వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

Read More

బతుకుపై బండ… చావుకు అండ…ఇంగ్లాండ్ లో చట్టం

సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ. ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు..‌.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Read More

అగ్రికార్పొరేషన్లలో అవినీతి క్రీడ-కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక…

Read More

ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…

Read More

బేడీలపై వేడి – గద్వాల్‌లో రైతుల చేతికి సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్:రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. అనేక సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలకే అన్నదాతలకు సంకెళ్లు వేసి వారిని ఈడ్చుకొని వెళ్లడం దాష్టీకానికి పరాకాష్ట. తాజాగా జోగులాంబ గద్వాల్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి, నేరస్తుల్లా కోర్టుకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ… జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును నిలదీశారు. బేడీలు…

Read More

688 ఏళ్ల నాటి లండన్ హత్య కేసు – హత్య నిజా నిజాలు

సహనం వందే, లండన్:సుమారు 688 సంవత్సరాల క్రితం… సరిగ్గా 1337 మే సాయంత్రం.‌.. లండన్‌లోని ఓల్డ్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పూజారి దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి, గొంతు, కడుపులో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ హత్య వెనుక ఎలా ఫిట్జ్‌పేన్ అనే ధనిక కుటుంబానికి చెందిన శక్తివంతమైన మహిళ హస్తం ఉందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో వ్యభిచారం, దోపిడీ,…

Read More

ఆయిల్ ఫెడ్ బోర్డుకు బురిడీ… కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి. అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం….

Read More

ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…

Read More

గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…

Read More

ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ అధికారాలకు కత్తెర

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర పడింది. అంతేకాదు ఆయనకు ఘోర అవమానం జరిగింది. తద్వారా కార్పొరేషన్ జీఎం పోస్టును డమ్మీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకునే దానికంటే సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జనరల్ మేనేజర్ పోస్టు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎండీ తర్వాత కీలకమైన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి…

Read More