పెట్టడం ఎలా? – రోబోలకు పాఠాలు నేర్పుతున్న ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్: చాట్ జీపీటీతో ప్రపంచాన్ని ఊపేసిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు రోబోటిక్స్ రంగంలో సంచలనానికి సిద్ధమవుతోంది. మనం సినిమాల్లో చూసే రోబోలు ఇకపై నిజం కాబోతున్నాయి. సామ్ ఆల్ట్ మాన్ నేతృత్వంలోని బృందం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక రహస్య ల్యాబ్ నడుపుతోంది. అక్కడ రోబోలకు ఇంటి పనులు నేర్పడమే ప్రధాన లక్ష్యంగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. రోబోలకు ఇంటి పాఠాలు ఓపెన్ ఏఐ సంస్థ తన రోబోటిక్స్ విభాగాన్ని భారీగా విస్తరించింది. గతేడాది…

Read More
Killian

మంచు కొండల్లో పులి పంజా – పర్వతాల పైకి పరుగులు తీసే కిలియన్

సహనం వందే, నార్వే: నిటారుగా ఉండే పర్వతాన్ని చూస్తేనే ఎవరికైనా కాళ్లు వణుకుతాయి. కానీ కిలియన్ జోర్నెట్ కు ఆ కొండలే ఆటస్థలాలు. పర్వతాలను ఎక్కడం కాదు.. వాటిపై పరుగెత్తడం ఇతని ప్రత్యేక శైలి. గాలి తక్కువగా ఉండే మంచు శిఖరాలపై కూడా అతను దూసుకుపోతుంటే ప్రపంచం విస్మయంతో చూస్తోంది. మనిషి శరీరం ఎంతటి తీవ్రమైన శ్రమనైనా తట్టుకోగలదని నిరూపిస్తూ కిలియన్ చేస్తున్న సాహసాలు ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాయి. ఆక్సిజన్ లేని అద్భుతంకిలియన్ జోర్నెట్ చేసిన సాహసాల్లో…

Read More
Education -- Student suicides

శవపేటికల్లో చదువులు – దేశంలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ: కన్నవారి కలలను నిజం చేయాల్సిన చేతులు కాటికి చేరుతున్నాయి. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ చదువులు కోసం క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. విగతజీవులుగా మారుతున్నారు. చదువుల ఒత్తిడి ఒకవైపు.. ఉద్యోగం దొరకదన్న బెంగ మరోవైపు యువతను చిదిమేస్తోంది. ఇది కేవలం మరణాల సంఖ్య కాదు.. కొన్ని వేల కుటుంబాల విషాదం. కాన్పూర్ ఐఐటీలో విషాదందేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన కాన్పూర్ ఐఐటీలో తాజాగా జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. 25 ఏళ్ల స్వరూప్ ఈశ్వరం…

Read More
Diet Coke Plus Fiber

కూల్ డ్రింక్… ఫైబర్ చీటింగ్ – కోకాకోలా కంపెనీ కొత్త స్కెచ్

సహనం వందే, అమెరికా: కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ దిగ్గజాలు రూటు మారుస్తున్నాయి. చక్కెర వల్ల వచ్చే ముప్పును కప్పిపుచ్చుకోవడానికి పీచు పదార్థం అనే కొత్త మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా కోకాకోలా సంస్థ తన పానీయాల్లో ఫైబర్ కలపాలని చూస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులను బుట్టలో వేసుకోవడమే దీని అసలు లక్ష్యం. పీచుపై కోకాకోలా కన్ను…కోకాకోలా సంస్థ ఇప్పుడు తన పానీయాల్లో ఫైబర్ చేర్చడంపై దృష్టి…

Read More
Kalam

గడియారాలకే అందని గడియలు – భారతీయుల కాల విభజన అద్భుతం

కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఆ కాలాన్ని కొలవడంలో మన పూర్వీకులు చూపిన చాకచక్యం అమోఘం. కేవలం సెకన్లు, నిమిషాలకే పరిమితం కాకుండా పరమాణువు స్థాయి నుంచి మహా కల్పాల వరకు కాలాన్ని లెక్కించారు. తృటిలో తప్పిన ప్రమాదం అన్న మాట వెనుక ఎంతటి లోతైన అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాచీన కాలమానంలోని ఆ ఆసక్తికర రహస్యాలివే. తృటి అంటే ఎంత సమయం?మనం అప్పుడప్పుడు తృటిలో తప్పిందని అంటుంటాం. తృటి అంటే సెకనులో…

Read More
Nara Lokesh announced Social Media ban in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ‘సోషల్ మీడియా’పై నిషేధం – దావోస్ లో మంత్రి లోకేశ్ సంచలన ప్రకటన

సహనం వందే, దావోస్: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక మత్తుమందులా మారింది. ఆటపాటలు మరిచిపోయి రీల్స్ లోకంలో విహరిస్తున్న బాల్యాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. సాంకేతికత పేరిట జరుగుతున్న అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియా నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్…

Read More
Dogs adoption

డాగ్ ఫ్రెండ్… దత్తత ట్రెండ్ – కుక్కలను తీసుకుంటే పన్ను మినహాయింపు

సహనం వందే, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం పోతే ఆ వేదన వర్ణనాతీతం. అదే సమయంలో వందల కుక్కలను విషం పెట్టి చంపడం నాగరికతకు మాయని మచ్చ. మనుషుల ప్రాణమా లేక కుక్కల ప్రాణమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒకెత్తయితే విదేశాల్లో అనుసరిస్తున్న మానవీయ పద్ధతులు మరో ఎత్తు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల దుమారంమనుషుల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ముఖ్యమా అంటూ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న జంతు ప్రేమికులను…

Read More
Middle class income

మధ్యతరగతికి మహాయోగం – 2030 నాటికి హై మిడిల్ క్లాస్ దేశంగా భారత్

సహనం వందే, హైదరాబాద్: పేదరికం నీడల నుంచి బయటపడి ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా నిలబడబోతోంది. ఒకప్పుడు తిండికి తిప్పలు పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రథాన్ని నడిపే స్థాయికి చేరుతోంది. ఇది కేవలం అంకెలు చెప్పే లెక్క కాదు… ప్రతి భారతీయుడి తలరాత మారబోతోందన్న నమ్మకం. మన కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతికి మంచి రోజులు రానున్నాయి. పెరగనున్న ఆదాయంప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే…

Read More
Villa plots

విల్లా సొంతింటి కల – సర్కారు భరోసా… వేలంలో ప్లాట్ల విక్రయం

సహనం వందే, హైదరాబాద్: సొంతింటి కల కంటున్న సామాన్యులకు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలు కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ప్రకటన ఒక్కసారిగా వేడి పెంచింది. మధ్యతరగతి ప్రజలకు ఇదో సువర్ణావకాశం అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేలం పాట ఖరారు…హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో మొత్తం 137 ప్లాట్లను…

Read More
No Investments

పెట్టు’బ్యాడ్’లు – పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోర వైఫల్యం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. ప్రపంచ దేశాలు అసూయ పడేలా వృద్ధి రేటు నమోదవుతోంది. కానీ ఈ వేగానికి తగ్గట్టుగా పెట్టుబడులు రావడం లేదు. బ్లూంబెర్గ్ విశ్లేషకుడు మిహిర్ శర్మ మాటల్లో చెప్పాలంటే పెట్టుబడులను ఆకర్షించడంలో మన దేశం వెనకబడుతుంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగడం లేదు. అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ విధానాల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక సందిగ్ధంలో పడింది. మన వైపు మళ్ళని పెట్టుబడులు…భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత…

Read More
Future City Real Estate

‘ఫ్యూచర్’ ల్యాండ్… ఫాస్ట్ డిమాండ్ – రియల్ ఎస్టేట్ లో కొత్త వెలుగుల కిరణం!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోస్తోంది. ముచ్చర్ల వేదికగా అడుగులు పడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ పెద్దల కలయికతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీంతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఇప్పుడు హాట్ కేకులా మారింది. ముచ్చర్లలో నవశకంతెలంగాణ నిరుద్యోగులకు నైపుణ్యం అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్…

Read More
Renu Desai

రేణు దేశాయ్ డైనమిజం – అభిప్రాయాల్లో గుండె ధైర్యం

సహనం వందే, హైదరాబాద్: నటి రేణు దేశాయ్ పేరు వినబడితే చాలు సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం కొందరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య కావడంతో ఆమె రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ ప్రచారాలన్నింటికీ ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పాలిటిక్స్‌కు నేను దూరంతాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని రేణు దేశాయ్…

Read More
కొలువులు చూపని చదువులు

కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది. అగాధంలో విద్యా వ్యవస్థభారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో…

Read More
US Panel Report - Hindu Phobic

మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…

Read More
ఉమర్ బెయిల్... చంద్రచూడ్ డిబేట్

ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం

సహనం వందే, జైపూర్: నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. విచారణే శిక్ష కావద్దుజైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో…

Read More
Excercise

ఒళ్ళు హూనం చేసుకున్నా వృథానే – గంటల తరబడి వ్యాయామంతో లాభం లేదు

సహనం వందే, న్యూఢిల్లీ: బరువు తగ్గాలని కొందరు… కండలు పెంచాలని మరికొందరు జిమ్ముల్లో గంటల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ కేలరీలు కరుగుతాయని… త్వరగా సన్నబడతామని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ మన శరీరం ఒక మిషన్ కాదు. దానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదని తాజా అంతర్జాతీయ పరిశోధనలు కుండబద్దలు…

Read More
Javed Aktar comments on Sanskrit

సంస్కృతం పునాదులపైనే ఉర్దూ నిర్మాణం – భాషల గుట్టు విప్పిన జావేద్ అక్తర్

సహనం వందే, జైపూర్: భాషల పుట్టుకపై సాగుతున్న అర్థం లేని వాదనలకు ప్రముఖ సినీ రచయిత, కవి, బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ భర్త జావేద్ అక్తర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు. జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సంస్కృతం, ఉర్దూ భాషల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. చరిత్ర తెలియక అడిగే ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేస్తూనే… భాషా సంపదపై విద్యార్థులకు, సాహితీ ప్రియులకు విలువైన పాఠాలు నేర్పారు. పురాతన భాష ఏది?సదస్సులో ఒక…

Read More
Techie Puneet Gupta Astrotalk

భక్తితో ఐటీ ఉద్యోగి కోట్లు – ఆస్ట్రోటాక్ వ్యాపారంలో అదిరిపోయే సక్సెస్

సహనం వందే, హైదరాబాద్: సాధారణ మధ్యతరగతి యువకుడు ఐటీ ఉద్యోగం వదిలేసి జ్యోతిష్య రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? పునీత్ గుప్తా ప్రస్థానం సరిగ్గా అలాగే మొదలైంది. ఒక చిన్న ఆలోచన నేడు ఆధ్యాత్మిక వాణిజ్య సామ్రాజ్యంగా మారింది. ఆస్ట్రోటాక్ స్టోర్ ద్వారా కేవలం ఏడాదిలోనే వందల కోట్ల ఆదాయం సాధించి కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచారు. నమ్మకానికి టెక్నాలజీ తోడైతే సక్సెస్ ఎలా ఉంటుందో ఈ కుర్రాడు నిరూపించాడు. పునీత్ ప్రస్థానంఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా…

Read More
America Visa Slots at Hyderabad

అమెరికా వీసా… హైదరాబాద్ భరోసా – నగరంలో వీసా స్లాట్లకు తక్కువ సమయం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూల విషయంలో ఊరట లభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కాన్సులేట్ లో వీసా స్లాట్లు త్వరగా దొరుకుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కొన్ని నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది. ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. భాగ్యనగరంలో వేగంగా స్లాట్లు…హైదరాబాదులో అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గింది. పర్యాటక…

Read More
NEET PG exam changes

మైనస్ 40 మార్కులతోనూ మెడికల్ పీజీ – నీట్ పీజీ కటాఫ్ సున్నా… కేంద్రం నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యార్హత ప్రమాణాలు మరోసారి చర్చకు దారితీశాయి. పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సున్నా మార్కులు వచ్చినా… చివరికి మైనస్ మార్కులు పొందినా పీజీ చేసే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి కటాఫ్ తగ్గింపుదేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా ఖాళీగా…

Read More
Tarang Health Alliance - ​మన చదువు... మన ఆరోగ్యం!

​మన చదువు… మన ఆరోగ్యం – పాఠశాలల్లో ఆరోగ్య విద్య తప్పనిసరి

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే పిల్లలకు పాఠాలతో పాటు పరిపూర్ణ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని యునెస్కో గ్లోబల్ హెల్త్ చైర్ ప్రతినిధి డాక్టర్ రాహుల్ మెహ్రా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలంటే విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. ఇందుకోసం తెలంగాణలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల…

Read More
Dr.Haritha Interview - The Good Life

నలుగురితో మాట నూరేళ్ల బాట – 84 ఏళ్ల హార్వర్డ్ పరిశోధనలో తేలిన అద్భుతం

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో అసలైన ఆనందం ఎక్కడుంది? అధికారం, ఆస్తిపాస్తులు ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏకంగా మూడు తరాల పాటు సుదీర్ఘ పరిశోధన చేసింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఈ శాస్త్రీయ అధ్యయనం చెప్పే సారాంశం ఒక్కటే.. మన సంబంధాల నాణ్యతే మన జీవిత కాలం. ఈ ఆసక్తికర విషయాలపై హైదరాబాద్ కొండాపూర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ హరిత మాదలతో (9959639696) ప్రత్యేక…

Read More
US Visa Banned for 75 Countries

75 దేశాలకు అమెరికా వీసా బంద్ – ట్రంప్ సంచలనం… అంతర్జాతీయ కలకలం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఏకంగా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఇది అగ్రరాజ్యపు వీసా విధానంలో అతిపెద్ద మార్పు. 75 దేశాల జాబితాలో ఉన్నవారు వీరేఅమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన అంతర్గత…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

జర్నలిస్టుల అరెస్టులు నిరంకుశం – జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం!

సహనం వందే, హైదరాబాద్: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పండుగ పూట అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ విలేకరుల ఇళ్లలోకి చొరబడటం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఆయన మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా లేదా చట్టపరమైన నిబంధనలు పాటించకుండా బలవంతంగా తీసుకువెళ్లడం నిరంకుశ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులు నేరస్థులు లేదా ఉగ్రవాదులు కాదని.. వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల…

Read More
Street Dogs Murder

కుక్కల సంహారం… గ్రామాల్లో గందరగోళం – తెలంగాణలో 500 కుక్కలు హతం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది. హామీ తీరింది… ప్రాణం పోయిందితెలంగాణలోని కామారెడ్డి,…

Read More
OS Group Founder Oscar 24 Years Young Entrepreneur

24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్: వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్‌మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల క్రితం ఒక చిన్న గదిలో మొదలైన తన ప్రయాణం.. నేడు ఏటా వందల కోట్ల ఆదాయం గడించే స్థాయికి చేరింది. యువతకు ఇదొక స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ. అమెరికా కుర్రాడి అద్భుత ప్రయాణంన్యూజెర్సీకి…

Read More
Raj, Uddav Thakare comments

ముంబైపై గుజరాధిపత్యం – రాజ్, ఉద్ధవ్ థాకరేల సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, ముంబై: ముంబైపై రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ 20 ఏళ్ల వైరం వీడి థాక్రే సోదరులు చేతులు కలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే… మరాఠీ మనోభావాలను అస్త్రంగా మలచుకుని బీజేపీపై యుద్ధం ప్రకటించారు. హిందీ భాషా ప్రయోగంపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిందీపై హెచ్చరికహిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేది లేదని……

Read More
Anil Ravipudi - Tollywood Most Wanted

టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట

సహనం వందే, అమరావతి: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పటాస్ లా మొదలైన అనిల్ రావిపూడి విజయ యాత్ర… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పీక్ స్టేజ్‌కు చేరింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్లతో పాటు భగవంత్ కేసరితో సీరియస్ హిట్లు కొట్టిన అనిల్… తాజా చిత్రంతో నిర్మాతలకు ఆణిముత్యంలా మారారు. దీంతో ఆయనతో సినిమా కోసం నిర్మాతలు, హీరోలు క్యూలు కడుతున్నారు. విజయాలు…

Read More
Trump Questions Electronic voting

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…

Read More
5 AM Trend Life End

5 ఏఎం ట్రెండ్… లైఫ్ ఎండ్ – ఐదింటికి అలారం ఆయుషుకు గండం!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, అథ్లెట్లు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సక్సెస్ కావాలంటే ‘5 ఏఎం క్లబ్’లో చేరాల్సిందేనన్న భ్రమలో యువత తమ నిద్రను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్ మనిషి ప్రాణాల మీదకు తెస్తుందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మూర్ఖత్వపు ట్రెండ్కాలిఫోర్నియాకు చెందిన స్లీపింగ్ నిపుణుడు మైఖేల్ బ్రూస్ ఈ ట్రెండ్‌ను తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున 5 గంటలకు…

Read More
Fidel Castro - Trump

ఫిడెల్… అమెరికా గుండెల్లో ధడేల్ – అగ్రరాజ్యాన్ని వణికించిన నాటి క్యూబా నేత

సహనం వందే, హైదరాబాద్: ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ ఇదే అమెరికా.. ఇదే సీఐఏ.. అదే సముద్రం అవతల క్యూబా అనే చిన్న దేశంలో మాత్రం ఒక మనిషి తలవెంట్రుకను కూడా పీకలేకపోయింది.. అతనే ఫిడెల్ క్యాస్ట్రో..! తలవంచని యోధుడు…అతను ఒక మనిషి కాదు.. ఒక తలవంచని…

Read More
Tourist Visa Scrutiny

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే నిబంధనల ఉచ్చు ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. వీసా రావడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిబంధనల ఉచ్చు బిగుస్తోందిభారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం పర్యాటక వీసాదారులకు తాజాగా ముందస్తు…

Read More
Cow scam Jabalpur

పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు

సహనం వందే, జబల్ పూర్: గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ విలాసాలకు వాడుకున్నారు. పరిశోధనలు పక్కన పెట్టి విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణాలతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తగలేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆవుల…

Read More
Chat GPT Health

అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం

సహనం వందే, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యం గురించి మన రిపోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తిప్పలకు చెక్ పెడుతూ ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ హెల్త్ అనే సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది. ఇది మీ పర్సనల్ డాక్టర్‌లా మారి మీ మెడికల్ రికార్డులను అరటిపండు వలిచినట్లు వివరిస్తుంది. వైద్య సమాచారానికి డిజిటల్ తోడు…మనం నిత్యం వాడుతున్న చాట్‌జీపీటీ ఇక నుంచి కేవలం కబుర్లు…

Read More
Like Numbers life

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

సహనం వందే, హైదరాబాద్: మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆటల్లో స్కోరు బోర్డు ఇస్తుంది గెలుపు కిక్కు…మీరు డన్జియన్స్ అండ్ డ్రాగన్స్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు…..

Read More
Vizianagaram MP Kalisetti Appalanaidu

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం

సహనం వందే, విజయనగరం: విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న నిరంతర కృషి నేడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తున్న మార్పు ఇదీ. భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పుడు…

Read More
Prof.Jayashankar Agri.University Exam Paper Leak Scam

అగ్రి లీకేజీ… భారీ ప్యాకేజీ – వ్యవసాయ వర్సిటీ పేపర్ల దందాలో పెద్దలు

సహనం వందే, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమాల పుట్ట పగిలింది. అన్నదాతకు సాయం చేయాల్సిన ఏఈఓలే ఇప్పుడు కాపీ కొట్టి దొరికిపోయారు. తమ ప్రమోషన్ల కోసం ఏకంగా పేపర్లనే కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వ సొమ్ముతో చదువుకుంటూ అక్కడే సిబ్బందికి ఆశ చూపి పేపర్లను బయటకు తెచ్చారు. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు బట్టబయలైంది. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు వివరాలు చూస్తే సామాన్యుడు విస్తుపోవాల్సిందే. భ్రస్టు…

Read More
No Non Veg at Ayodhya

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!

సహనం వందే, అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య ధామ్, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించింది. కేవలం దుకాణాలకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరిగే డెలివరీలను కూడా అడ్డుకుంటూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్రతకు పెద్దపీట…అయోధ్య నగరం ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని…

Read More
Education GenZ Skills

ఈ చదువులు మాకొద్దు – ఇంజనీరింగ్ వంటి చదువులకు యువత స్వస్తి

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు చౌదరి గారి అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఐఏఎస్ లేదా డాక్టర్ కాకపోతే కనీసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా సాధించాలన్నది తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి యువత ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను తుడిచిపెట్టేస్తోంది. డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం అంటూ సరికొత్త కెరీర్ బాట పడుతోంది. నచ్చిన పని చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలవడమే లక్ష్యంగా జెన్ జెడ్ తరం దూసుకుపోతోంది. మారిపోతున్న కెరీర్ రూపురేఖలు…దేశంలో…

Read More
Demand for High Value Homes

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు

సహనం వందే, హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇతర ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గుతున్నా… హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరగడంతో పాటు ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం నగర రియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇళ్ల విక్రయాల జోరు…హైదరాబాద్ నగరం 2025 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది….

Read More
Maduro

వెనిజులా గుండెల్లో మండుతున్న మదురో – దేశవ్యాప్తంగా అమెరికాపై ఆగ్రహజ్వాలలు

సహనం వందే, వెనిజులా: వెనిజులాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. పాత అధ్యక్షుడు మదురో అమెరికా చెరలో ఉన్నా… కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. అసలు అధికారం ఎవరి చేతిలో ఉందో అర్థం కావడం లేదు. కాగితాల మీద కొత్త ప్రభుత్వం ఉన్నా… వీధుల్లో మాత్రం మదురో మనుషులదే రాజ్యం నడుస్తోంది. దీనివల్ల దేశం ఒకేసారి రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతోంది. ఈ అధికార పోరు ఇప్పుడు రక్తపాతానికి దారితీస్తోంది. వ్యవస్థల్లో పాతుకుపోయిన మదురో వర్గంనికోలస్ మదురో సుదీర్ఘ…

Read More
Alternative drink by Yasmeen Santos instead of Alcohol

మత్తు మారదు… మందు ఉండదు – ఆల్కహాల్ లేకుండానే రిలాక్సేషన్ ఫార్ములా

సహనం వందే, అమెరికా: గ్లాసులో పోస్తే ఆల్కహాల్ లాగే కనిపిస్తుంది. సిప్ చేస్తే కిక్కు ఇస్తుంది. కానీ ఇది మద్యం కాదు. కాలేయాన్ని పాడు చేయదు. హ్యాంగోవర్ అస్సలే ఉండదు. మెటా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలో పనిచేసిన ఓ యువతి, సాఫ్ట్‌వేర్ కోడింగ్ వదిలేసి మూలికలతో ముడిపడిన వినూత్న వ్యాపారంలోకి దూకింది. మత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన మొక్కలతో అద్భుతాలు సృష్టిస్తోంది. సాఫ్ట్‌వేర్ వదిలి… వంటిల్లే ప్రయోగశాలయాస్మిన్ శాంతోస్ ఒకప్పుడు మెటా కంపెనీలో యాడ్ స్పెషలిస్ట్‌గా…

Read More
CBI Vijay Karur Incident

సీబీఐ వేట… కమలం ఆట – ‘తొక్కిసలాట’లో విజయ్ ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను విజయ్ పై పడింది. ఒకవైపు కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతం కాగా… మరోవైపు పొత్తుల రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సీబీఐ విచారణల వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఆయన…

Read More
Navneet Kaur 's Comment Owaisi Counter

వై నాట్ 20… ఓవైసీ కౌంటర్ – బీజేపీ ఎంపీ నలుగురు సంతానంపై విమర్శ

సహనం వందే, మహారాష్ట్ర: దేశంలో హిందూ ముస్లిం రాజకీయం మరింత పెరుగుతుంది. ముస్లింలు ఎక్కువమంది కంటున్నారని… దీనివల్ల హిందుస్థాన్ పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉందని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్లు రచ్చ అవుతున్నాయి. హిందువులు నలుగురు పిల్లలు కనాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ‘నాకు ఆరుగురు ఉన్నారంటూ, ఎంఐఎం అధినేత ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపుతున్నాయి. అభివృద్ధిని వదిలేసి పిల్లల సంఖ్య చర్చకు రావడం వింతగా మారింది. ఓవైసీ ఘాటు…

Read More
Surgeons met CM

సర్జన్ల భవనానికి సీఎం సహకారం – రేవంత్ రెడ్డిని కోరిన డాక్టర్ బొంగు రమేష్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సర్జన్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, యువ వైద్యులకు ప్రపంచస్థాయి శిక్షణ అందించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మహత్తర ఆశయానికి ప్రభుత్వం నుంచి భూమి సహకారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించింది. ముఖ్యమంత్రితో భేటీ…అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఎస్ఐ…

Read More
Trump warnings

ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం…

Read More
Gujarat Collector

1500 కోట్ల కలెక్టర్ స్కామ్ – ఐఏఎస్ ‘స్పీడ్ మనీ’ దందాపై ఈడీ దెబ్బ

సహనం వందే, గుజరాత్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేసిన చందమిది. ఐఏఎస్ అనే అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారి సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రమని రాజేంద్రకుమార్ పటేల్ నిరూపించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి, అందినకాడికి దండుకున్న ఈ ‘అవినీతి చక్రవర్తి’ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది….

Read More
#jobs by references

దోస్తులతోనే ఉద్యోగమస్తు – రిఫరల్ ఉంటే కొలువు 10 రెట్లు గ్యారెంటీ!

సహనం వందే, హైదరాబాద్: కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగంలో చేరాలని కలలు కంటున్నారా? అయితే మీరు కఠినమైన పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వేలాది అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. అర్హత ఉన్నా సరే సరైన వ్యూహం లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే మీ దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. గురి చూసి కొట్టాలిఉద్యోగ వేటలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వందల సంఖ్యలో అప్లికేషన్లు…

Read More
Sankrathi cinemas Box office

బాక్సాఫీస్ బీట్… పండుగ హీట్ – సంక్రాంతి హీరో… విజేత ఎవరో?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు వారికి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అరవై ఏళ్ల వృద్ధుడి నుంచి ఆరేళ్ల పిల్లాడి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్ల వైపు చూసే సమయం ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద యుద్ధం మామూలుగా ఉండేలా లేదు. అగ్ర కథానాయకులు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. పండుగ హడావుడి ఇప్పుడే మొదలైంది. ప్రభాస్ వింటేజ్ మేజిక్…రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి తన పంథా మార్చారు. భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ‘ది రాజా…

Read More
Doctors met CM

ముఖ్యమంత్రికి డాక్టర్ల మొర – వైద్యుల సమస్యలు పరిష్కరించాలని విన్నపం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మొరప్రభుత్వ వైద్యుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అప్రమత్తమైంది….

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More
Haridwar

హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు

సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….

Read More
Psychiatrist shortage

పిచ్చోడంటారు… పట్టించుకోరు – 85 శాతం మందికి అందని మానసిక వైద్యం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మానసిక సమస్యలు ముదురుతున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్నారు. అయితే వీరికి వైద్యం అందించే వ్యవస్థ మాత్రం కుంటుపడుతోంది. చికిత్స పొందాల్సిన వారు కొండంత ఉంటే… సాయం చేసే చేతులు గోరంతే ఉన్నాయి. ఈ అంతరం భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సమాజం మానసిక కుంగుబాటులోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. చికిత్సలో భారీ అంతరం…భారతదేశంలో మానసిక వైద్యం అందని ద్రాక్షలా మారింది….

Read More
Venezuela President Maduro

వెనిజులా దేశాధ్యక్షుడి కోట బద్దలు – అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడిన అమెరికా ఫోర్స్

సహనం వందే, వెనిజులా: అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వెనిజులా దేశంపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా పట్టుకుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఆపరేషన్ తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చేస్తున్న ఈ సాహసం చమురు రాజకీయం వైపు మలుపు తిరుగుతోంది. అర్ధరాత్రి ఆపరేషన్ తో విలవిలశనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ దేశ రాజధాని…

Read More
Revanth serious action on Oilpalm company Lohiya

రేవంత్ మార్క్… అదిరిపోయే స్ట్రోక్ – ఆయిల్ పామ్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

Read More
Poor People Houses

గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…

Read More
D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Shravan Kumar Shankh Air Tempo Driver to Flight Owner

టెంపో డ్రైవరే విమాన ఓనర్ – 35 ఏళ్ల శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఘనత

సహనం వందే, కాన్పూర్: నిన్నటి వరకు ఆయన చేతులు టెంపో స్టీరింగ్‌ను తిప్పాయి. నిత్యం రద్దీగా ఉండే కాన్పూర్ గల్లీల్లో వస్తువులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆయన దినచర్య. కానీ ఆ చేతులే ఇప్పుడు విమాన రెక్కలకు ఊపిరి పోస్తున్నాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గగన విహారానికి బాటలు వేసిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ విజయగాథ ప్రతి సామాన్యుడికి ఒక స్ఫూర్తి పాఠం. టెంపో స్టీరింగ్ నుంచి విమానం దాకా శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ప్రయాణం అత్యంత…

Read More
Romila Thapar Speaking of History

చరిత్ర అంటే వాట్సాప్ కాదు – ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ కామెంట్

సహనం వందే, న్యూఢిల్లీ: చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాల కథలు మాత్రమే కాదు. అది మన వర్తమానాన్ని ప్రభావితం చేసే ఒక జీవన రికార్డు. కానీ దురదృష్టవశాత్తు నేడు చరిత్రను కట్టుకథలతో పోలుస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, రచయిత నమిత్ అరోరాతో కలిసి నిజమైన చరిత్ర ప్రాముఖ్యతను లోకానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాల ముప్పు…నేటి కాలంలో చాలా మందికి చరిత్ర పుస్తకాల్లో దొరకడం లేదు. సెల్…

Read More
Dr.Kiran Madala press Note

డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందని ఎరియర్స్తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో…

Read More
Vodaphone Birla

’87 వేల కోట్ల’ న్యూ ఇయర్ గిఫ్ట్ – బిర్లాకు కేంద్ర క్యాబినెట్ కళ్ళుచెదిరే కానుక

సహనం వందే, న్యూఢిల్లీ: భారత కుబేరుడు బిర్లాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కళ్ళు చెదిరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల కుప్పగా మారిన వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు 87,695 కోట్ల రూపాయలను దశాబ్దాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2032-41 మధ్య ఆ బకాయిలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. బిర్లా ఆధ్వర్యంలో…

Read More
OSHO Teachings

‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం

సహనం వందే, హైదరాబాద్: నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం ఒక ముసుగు…మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి…

Read More
10 Min delivery Workers Strike

డెలివరీలో ‘టైమ్ బాంబ్’ – 10 నిమిషాల ఫుడ్ సరఫరాతో ప్రాణాలకు ముప్పు

సహనం వందే, హైదరాబాద్: మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డేంజర్డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ…

Read More
Civil Services preparation

ఐఏఎస్… లైఫ్ లాస్ – సివిల్స్ మోజులో విలువైన కాలం వృథా

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మంది యువత సివిల్స్ పరీక్షల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి గదుల్లో బందీలుగా మారి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుందన్న భ్రమలో విలువైన ఉత్పాదక సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతోందని ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. వృథా…

Read More
Cartoonist Eenadu Sreedhar

కార్టూన్లతో ఎన్’కౌంటర్’ – ‘ఈనాడు’ శ్రీధర్ బొమ్మల్లో బాంబులే

సహనం వందే, హైదరాబాద్: తెలుగు పత్రికా రంగంలో కార్టూన్ అంటే శ్రీధర్… శ్రీధర్ అంటే కార్టూన్ అన్నట్లుగా ఆయన ముద్ర పడింది. కొన్ని దశాబ్దాల పాటు ఈనాడు పత్రికలో ఆయన గీసిన గీతలు రాజకీయ దిగ్గజాలను సైతం ఆలోచింపజేశాయి. గీతలతోనే లోకాన్ని చదివిన అరుదైన కళాకారుడు శ్రీధర్. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకంఈనాడు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన బొమ్మలు గీస్తూనే ఉన్నారు. ఆయనను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
Jyothi - Asian Games Gold Medal

ఉత్తరాంధ్ర బిడ్డకు కలిశెట్టి అండ – ఆసియా అథ్లెటిక్స్‌లో జ్యోతికి బంగారు పతకం

సహనం వందే, విజయనగరం: ఉత్తరాంధ్ర మట్టిలో మాణిక్యం మెరిసింది. అడ్డంకులను అధిగమించి ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. ఆసియా అథ్లెటిక్క్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదరికాన్ని జయించి పతకాల వేటలో సాటిలేని మేటిగా నిలిచిన ఈ అథ్లెట్ ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. ఆమె సాధించిన స్వర్ణ పతకం భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. మరోసారి ఆసియా విజేతజ్యోతి యర్రాజీ మరోసారి తన సత్తా చాటింది. కొరియాలో…

Read More
Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
MP Navneet Kaur Comments on Muslims

కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…

Read More
Kalisetti Appalanaidu MP

దందా చేస్తే బొంద పెడతా – విజయనగరం ఎంపీ కలిశెట్టి హెచ్చరిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం రాజకీయాల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రత్యేక ముద్ర వేశారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్ సభలో అడుగుపెట్టారు. నిరాడంబరత, నిబద్ధతే పెట్టుబడిగా ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవిని బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అప్పలనాయుడుతో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ విజయనగరం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ. సహనం వందే: ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర అయింది కదా… మీ అనుభూతి ఏంటి?అప్పలనాయుడు:…

Read More
Govt.Doctors Dharna

తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు

సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Outsourcing employees

వెట్టికి వెల లేదు… చాకిరికి విలువ లేదు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకు దయనీయం

సహనం వందే, హైదరాబాద్: అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సగం మందికి పైగా వేతన వివక్ష…ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన…

Read More
Dhurandhar Movie not dubbing in Telugu

ధురంధర్ డబ్బింగ్‌కు టాలీవుడ్ అడ్డు – తెలుగు వెర్షన్ రాకుండా కుట్రలు కుతంత్రాలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ నామజపమే వినిపిస్తోంది. దేశభక్తి సెగను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. రణవీర్ సింగ్ తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే ఉత్తరాదిని ఊపేస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దూరం చేయడం వెనుక గూడుపుఠాణి జరుగుతోందన్న చర్చ మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ…రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. సినిమా నిడివి అంత…

Read More
Wedding Insurance Benefits

మ్యారేజీకి బీమా కవరేజీ – పెళ్లి రద్దయితే ఖర్చు మొత్తం వెనక్కు వస్తుంది

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పెళ్లి అంటే కుటుంబంలో భారీ సందడి. కోట్లు ఖర్చు చేసి ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక హోదాగా మారింది. నగలు, విందు వినోదాల కోసం లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదం జరిగి పెళ్లి ఆగిపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసే బీమా గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఏడాదికి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు…ప్రస్తుత ఏడాదిలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్లో 6.5…

Read More
#Abroad Studies expenses

విదేశీ గడ్డపైనే బిడ్డ భవిష్యత్తు – తమ పిల్లల విదేశీ చదువుకు 28 వేల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చదువులకు స్వదేశీయులే మొహం చాటేస్తున్నారు. కోట్లాది రూపాయల సంపద విదేశీ వర్సిటీల పాలవుతోంది. మన దగ్గర నాణ్యత లేక లక్షలాది మంది విద్యార్థులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రతిభతో పాటు భారీగా డబ్బు కూడా తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వలసల పర్వం… ఆవిరవుతున్న ధనందేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది….

Read More
Journalism Antarctica Yatra

మంచు ఖండంలో మృత్యు జర్నలిజం – అంటార్కిటికాలో సాహస పరిశోధన

సహనం వందే, అమెరికా: మనిషి జీవించలేని ఖండం అంటార్కిటికా. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మంచు ఖండాన్ని పరిశోధించాల్సిందే. భూమి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న గ్లేసియర్ల గుట్టు విప్పేందుకు ఒక భారీ శాస్త్రీయ బృందంతో పాటు మొదటిసారిగా జర్నలిజం బృందం సాహస యాత్ర చేస్తుంది. ప్రమాదకరమైన అలలు, గడ్డ కట్టే చలిని ఎదుర్కుంటూ సాగే ఈ ప్రయాణం కేవలం పరిశోధన మాత్రమే కాదు… అంతకు మించిన ఒక ఉత్కంఠభరితమైన…

Read More
Health issues with Rice and Roties

అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…

Read More
Bhagavadgita and Yoga

భగవద్గీత మత గ్రంథం కాదు – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, చెన్నై: భగవద్గీత అంటే కేవలం పూజ గదిలో ఉండే పుస్తకం కాదు. అది మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన సంహిత. యోగా అనేది ఒక వ్యాయామం కాదు… అది ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య వరం. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మన సంస్కృతిని, ఆరోగ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. భారతీయ మూలాలను మతంతో ముడిపెట్టి చూడొద్దని కోర్టు స్పష్టం చేసింది. గీత… ఒక మానసిక చికిత్సభగవద్గీతను కేవలం…

Read More
Serious Action on Fake Medicine - IMA

నకిలీ వైద్యంపై ఐఎంఏ ఉక్కుపాదం – రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగం నేడు కనీవినీ ఎరుగని కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆసుపత్రులపై నిబంధనల సంకెళ్లు. మరోవైపు అకారణంగా వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు. పల్లెల్లో నకిలీ వైద్యుల ప్రాణసంకటం. ఈ గడ్డు పరిస్థితుల్లో వైద్యుల పక్షాన నిలిచి పోరాడేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర యాక్షన్ కమిటీ కదనరంగంలోకి దూకింది. వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిందని గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ కిరణ్ మాదల ఒక ప్రకటనలో…

Read More
Shivaji Comments on Women Dressing

శివాజీకి చెంపచెళ్లు – బూతు పురాణంపై మహిళ కమిషన్ కొరడా

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు సినీ నటుడిగా వెలిగి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తహతహలాడుతున్న శివాజీకి ఊహించని దెబ్బ తగిలింది. సినిమా ఫంక్షన్లలో తన మార్కు మేధావి మాటలు చెప్పబోయి అడ్డంగా బుక్కయ్యారు. సంస్కారం గురించి నీతులు చెబుతూనే మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో శివాజీ ఇరకాటంలో పడ్డారు. ధండోరా ఈవెంట్లో నోటి దురద…శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ధండోరా సినిమా వేడుక వేదికగా…

Read More
Wegovy Tablets

విగోవీ స్లిమ్ ఈజీ – అమెరికాలో బరువు తగ్గే మాత్రకు గ్రీన్ సిగ్నల్

సహనం వందే, అమెరికా: అతిగా పెరిగిన బరువుతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్. పొట్ట తగ్గించుకోవడానికి… ఒళ్లు కరిగించుకోవడానికి రోజూ సూదులు గుచ్చుకోవాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు.. కిలోల కొద్దీ బరువు మటాష్ అయిపోతుంది. అమెరికా ఆరోగ్య శాఖ తాజాగా ఆమోదించిన ఈ మ్యాజిక్ విగోవీ పిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. డెన్మార్క్ సంస్థ సంచలనంప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ ఈ సరికొత్త మాత్రను…

Read More
Highest Debts - Andhra & Telangana occupies Top 10

అప్పులు బిల్డప్పులు – టాప్10లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఏడో స్థానంలో తెలంగాణ…దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన…

Read More
Bharat HIndu Desam - Mohan Bhagavath

భారత్ హిందూ దేశమే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్తీకరణ

సహనం వందే, కోల్ కతా: హిందూ జీవన విధానమే భారత దేశానికి ఆత్మ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని అంగీకరించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా దేశ మూలాలను వెతకాలని… భారత్ ఎప్పటికీ హిందూ దేశంగానే వర్ధిల్లుతుందని కోల్ కతా వేదికగా ఆయన కుండబద్దలు కొట్టారు. అది సూర్యోదయం లాంటి సత్యంతూర్పున సూర్యుడు ఉదయించడానికి ఏ రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని భగవత్…

Read More
Celebrities in Public Events

తోపులాటల్లో సెలబ్రిటీలు – నిధి అగర్వాల్, సమంతలకు చుక్కలు

సహనం వందే, హైదరాబాద్: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడటం సహజమే అయినా అది హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా అగ్ర కథానాయిక సమంతకు హైదరాబాదులో ఎదురైన అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. జనం మధ్య చిక్కుకుని ఆమె పడ్డ ఇబ్బంది చూస్తుంటే నగరంలో భద్రత ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్షణ కరువైన వేళ భాగ్యనగరం పరువు పోతోందని విపక్షాలు సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తోపులాటలో సమంతహైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సమంతకు…

Read More
Rs.68000 tip to Instamart Delivery Boy for condoms delivery

‘లక్ష’ కండోమ్స్… 68 వేల టిప్ – ఆన్ లైన్ లో క్రేజీ ఆర్డర్లు.. కళ్ళుచెదిరే టిప్పులు

సహనం వందే, బెంగళూరు: ఆన్‌ లైన్ డెలివరీ యాప్‌లు ఇప్పుడు కేవలం అవసరాల కోసమే కాదు… వింతలకు, విశేషాలకు వేదికగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి విలాసాల వరకు ఏది కావాలన్నా చిటికెలో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన కొన్ని ఆర్డర్లు చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా కొందరు కస్టమర్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. లక్ష రూపాయల కండోమ్స్…సాధారణంగా ఎవరైనా కిరాణా సామాను లేదా కూరగాయలు…

Read More
60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner

తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది. తెలంగాణలో ఓట్ల వేట రాష్ట్ర పర్యటనలో ఉన్న…

Read More
Talk of the Sunday - KCR Press Meet

టాక్ ఆఫ్ ది సండే కేసీఆర్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం సందడి

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సండే పొలిటికల్ మండే…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన…

Read More
With Sarrogacy developing Empire

వ్యాపార సామ్రాజ్యానికి 100 మంది కొడుకులు – సరోగసి పద్ధతిలో కంటున్న బిలియనీర్లు

సహనం వందే, హైదరాబాద్: చైనా కుబేరులు ఇప్పుడు కేవలం ఆస్తులు పెంచుకోవడమే కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అడ్డదారుల్లో వంశ విస్తరణకు తెరలేపారు. చైనాలో సరోగసీ (అద్దె గర్భం)పై నిషేధం ఉండటంతో వీరు తెలివిగా అమెరికా చట్టాలను వాడుకుంటున్నారు. వీడియో గేమ్స్ కంపెనీ అధిపతి జూ బో దీనికి తాజా ఉదాహరణ. ఏకంగా 100 మందికి పైగా పిల్లలను కనడం కేవలం కుటుంబ ప్రణాళిక కాదు… ఇదొక భారీ వ్యాపార వ్యూహం. అమెరికాలో పుట్టిన…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

రాహుల్ గాంధీ… హామీ ఏమైంది? – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదేంటి?

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం…

Read More
ఒకే ప్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

కటౌట్ కిక్.. పాలిటిక్స్ షేక్ – ఒకే ఫ్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది. పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ…

Read More
H-1B visa appointments delayed in India

ఇండియాకు వచ్చి ఇరుక్కుపోయారు – అమెరికా వీసా స్టాంపింగ్ రద్దుతో బందీలు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా కల ఇప్పుడు భారతీయ టెక్కీల పాలిట కన్నీటి గాధగా మారుతోంది. క్రిస్మస్ సెలవులకు సరదాగా సొంతూరికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఇక్కడే బందీలుగా మిగిలిపోయారు. అమెరికా కాన్సులేట్ల ఆకస్మిక నిర్ణయాలతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అగ్రరాజ్యపు వీసా ఆంక్షలు భారతీయ మేధోసంపత్తిని అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గందరగోళంలో వీసా స్లాట్లుఅమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు ఇప్పుడు పెద్ద విపత్తుగా మారింది. డిసెంబర్ 15 నుంచి 26…

Read More
పేదింటి చదువుకు చదువుకు హరీష్ రావు అండ

పేదింటి చదువుకు సొంతిల్లు తాకట్టు – డాక్టరమ్మ చదువుకు హరీష్ రావు అండ

సహనం వందే, సిద్దిపేట: కష్టం వస్తే కాదనని మనసు… కన్నీరు వస్తే కరిగిపోయే తత్వం ఆయనది. సిద్దిపేట బిడ్డల భవిష్యత్తు కోసం తన ఆస్తులను సైతం పణంగా పెట్టే గొప్ప మానవతావాది హరీష్ రావు. తాజాగా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని మెడికల్ పీజీ చదువు ఆగిపోకుండా ఉండేందుకు ఆయన ఏకంగా తన స్వగృహాన్నే బ్యాంకులో తనఖా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫీజు గండం నుంచి బయటపడేలా…సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని…

Read More
ఉత్తరాంధ్ర భూదందా

ఉత్తరాంధ్ర భూదందా… పవన్ పంజా! – అక్రమార్కుల గుండెల్లో డిప్యూటీ సీఎం దడ

సహనం వందే, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు రాజకీయ నేతల ఆటబొమ్మలయ్యాయి. ధరలు పెరగడంతో వివాదాలు ముదిరి హత్యల దాకా వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సొంత పార్టీ సహా కూటమి నేతలే ఈ దందాల్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చాలు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ పవర్ వార్నింగ్రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో…

Read More
Examples for చిన్నప్పుడు తోపు... పెద్దయ్యాక ప్లాపు: Viswanathan Anand Einstein

చిన్నప్పుడు తోపు… పెద్దయ్యాక ప్లాపు

సహనం వందే, హైదరాబాద్: పిల్లవాడు పట్టుమని పదేళ్లు రాకముందే బ్యాటు పట్టుకుని సెంచరీలు కొడుతున్నాడా? వెంటనే అతనో సచిన్ టెండూల్కర్ అయిపోతాడని మురిసిపోకండి. బాల్యంలోని మెరుపులు భవిష్యత్తులో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు సామాన్యంగా కనిపించేవారే కాలక్రమేణా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిభకు తొందరపాటు కంటే సహనమే అసలైన పెట్టుబడి అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. పరిశోధన చెప్పిన చేదు నిజంజర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు అర్నే గులిచ్ నేతృత్వంలో ఈ…

Read More
Hush Dating

హుష్ డేటింగ్… కొత్త ట్రెండింగ్ – అడ్డూ అదుపూలేని హైదరాబాద్ చెత్త కల్చర్

సహనం వందే, హైదరాబాద్: గతంలో ప్రేమంటే ఒక గర్వం. పది మందికి చెప్పుకునే ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు కలియుగం పరాకాష్టకు చేరింది. బంధాలకు రంగులు మారాయి. నిన్న మొన్నటి వరకు పెళ్లి పెటాకులు లేకుండా సహజీవనం అంటూ తిరిగారు. ఇప్పుడు అంతకుమించి చెత్త కల్చర్ హైదరాబాదును సర్వనాశనం చేస్తుంది. నగర యువత ఇప్పుడు కొత్త రూట్ పట్టింది. అదే హుష్ డేటింగ్. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలియకుండా.. కేవలం ఇద్దరి మధ్యే సాగే ఈ…

Read More
రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్

రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్ – రిటైర్డ్ కార్మికుల సొమ్ము 4 కోట్లకు రెక్కలు

సహనం వందే, రాజమండ్రి: రిటైర్ అయ్యాక ఆసరాగా ఉంటుందని దాచుకున్న పైసలు మాయమయ్యాయి. దశాబ్దాల పాటు ఫ్యాక్టరీలో రక్తం ధారపోసి సంపాదించిన సొమ్మును సొసైటీ ముంచేసింది. ఆంధ్ర పేపర్ మిల్లు (రాజమండ్రి) రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యారు. నమ్మించి ముంచారుఆంధ్ర పేపర్ మిల్లులో 30 నుంచి 40 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వచ్చిన…

Read More
హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్

హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్ – భారత్ ను శాసించే జలయుద్ధ తంత్రం

సహనం వందే, న్యూఢిల్లీ: హిమాలయ సానువుల్లో చైనా మరో దుశ్చర్యకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది చైనా చేతుల్లో బందీ కానుంది. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు… భారత్ భవిష్యత్తును శాసించే జల యుద్ధ తంత్రం. వాటర్ బాంబు ముప్పుచైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యామ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు…

Read More
Termination Orders

వైద్యులపై ఉక్కుపాదం – ఏపీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల తొలగింపు

సహనం వందే, విజయవాడ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కోట్లాది రూపాయల జీతాలు తీసుకుంటూ ఏడాదిన్నర పైగా విధులకు ఎగనామం పెడుతున్న 62 మంది వైద్య అధ్యాపకుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) జి.రఘునందన్ రావు నిర్ణయించారు. అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ప్రొవిజనల్ టర్మినేషన్ ఆర్డర్లు విడుదల…

Read More
NTA Online Exams

ఆన్‌లైన్ పరీక్ష అల్లకల్లోలం – ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణ అధ్వాన్నం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత వైఫల్యాలు బయటపడుతున్నాయి. సాంకేతికత పేరుతో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అక్రమాలు, హ్యాకింగ్ భయాల మధ్య పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్‌టీఏ తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తప్పుల తడకగా ఎన్‌టీఏజాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ వైఫల్యాలు వరుసకడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన 14 పరీక్షల్లో ఐదింటిలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. నీట్ యూజీ పేపర్…

Read More
Speaker Telangana

ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…

Read More
Hyderabad link in Australia Attack

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ‘ఉగ్ర’రూపం – సిడ్నీ కాల్పుల టెర్రరిస్ట్ రాజధాని వాసుడే

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్‌ కు లింకులు పదే పదే వెలుగులోకి రావడం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ కాల్పుల దాడిలో 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ అనే ఉగ్రవాదికి భారత పాస్‌పోర్ట్, అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లు గుర్తించడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సాజిద్ అక్రమ్ భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, అతని రాడికలైజేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉంది. హైదరాబాద్…

Read More
Beauty Stars Globally

బ్యూటీ బ్రాండ్… గ్లోబల్ ట్రెండ్ – టాప్ టెన్ హీరోయిన్లలో కృతిసనన్ కు చోటు

సహనం వందే, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ అందాల తారల్లో ఇండియాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మాత్రమే నిలిచింది. ఈ ఏడాదికిగాను ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్టులో ఆమె ఐదో స్థానం…

Read More
Kavitha

కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…

Read More
Congress MLAs fails in Local Body Elections

తరిమికొట్టిన సొంతూరు – సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సెగ

సహనం వందే, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత గూటిలోనే ఓటర్లు పక్క చూపులు చూడటంతో దీనిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారం చేతిలో ఉన్నా సొంత గ్రామాలను గెలిపించుకోలేని ఈ దుస్థితి ఏమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో…

Read More
Upadi Haami Pathakam

ఉపాధికి సమాధి – కొత్తగా రాష్ట్రాల వాటా 40 శాతం ప్రతిపాదన

సహనం వందే, హైదరాబాద్: గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్రే కానుందా? కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు మార్చడమే కాక… దాని స్వరూపాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది! మహాత్ముడి పేరు తొలగించి… దానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి అని కొత్త పేరు పెట్టే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది….

Read More
Akhanda Vs Dhurandar

అ’ఖండ ఖండ’ – దురంధర్ దెబ్బకు బాలకృష్ణ విలవిల

సహనం వందే, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద చుక్కెదురైంది. అంచనాలకు తగ్గ స్పందన రాకపోవడంతో తొలి రోజు వసూళ్లకు… శని-ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన లేదు. ఇదే సమయంలో విడుదలైన మోగ్లీ చిత్రం పూర్తిగా తేలిపోయింది. రణ్‌వీర్ సింగ్ నటించిన హిందీ చిత్రం ధురంధర్ దూసుకుపోతుంది. కేవలం హిందీ వెర్షన్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పై థ్రిల్లర్ జోరు పెంచడం…

Read More
IIM Bangaluru

బెంగళూరు ఐఐఎం ప్లేస్‌మెంట్స్ కుంభకోణం – పీజీ స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ కమిటీ నిర్వాకం

సహనం వందే, బెంగళూరు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 20 మంది సభ్యులున్న విద్యార్థి ప్లేస్‌మెంట్ కమిటీ మొత్తం ఒక్కసారిగా రాజీనామా చేయడంతో 2026 నాటి నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10న ఈ సామూహిక రాజీనామా జరిగింది. అసలు ఈ రాజీనామాలకు కారణం ఏమిటంటే… నియామక ప్రక్రియలో ఓ ముఖ్యమైన నిబంధనను కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉండేలా…

Read More
Ramdev Baba Karam

రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!

సహనం వందే, న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని…

Read More
Australia Beach attacks

యూదులు లక్ష్యం… చారిత్రక శతృత్వం – ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి వెనక కారణం అదే

సహనం వందే, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మృతి చెందారు. ఉల్లాసంగా ఉన్న వాతావరణంలోకి తుపాకీ గుళ్లు దూసుకురావడం… చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ఊచకోత కోయడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాల్పులకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనడానికి నిదర్శనం. ఇది కేవలం ఆవేశంలో చేసిన దాడి కాదు… యూదులు పై విధ్వంసం సృష్టించడానికి…

Read More
Bapatla incident

భార్య శవంతో బైకుపై పోలీస్ స్టేషన్‌కు..! – హత్య చేసి లొంగిపోయిన భర్త

సహనం వందే, బాపట్ల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న…

Read More
One Sperm Hundreds of Kids

వందలాది పిల్లలకు తండ్రి అయ్యే ఛాన్స్ – ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం కోట్ల వ్యాపారం

సహనం వందే, లండన్: ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం ఇప్పుడు వేల కోట్ల వ్యాపారంగా వృద్ధి చెందుతోంది. ఒకే వ్యక్తి స్పెర్మ్ ద్వారా వందల మంది పిల్లలు పుడుతున్న సంచలన విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బీబీసీ’ న్యూస్ ఛానల్ (https://bbc.in/48SL4MG) ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఒక దాత వీర్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యు మార్పు ఉన్నట్లు తేలింది. ఈ వ్యక్తి వీర్యాన్ని ఏకంగా 14 దేశాలకు పంపించి దాని ద్వారా కనీసం…

Read More
Sanskrit in Pakistan

పాకిస్తాన్ కోటలో సంస్కృత పాఠాలు – అక్కడి యూనివర్సిటీలో భాష బోధన

సహనం వందే, పాకిస్తాన్: ఏడు దశాబ్దాల తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన తర్వాత ఏకంగా ఏడు దశాబ్దాలకు అక్కడ మళ్లీ సంస్కృత మంత్రాలు వినిపిస్తున్నాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్ యూఎంఎస్) తొలిసారిగా సంస్కృత బోధనను పునరారంభించింది. ఇది కేవలం భాష కాదు ఇదొక సాంస్కృతిక వారధి అని అక్కడి ప్రొఫెసర్లు బల్లగుద్ది చెబుతున్నారు. భారత పాకిస్తాన్ ఉమ్మడి వారసత్వంలో సంస్కృతం కీలకమని… అందుకే పురాతన గ్రంథాలను…

Read More
Jagan Vs Sharmila

నా ఆస్తి నా ఇష్టం – షర్మిల వాటాకు జగన్ టాటా

సహనం వందే, హైదరాబాద్: తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని…

Read More
Indians to Foreign Countries

విదేశీ సిటిజెన్’చిప్ప’ కోసం… – భారత పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాది

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. దేశంలోని పాలన, వ్యవస్థల పట్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతుంది. దీంతో అనేకమంది దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. దేశ పౌరసత్వాన్ని వదిలేసి విదేశాల్లో శాశ్వతంగా ఉండిపోతున్నారు. కోటీశ్వరులు మొదలు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు కూడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. నాణ్యమైన జీవనం కోసం వీరంతా విదేశీ బాట పడుతున్నారు. ఇక్కడ కష్టపడి చదువు పూర్తి చేసిన యువత ఉన్నత విద్య…

Read More
Swamynathan

‘దీపం’ మంటల్లో న్యాయమూర్తి – మద్రాస్ న్యాయమూర్తి స్వామినాథన్‌కు సెగ

సహనం వందే, న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ 100 మందికి పైగా ఎంపీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా 50 మందికి పైగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ చర్య న్యాయమూర్తులను బెదిరించే ప్రయత్నమేనని… ఇది ప్రజాస్వామ్య మూలాలను, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని వారు…

Read More
Gorrelakunta Murders

ఐదేళ్ల నరమేధం… వీడని భయం – వరంగల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ వ్యవహారం

సహనం వందే, వరంగల్: ఐదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను వణికించిన గొర్రెకుంట సీరియల్ కిల్లర్ వ్యవహారం ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక అక్రమ సంబంధంతో మొదలైన ఈ దారుణం పది మంది హత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 2020 మే నెలలో జరిగిన ఈ సామూహిక హత్యల ఘటన నేరం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. పోలీసుల చర్యలతో నేరస్తుడికి ఉరిశిక్ష పడినా ఆ…

Read More
Poor People Life

సగం జీవితాలు సర్వనాశనం – 50 శాతం పేదల సంపద 6.4 శాతం మాత్రమే

సహనం వందే, హైదరాబాద్: ధనవంతులు-పేదల మధ్య ఉన్న దారుణమైన అంతరాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణుల తాజా నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. థామస్ పికెట్టీ, లూకాస్ చాన్సెల్ వంటి మేధావులు సవరించిన ప్రపంచ అసమానత నివేదిక (వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్) ప్రకారం… దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతున్నా ఆ వృద్ధి ఫలం కేవలం కొద్దిమంది సంపన్న వర్గాలకే దక్కుతోంది. సామాన్య ప్రజలు దారుణంగా అన్యాయానికి గురవుతున్నారు. దేశ సంపదలో ఏకంగా 40 శాతం వరకు అత్యంత…

Read More

నోబెల్ కోసం మారువేషం – వెనిజులా ప్రతిపక్ష నాయకురాలి సాహసం

సహనం వందే, వెనిజులా: వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో దేశం నుంచి గురువారం తప్పించుకున్న తీరు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు… 24 గంటల నిఘాను ఛేదించుకుని ఆమె రహస్యంగా నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. ఈ వారం జరిగే నోబెల్ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ఆమె రహస్యంగా దేశం విడిచి వెళ్లారు. మారువేషంలో 900 కి.మీ….

Read More
Foot Ball Messi

అరుదైన వ్యాధితో మెస్సీ’ఫుట్‌బాల్’ – కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది. కష్టాల కడలి దాటిన దిగ్గజం…ఫుట్‌బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని…

Read More
Three Gandhis

ముగ్గురు గాంధీల కొత్త గ్లామర్ – పార్లమెంటును ఊపేస్తున్న తల్లీ, అన్నాచెల్లెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు కలిసి పార్టీకి నాయకత్వం వహించారు. అయితే కాంగ్రెస్‌కు ఏకకాలంలో ముగ్గురు గాంధీలు నాయకత్వం వహించిన దాఖలాలు లేవు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ పార్లమెంటును రఫ్ ఆడిస్తున్నారు. సోనియా గాంధీ పార్టీకి పెద్దదిక్కుగా ఉండగా… రాహుల్ గాంధీ తన రాజకీయ అనుభవంతో పార్టీని ముందుండి…

Read More
Thirupathi పట్టు వస్త్రాల కోట్ల స్కామ్

పట్టు వస్త్రాల కోట్ల స్కామ్ – మరోసారి తిరుమలలో పవిత్రతకు భంగం

సహనం వందే, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కుంభకోణాల సుడిగుండంలో చిక్కుకుంది. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, పరకామణిలో చోరీ వంటి వివాదాల తర్వాత తాజాగా టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా రూ. 55 కోట్ల విలువైన పట్టు దుపట్టా కొనుగోలు కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీవారి సేవలో, ఆలయ ఉత్సవాలలో, దాతలకు వేదాశీర్వచనం సమయంలో ఉపయోగించే పవిత్రమైన పట్టు వస్త్రాల విషయంలో ఈ మోసం జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా…

Read More
Bank Loans

బడాబాబులకు బ్యాంకులు బంపర్ ఆఫర్ – ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు కేవలం కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు ఇస్తున్నాయి. అంతే కాదు వాళ్లు అప్పులు చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే వాటిని రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. వాటిని ఏకబిగిన రద్దు చేస్తుంది. తాజాగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పాత బకాయిలను రద్దు చేయడం దారుణం. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం?దేశంలో బ్యాంకుల…

Read More

ఆకాశంలో ఆట… ఇండిగో వేట! – గుత్తాధిపత్యానికి 6 విమాన సంస్థలు బలి!

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన 6 ప్రముఖ సంస్థలు వరుసగా కుప్పకూలడం వెనుక కేవలం అప్పులు, ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలే కారణమా? లేక దేశీయ గగనతలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రధాన సంస్థలు పన్నిన కుట్రనా? అన్న అనుమానాలున్నాయి. ఈ సంస్థల పతనం కేవలం వ్యాపార వైఫల్యం కాదు. మార్కెట్‌లో పోటీ లేకుండా చేసేందుకు పెద్ద సంస్థలు పన్నిన కుట్ర…

Read More
Global Summit Hydraa Highlight

గ్లోబల్ సమ్మిట్… హైడ్రా హైలైట్ – గ్లోబల్ సమ్మిట్‌లో హైద‌రాబాద్ ముద్ర

సహనం వందే, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హైడ్రా కార్యకలాపాలపై అమితాసక్తి చూపించారు. ముఖ్యంగా నగరంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ గురించి వారు ఆరా తీశారు. అలాగే వర్షాకాలంలో వరదల నివారణకు హైడ్రా తీసుకున్న పటిష్ట చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు, పర్యావరణవేత్తలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఆయన చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలిపారు. చెరువుల అభివృద్ధిపై…

Read More
Ram Mohan Naidu Union Minister for Civil Aviation

అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…

Read More
Cine Stars

తారలు… కొత్త దారులు – తెరపై తళుకులు… బయట వెలుగులు

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు నటీమణుల పాత్ర కేవలం వెండితెరకే పరిమితం. పెళ్లి కాగానే ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. అలాగే అవకాశాలు తగ్గగానే కొందరు కనుమరుగైపోయేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి! ఈ తరం తెలుగు నటీమణులు నటనతోపాటు అనేక రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఆల్ రౌండర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా తమ జీవిత లక్ష్యం అక్కడితో ఆగదని నిరూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఈ తారలు నిజ జీవితంలో…

Read More
Australia - SocialMedia

పదహారేళ్ల ప్రాయం… సోషల్ మీడియా తాళం – చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా నిషేధ చట్టం

సహనం వందే, ఆస్ట్రేలియా: పిల్లల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు ఎవరూ సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండకూడదు. ఈ కీలక నిబంధన బుధవారం నుంచే అమలులోకి రాబోతోంది. నిజానికి ఈ చట్టాన్ని ఏడాది క్రితమే ఆమోదించినప్పటికీ సోషల్ మీడియా వ్యసనం, దానితో ముడిపడిన రిస్కులనుంచి పిల్లలను రక్షించాలనే ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు వాస్తవరూపం దాల్చనుంది. ప్రస్తుతం 13…

Read More
Arnav Goswamy comments Civil Aviation Minister

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని ఉతికిపారేసిన అర్నాబ్‌ గోస్వామి

సహనం వందే, అమరావతి: దేశంలో ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత పెద్ద సమస్య ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర మంత్రి మాత్రం కనీసం స్పందించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు మంత్రి ఏం చేస్తున్నారంటూ… నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారా? లేక రీల్స్‌, నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాడా? అంటూ రిపబ్లిక్‌ టీవీ ప్రజెంటర్‌ అర్నాబ్‌…

Read More
Putin Comments on India

‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు……

Read More
Sania Mirza and with her' Son

టెన్నిస్ తూచ్… అమ్మతనమే అదుర్స్ – స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగం

సహనం వందే, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు జీవితంలోనూ విజేతగా నిలిచింది. అనేక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సానియా… కోర్టు బయట తన తల్లి అనుభవాలను పంచుకుంది. తన కొడుకు ఇజ్హాన్‌ను పెంచే క్రమంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం… జీవితంలో సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడమే అని ఆమె అంటున్నారు. టెన్నిస్‌లో గెలవడం మాత్రమే కాదు, జీవితపు మ్యాచ్ ప్లాన్‌లో విజయం సాధించాలంటే కుటుంబం, కెరీర్ మధ్య…

Read More
Vijayasai Reddy

కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!

సహనం వందే, అమరావతి: మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ…

Read More
Indigo

ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….

Read More
Maseedu@Ayodhya

అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది…

Read More
Dr.Raghuram

డాక్టర్ రఘురామ్‌ కు అంతర్జాతీయ గౌరవం – రాయల్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నిక

సహనం వందే, హైదరాబాద్: దేశ వైద్య రంగానికి దక్కిన చారిత్రక గౌరవం ఇది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గవర్నింగ్ కౌన్సిల్‌కు భారతదేశం నుంచి ఎన్నికైన తొలి శస్త్రవైద్యుడిగా డాక్టర్ రఘురామ్‌ ఘనత సాధించారు. కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్ రఘురామ్…

Read More
Eswara Chari Death

బీసీ బిడ్డ బలిదానం… రగులుతున్న తెలంగాణ

సహనం వందే, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం…

Read More
World Population Review

అమెరికా అహంకారం… చైనా చండాలం – అగ్రరాజ్యాలను ఇష్టపడని ప్రపంచ ప్రజలు

సహనం వందే, అమెరికా: ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రజలు అత్యంత ఎక్కువగా డిస్‌లైక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన 2025 ప్రపంచ సర్వే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ద్వేషించే దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, తైవాన్‌ వంటి ప్రాంతాల స్వేచ్ఛను అణచివేయడం… ఉయ్‌ఘుర్ ముస్లింలపై దాడులు… మానవ హక్కుల ఉల్లంఘనలు… కోవిడ్ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది చైనాను…

Read More
400 Indigo Flights Cancelled

ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…

Read More
Rage Bait Word of the Year shakes Social Media

సోషల్ మీడియాలో ‘రేజ్ బెయిట్’ షేక్ – ఆక్స్‌ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఈ పదం

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో…

Read More
Rahul Gandhi Comments on Puthin Visit

విదేశీ స్నేహం… విపక్షం దూరం – కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. అభద్రతా భావంతోనే ఆంక్షలు…గతంలో…

Read More
Girl Friend Movie on Netflix

గర్ల్‌ఫ్రెండ్ లో ఓయో రూమ్ – కాలేజీ లేడీస్ హాస్టల్‌ లో ప్రేమికుల రాసలీలలు

సహనం వందే, హైదరాబాద్: ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం ఈరోజు నుంచి (డిసెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సినిమాలు కుటుంబ సభ్యులు కలిసి చూడాలా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఇచ్చి గొప్ప కళాఖండంగా డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. ఇందులో అభ్యుదయ భావాలతో చూపించిన ప్రత్యేకతలు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. పైగా టీనేజ్ పిల్లల మనసుల్లో విష భావాలు నింపేలా ఈ చిత్రం ఉందన్న విమర్శలు…

Read More
Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
Apple Opposes SancharSathi

యాపిల్‌ డోంట్ కేర్ – సంచార్ సాథీ యాప్ షరతుల తిరస్కరణ

సహనం వందే, హైదరాబాద్: సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్‌ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది….

Read More
Amar Subrahmanyam Apple AI Vice President

యాపిల్ కు ఇండియన్ చికిత్స – వైస్ ప్రెసిడెంట్ గా బెంగళూరు సుబ్రహ్మణ్యం

సహనం వందే, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మేధావుల కోసం జరుగుతున్న టాలెంట్ వార్ తారస్థాయికి చేరింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు షాకిస్తూ‌… యాపిల్ ఒక కీలక అడుగు వేసింది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేసి… తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమర్ సుబ్రమణ్యాన్ని యాపిల్‌ ఏఐకి కొత్త వైస్ ప్రెసిడెంటుగా నియమించుకుంది. ఏఐ రేసులో వెనుకబడిన యాపిల్‌ను ముందుకు తీసుకెళ్లడమే సుబ్రహ్మణ్య ముందున్న అతిపెద్ద సవాల్….

Read More
Acid Attack at Warangal

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

సహనం వందే, వరంగల్:నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
Sexual Content Hacking

బెడ్‌రూమ్స్ హ్యాకింగ్ – ఇళ్లల్లో అమర్చుకున్న కెమెరాల హైజాక్

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్…

Read More
CAS Twist

10 ఏళ్ల రూల్‌కు డీఎంఈ గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్:కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…ఇప్పటికే…

Read More
Sky Walk inn Vizag

దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన -కైలాసగిరి పర్వత శిఖరంపై అద్భుత నిర్మాణం

సహనం వందే, విశాఖపట్నం: భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం….

Read More
Lead Actors

హీరో కాదు లీడ్ యాక్టర్ – సినీనటులను హీరోలని పిలవకూడదు

సహనం వందే, పల్నాడు:సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు లేదా అన్నం పెట్టే రైతుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే…

Read More
World AIDs Day

టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన…

Read More
వందేళ్ళ వైపరీత్యం

వందేళ్ళ వైపరీత్యం – పురుడు పోసుకుంటున్న నాటి వినాశనాలు

సహనం వందే, హైదరాబాద్: వైపరీత్యాలు ప్రతీ వందేళ్ళకోసారి పునరావృతం అవుతాయని అంటుంటారు.1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో 50 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కోట్ల మంది చనిపోయారు. దాదాపు అటువంటి వైరసే 2019లో వచ్చిన కరోనా. దీనివల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అందరికీ తెలుసు. అది సృష్టించిన మానవ విలయం ప్రతి కుటుంబానికి అనుభవంలోకి వచ్చిందే. అలాగే ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన అసాధారణ పరిస్థితులు వందేళ్ళ రికార్డులను తిరగరాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల…

Read More
Age wise alcohol usage

ఫుల్ బాటి(కి)ల్ – వయసు పెరిగే కొద్దీ మందు విషమే!

సహనం వందే, హైదరాబాద్: యుక్త వయసులో నాలుగు గ్లాసులు తాగినా తేలికగా పనిచేసే శరీరం… ఇప్పుడు రెండు గ్లాసులకే కళ్లు బైర్లు కమ్మి పడక చేరడానికి సిద్ధమవుతుందా? అయితే దానికి కారణం కేవలం వయసు మారుతూ ఉండటమే. వయసు పెరిగే కొద్దీ మందు మన శరీరంపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం… ముఖ్యంగా కాలేయం (లివర్) పనితీరు మందగించడం ఇందుకు ప్రధాన కారణం. 50, 70 ఏళ్ల…

Read More
Elon Musk Indian Sun in Law

మన దేశ అల్లుడు మస్క్ – భార్య శివాన్ కి ఇండియన్ మూలాలు

సహనం వందే, అమెరికా: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాకు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఆయన భార్య శివానికి భారతీయ మూలాలు ఉండటమే దీనికి కారణం. తన కొడుకు పేరు వెల్లడించడంతో మస్క్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన భాగస్వామి సగం భారతీయురాలని… అందుకే తన కొడుకు పేరు శేఖర్ అని పెట్టామని మస్క్ బహిరంగంగా చెప్పడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు….

Read More
Temple for Aliens

గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!

సహనం వందే, తమిళనాడు:దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ…

Read More
100 Notable Books

అక్షరాలు ఎటాక్ – ‘లిబరేషన్ డే’ బుక్ సంచలనం

సహనం వందే, అమెరికా: ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రచయితలు గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. వాటిల్లో వంద పుస్తకాలను న్యూయార్క్ టైమ్స్ లిస్ట్ చేసింది. అందులో నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా జార్జ్ సాయిమన్ రాసిన ‘లిబరేషన్ డే’ పుస్తకం భవిష్యత్తు భయాలను చిత్రించింది. ఇందులో టెక్నాలజీ – మానవత్వం మధ్య సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ రచనలు కేవలం సాహిత్యాన్ని మాత్రమే కాదు… సమాజాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తాయి. ఈ ఆసక్తికరమైన కథనం…

Read More
Diabetes

డయాబెటిస్… డోంట్ వర్రీస్ – అనవసర అపోహలతో ఆరోగ్య సమస్యలు

సహనం వందే, హైదరాబాద్: డయాబెటిస్ అంటేనే చాలామంది భయపడే పరిస్థితి. ముఖ్యంగా దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ‘పంచదార తింటేనే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలా మందిలో ఉన్న బలమైన నమ్మకం. నిజానికి ఇది పూర్తి నిజం కాదు. టైప్-2 డయాబెటిస్ అనేది జన్యువులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి కలయిక వల్ల వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నేరుగా డయాబెటిస్‌ను కలిగించకపోయినా… అవి బరువు…

Read More
Sarpanch Suicides

సర్పంచుల సమాధిపై పల్లెప్రగతి! – 60 మంది ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ గత ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పల్లెప్రగతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఫలితంగా కనీసం 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మాట పక్కన పెడితే ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇంత పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకరం. గ్రామపంచాయతీ…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More
Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
Malayali Stars

స్కిన్ కాదు స్క్రిప్ట్! – మలయాళ సినిమా మాయ దేశమంతా ఫిదా

సహనం వందే, హైదరాబాద్:భాషతో సంబంధం లేకుండా ఒక సినిమాకు దేశమంతా ఫిదా అవుతోందంటే దాని వెనుక బలమైన కథ, అద్భుతమైన కథనం ఉన్నట్టే లెక్క. దశాబ్దాలుగా కేరళ సరిహద్దులకే పరిమితమైన మలయాళ సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులతో సహా దేశంలోని అన్ని వర్గాలు కిష్కింధ కాండం స్క్రీన్‌ప్లే గురించి, ‘ఆవేశం’లోని ఇల్యూమినాటి పాటపై మాట్లాడుకుంటున్నారు. ఒక్క తెలుగు సూపర్‌స్టార్ లేకపోయినా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు…

Read More
AP Politicians' Weekend @Hyderabad

ఆదివారం ‘అమరావతి’ అనాథ – హైదరాబాదులో నేతల వీకెండ్ ఎంజాయ్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది. ప్రత్యేక విమానంలోనే పయనం…వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను……

Read More
Upasana Comments on Egg Freezing at IIT Hyderabad

‘చిల్ చిల్’ బేబీ… అమ్మ బిజీ – ఎగ్ ఫ్రీజింగ్ తో అండం నిల్వ మహిళకు వరం

సహనం వందే, హైదరాబాద్:ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ భార్య, అపోలో ఆస్పత్రి అధిపతి ఉపాసన ఇటీవల ఐఐటీ హైదరాబాద్ వేదికగా చేసిన ఎగ్ ఫ్రీజింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. మహిళలు తమకు ఇష్టమైన సమయంలో పిల్లలను కనే అవకాశం ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ఇస్తుందని ఆమె సలహా ఇచ్చారు. అంతేకాదు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత పిల్లలను కనవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది మహిళలందరికీ హుక్కు అని… కొందరికే పరిమితం కాదని ఆమె పేర్కొన్నారు. తాను ప్రేమించి…

Read More

ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది. ఆరు నెలలు…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More

యుద్ధ విషాదం… అందంతో సందేశం – మిస్ యూనివర్స్ వేదికపై పాలస్తీనా గొంతుక

సహనం వందే, పాలస్తీనా:యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందం నీడలో సందేశం..‌.అందాల పోటీలు…

Read More

శుక్రకణాలకు శనిగ్రహం – పురుషుల్లో పునరుత్పత్తి వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ప్రమాదకరంగా క్షీణిస్తోందని అంతర్జాతీయ అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు శుక్రకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కోట్లాది జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి, దీంతో అనేక చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అనేక మోసాలకు పాల్పడుతున్నాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతంతో అసలు సంతాన వైఫల్యానికి కారణాలపై…

Read More

సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

చేతి భోజనం … అజీర్తి దూరం

సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More

ఏఐ స్టార్టప్ కొనుగోలు చేసిన యాపిల్

సహనం వందే, హైదరాబాద్: ఆన్-డివైస్ మోడల్స్‌ పై దృష్టి సారించిన ఒక స్టెల్త్ ఏఐ స్టార్టప్ ను యాపిల్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు భవిష్యత్తులో మరింత అధునాతనమైన సిరి అప్‌డేట్లు వస్తున్నాయని సూచిస్తోంది. ఈ స్టార్టప్ లైట్‌వెయిట్, ప్రైవసీ-ఫస్ట్ మోడల్స్‌ లో నిపుణత్వం కలిగి ఉంది. ఇది వినియోగదారుల డేటా భద్రతకు ప్రాధాన్యతనిచ్చే యాపిల్ విధానానికి అనుగుణంగా ఉంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో నూతన ఆవిష్కరణలు వేగంగా దూసుకుపోతున్నాయి. అభివృద్ధి చెందిన సాంకేతికతలతో తయారైన…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More

వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

Read More

బతుకుపై బండ… చావుకు అండ…ఇంగ్లాండ్ లో చట్టం

సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ. ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు..‌.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Read More

అగ్రికార్పొరేషన్లలో అవినీతి క్రీడ-కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక…

Read More

ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…

Read More

బేడీలపై వేడి – గద్వాల్‌లో రైతుల చేతికి సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్:రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. అనేక సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలకే అన్నదాతలకు సంకెళ్లు వేసి వారిని ఈడ్చుకొని వెళ్లడం దాష్టీకానికి పరాకాష్ట. తాజాగా జోగులాంబ గద్వాల్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి, నేరస్తుల్లా కోర్టుకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ… జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును నిలదీశారు. బేడీలు…

Read More

688 ఏళ్ల నాటి లండన్ హత్య కేసు – హత్య నిజా నిజాలు

సహనం వందే, లండన్:సుమారు 688 సంవత్సరాల క్రితం… సరిగ్గా 1337 మే సాయంత్రం.‌.. లండన్‌లోని ఓల్డ్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పూజారి దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి, గొంతు, కడుపులో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ హత్య వెనుక ఎలా ఫిట్జ్‌పేన్ అనే ధనిక కుటుంబానికి చెందిన శక్తివంతమైన మహిళ హస్తం ఉందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో వ్యభిచారం, దోపిడీ,…

Read More

ఆయిల్ ఫెడ్ బోర్డుకు బురిడీ… కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి. అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం….

Read More

ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…

Read More

గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…

Read More

ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ అధికారాలకు కత్తెర

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర పడింది. అంతేకాదు ఆయనకు ఘోర అవమానం జరిగింది. తద్వారా కార్పొరేషన్ జీఎం పోస్టును డమ్మీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకునే దానికంటే సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జనరల్ మేనేజర్ పోస్టు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎండీ తర్వాత కీలకమైన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ – రాజకీయ రంగ ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 35 ఏళ్ల అసదుద్దీన్ గతంలో హైదరాబాద్ కోల్ట్స్, గోవా వంటి జట్లకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి అపారమైన స్ఫూర్తి పొందినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పట్ల, పార్టీ విలువల పట్ల కనబరుస్తున్న నిబద్ధత తనను ఎంతగానో…

Read More

జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More

గుడ్డు గోల్‌మాల్‌ – మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో డ్రామా

సహనం వందే, హైదరాబాద్:మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న గుడ్డు గోల్‌మాల్‌ షాక్‌కు గురిచేస్తోంది. పాత కాంట్రాక్టర్లకే గుడ్ల సరఫరా కట్టబెడుతూ, కొత్త టెండర్ల ఎంపికలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు 36 కోట్లకు పైగా కోడిగుడ్ల సరఫరా కోసం ఏటా టెండర్లు జారీ చేయాలి. కానీ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన టెండర్లు పాత కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లుగా నిబంధనలు వచ్చాయి. దీనిపై పౌల్ట్రీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా,…

Read More

మహావీర్ మెడికల్ కాలేజ్ మహా డ్రామా..నకిలీ రోగికి రూ. 2 వేలు

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సోమవారం ప్రారంభం కావాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు బ్రేక్ పడింది. సహనం వందే, ఆర్టికల్ టుడే డిజిటల్ పేపర్లలో వచ్చిన కథనాలతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. ముందస్తు సమాచారం ఇచ్చి మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తున్నారని సహనం వందే, ఆర్టికల్ టుడే లు (sahanamvande.com & articletoday.in) ప్రచురించడం సంచలనం అయ్యింది. ఈ విషయం ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి కూడా…

Read More

అదృశ్యమై దశాబ్దం.. జాడలేని మలేషియా ఎయిర్‌లైన్స్

సహనం వందే, హైదరాబాద్:2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌… సరిగ్గా అర్ధరాత్రి 12:41 గంటలకు బోయింగ్ 777-200 మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం చైనా రాజధాని బీజింగ్‌ వైపునకు బయలుదేరింది. అందులో 239 మంది ప్రయాణిస్తున్నారు. బయలుదేరిన గంట తర్వాత విమానం అకస్మాత్తుగా రాడార్‌లో కనిపించకుండా పోయింది. చివరిసారి ‘గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో’ అని విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇచ్చిన తర్వాత గల్లంతైంది. ఆ తర్వాత విమానం…

Read More

సెక్యులరిజం నయా ట్రెండ్ – మతాలకు గుడ్ బై చెబుతున్న కోట్లమంది

సహనం వందే, ఢిల్లీ: ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగేఅమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్…

Read More

మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More

రెండు ఫ్లాట్లు… నిండా నోట్లు – కరోనా తీసుకొచ్చిన అదృష్టం

సహనం వందే, హైదరాబాద్: డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు…

Read More

కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More

‘ఆయిల్ ఫెడ్’పై సురేందర్ కన్ను – మళ్లీ ఎండీగా ప్రయత్నాలు

సహనం వందే, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేందర్ ఆయిల్ ఫెడ్ లోకి మళ్లీ ఎంటర్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ కు ఆయన దాదాపు మూడేళ్లకు పైగా ఎండీగా పనిచేసి డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లారు. అయితే ప్రస్తుత ఎండీ యాస్మిన్ బాషాకు అనేక ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో ఆమె ఆయిల్ ఫెడ్ పై అంతగా కేంద్రీకరించలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది….

Read More

జెన్ జెడ్ జెట్ స్పీడ్…

సహన బొల్లోజు జనరేషన్‌ జెడ్‌… ఇప్పుడిప్పుడే పదహారేళ్ల పడుచుప్రాయాన్ని పూర్తి చేసుకున్న యువత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ… ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడేందుకు… లక్ష్య సాధన కోసం జెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సరికొత్త ప్రపంచాన్ని చుట్టేసేందుకు పయనమైన జనరేషన్‌ జెడ్‌కు చిత్రవిచిత్ర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ నేర్చుకున్న పరిజ్ఞానం… అనుసరించిన విధానం…. సాగుతున్న తరుణం సరైన దిశలోను ఉందా? లేక దారితప్పిందా? అనే సందేహాలు యువ మస్తిష్కాన్ని ఆందోళనకు…

Read More

వ్యవసాయ ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలో వ్యవసాయ ఉగ్రవాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఫంగస్‌ను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలపై ఒక చైనా మహిళను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటన వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ప్రమాదాలను, ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును చాటింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు కూడా ఇలాంటి దాడుల వల్ల ముప్పు ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి?యుంకింగ్ జియాన్…

Read More

కమల్ హాసన్ కు తమిళనాట మైలేజీ!

సహనం వందే, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కన్నడ భాష పుట్టుక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం తమిళనాడులో ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ భాషపై తీవ్ర వివాదం…‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో…

Read More

తిరుమలేశుని సేవలో ఆయిల్ ఫెడ్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ ఇద్దరి కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. వారిద్దరే ఆ సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆయిల్ ఫెడ్ లోని కీలక విభాగాల్లో పాగా వేశారు. దీంతో వారు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. వారు ఏం చెప్తే అది జరుగుతుంది. వారిద్దరి సేవలో ఆయిల్ ఫెడ్ సంస్థ పునీతమవుతుంది. వారే తిరుమలేశ్వర్ రెడ్డి… జొన్న సత్యనారాయణ. తిరుమలేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, కన్జ్యూమర్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ వంటి విభాగాలకు మేనేజర్…

Read More

యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

Read More

మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…

Read More

మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

‘స్ట్రీట్‌ డాక్టర్స్’

సహనం వందే, హైదరాబాద్: ఈమె పేరు మిల్లీ-మే ఆడమ్స్. యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ కు చెందిన మెడికల్ స్టూడెంట్. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బ్రిటన్ లో అందాల పోటీల్లో ఆమె గతంలో విజయం సాధించారు. ఈ యువ డాక్టర్ అందాల పోటీలోనే కాదు… ఒక మెడికోగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్ట్రీట్ డాక్టర్స్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 2008లో వైద్య విద్యార్థులతో ప్రారంభమైన…

Read More

‘హార్వర్డ్’లో కమ్యూనిస్టులకు శిక్షణ

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా అమెరికా విశ్వవిద్యాలయాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి చెందిన ఉన్నత, మధ్య స్థాయి అధికారులకు పాలనా శిక్షణ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ అధ్యయనాలకు వేదికగా నిలిచాయి. అయితే ఈ సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలతో తెరదించనుంది. సీసీపీతో సంబంధాలు ఉన్న విద్యార్థులను అమెరికా విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించకుండా చేసేందుకు ట్రంప్ సర్కారు కొత్త విధానాన్ని అమలు చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కుమార్తె కూడా హార్వర్డ్‌లో రహస్యంగా…

Read More

మెడికోలపై ‘ప్రైవేట్’ల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: వైద్య విద్యార్థులపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు అంతే లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూల్ చేయడం… విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కాజేయడం… ఇదేంటని ప్రశ్నిస్తే ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైద్య విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం, వారిని వేధిస్తున్న తీరుపై తెలంగాణ అడ్మిషన్, ఫీజు…

Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

Read More

కమల్ హాసన్ మాటల తూటాలు

సహనం వందే, చెన్నై: చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా…

Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

వ్యవసాయశాఖలో ‘మావోయిస్టు’ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్: వ్యవసాయ దాని అనుబంధ శాఖలకు చెందిన అనేక కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. తనకు మావోయిస్టు బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని గొప్పగా చెప్పుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రతిపక్ష కేడర్, మీడియా, ప్రైవేట్ వ్యాపారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘నేను గతంలో నక్సలైట్లలో పనిచేశా… నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి… నన్ను విమర్శిస్తే నా బ్యాక్‌గ్రౌండ్‌తో బయటకొస్తా… నాతో పెట్టుకుంటే ఖతమే’ అంటూ ఆయన చేస్తున్న…

Read More

కేసీఆర్ అండతో జీ’ఎస్ఆర్’

సహనం వందే, హైదరాబాద్: గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారు. ఎందుకో ఏమో కానీ గడలను ఒకానొక సందర్భంలో పక్కన పెట్టాలని అనుకున్న కేసీఆర్.‌‌.. కరోనా కాలంలో అందలం ఎక్కించారు. దీంతో గడలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ ఐఏఎస్,…

Read More

తెరపైకి మహేష్ కుమార్ గౌడ్

సహనం వందే, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి…

Read More

కరోనా శవాలపై రూ. 450 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్: ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు. వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?కరోనా సమయంలో…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More

‘గడల’పై ఏసీబీ ఉచ్చు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా విపత్కర సమయంలో, అంతకుముందు కాలంలో ఆయన కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక ఫిర్యాదులతో పాటు ఇటీవల కొందరు ఉద్యోగులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ తన విచారణను…

Read More

జపాన్‌ను అధిగమించిన భారత్

సహనం వందే, ఢిల్లీ: భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక…

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

మావోయిస్టు నేతకు విషమిచ్చి చంపారా?

నంబాల ఎన్‌కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు…

Read More

పవన్ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ గౌరవం, మర్యాదలను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే, వారు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఈ రిటర్న్ గిఫ్ట్‌ను (థియేటర్ల బంద్) స్వీకరిస్తానని ఆయన హెచ్చరించారు. టాలీవుడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సినీ పెద్దలు కనీసం ముఖ్యమంత్రిని కలవలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్…

Read More

దానం ముసుగులో దగా

సహనం వందే, హైదరాబాద్: ‘ఒక బిలియనీర్ దానం చేస్తున్నాడంటే, కమ్యూనిజం మీ బుర్రకెక్కలేదని అర్థం’- కారల్ మార్క్స్ అన్న ఈ మాటలు నేటి బిలియనీర్ల దానాల వెనుక దాగి ఉన్న నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మార్క్స్ దృష్టితో చూస్తే ఈ దానాల వెనుక స్వచ్ఛమైన ఉద్దేశాలు కాకుండా, తమ సామ్రాజ్యాలను కాపాడుకునే కుట్రలు, పన్నులు ఎగ్గొట్టే దిక్కుమాలిన ఎత్తుగడలు…

Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

Read More

జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

సహనం వందే, హైదరాబాద్: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More

నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More

ఆదిలాబాద్‌లో ఆగని జొన్న దందా

సహనం వందే, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జొన్న అక్రమ వ్యాపారం ఆగడం లేదు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా జొన్నలను తరలించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే దందా జోరుగా సాగుతోంది. తాజాగా సిరికొండ మండలంలో 350 క్వింటాళ్ల జొన్నలను అధికారులు సీజ్ చేయగా, ఈ అక్రమ వ్యాపారంలో ఓ నియోజకవర్గ స్థాయి నేత హస్తం ఉన్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ఐచర్ వాహనాన్ని అధికారులు విడుదల చేయడం, కేసులు నమోదు చేసి చేతులు…

Read More

‘నకిలీ’ మాఫియా నీడలో వ్యవసాయశాఖ

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే దళారులు రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు నిషేధిత బీటీ-3 విత్తనాల దందాతో మోసపోతున్నారు. వ్యాపారులు, దళారులు అధిక దిగుబడి, తెగుళ్ల నిరోధకత పేరుతో ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టడంలో విఫలమవుతూ, కొందరు దళారులతో కుమ్మక్కై చూసీ చూడనట్టు…

Read More

ప్రపంచంపైకి పాకిస్తాన్ రేపిస్టులు

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ నేరగాళ్ల అడ్డాగా మారిపోయింది. ఆ దేశ పౌరులు ప్రపంచమంతటా విషబీజాల్లా వ్యాపించి, దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. పాక్ విదేశాంగశాఖ సోమవారం స్వయంగా వెల్లడించిన లెక్కల ప్రకారం… ఏకంగా 23,456 మంది పాక్ ఉన్మాదులు రేప్, హత్య, డ్రగ్స్ సరఫరా, మోసాలు వంటి హేయమైన నేరాలకు పాల్పడి వేర్వేరు దేశాల్లో కటకటాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో 12,156 మంది, యూఏఈలో 5,292 మంది ఖైదీలుగా ఉండటం పాకిస్తాన్ సమాజం నేరకూపంలో ఎంతగా…

Read More

పుచ్చలపల్లి ‘నిరాడంబ’రయ్య

సహనం వందే, హైదరాబాద్: పుచ్చలపల్లి సుందరయ్య… ఒక పేరు కాదు, ఒక తరం ఆదర్శం. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన ఒక శిఖరం. సామాన్యుల కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు. నిరాడంబర జీవనశైలితో గాంధీజీని తలపించిన నాయకుడు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ఆయన జీవితం నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. బాల్యం నుండి స్వాతంత్ర్య పోరాటం వైపు…1913 మే 1న నెల్లూరు జిల్లా అలగనిపాడులో ఒక సంపన్న కుటుంబంలో…

Read More

హిట్లర్ నాజీ’హీరో’యిజం

సహనం వందే, హైదరాబాద్: అడాల్ఫ్ హిట్లర్… ఈ పేరు వింటేనే ప్రపంచ చరిత్రలో రక్తపు అధ్యాయం కళ్లముందు కదలాడుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఈ నియంత విద్వేషపూరిత భావజాలం 80 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా అంతరించలేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొన్ని దేశాల్లో నియో-నాజీలు కేవలం రహస్యంగానే కాకుండా, రాజకీయ పార్టీల రూపంలోనూ ఉనికిని చాటుకుంటున్నాయి. హిట్లర్ భావజాలం పట్ల నేటి తరం ఆకర్షితులవుతున్నారు. అనేక దేశాల్లో హిట్లర్ ఒక హీరోగా యువతను…

Read More

బీఆర్ఎస్‌ చీలికకు హరీష్ బీజాలు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన…

Read More

ప్రజారోగ్యంలో ఖల్ ‘నాయక్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కొందరు అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్‌పై విజిలెన్స్ విచారణలో అక్రమాలు బట్టబయలైనా, ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నోటీసులు ఇచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల కిందట ఆయన్ను తప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం…

Read More

జగదీశ్‌గా జాకీర్‌… సావిత్రిగా సబీరా

సహనం వందే, మథుర: ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉండండి!

సహనం వందే, యూరప్:రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం…

Read More