బ‌స్తీతో ‘హైడ్రా’ దోస్తీ – హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్ శ్రీకారం

సహనం వందే, హైద‌రాబాద్‌: కూల‌గొట్టుడు కాదు.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన, అంద‌రికీ నివాస యోగ్య‌మైన‌ న‌గ‌ర నిర్మాణ‌మే తమ ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని… న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ ఓ అభ‌యం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించారు. 5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేసి……

Read More

చలనచిత్రాణి సంస్కృతేన- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

సహనం వందే, ఢిల్లీ:యువత సంస్కృతం వైపు ఆకర్షితులవ్వాలంటే దానిని ఆసక్తికరంగా, సరళంగా బోధించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతంలో సినిమాలు (చలనచిత్రాణి సంస్కృతేన) రావాలన్నారు.‌సామాజిక మాధ్యమాలు, ఆధునిక కథనాల ద్వారా సంస్కృతాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన అన్నారు. ఈ భాష ద్వారా భారతీయ సంస్కృతి, జ్ఞానం, విలువలను భవిష్యత్తు తరాలకు అందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మోహన్ భాగవత్ చేసిన…

Read More

‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు…

Read More

నర్మెట్టతో నట్టేట్లోకి ఆయిల్ ఫెడ్ – ఫ్యాక్టరీ ప్రారంభానికి ఆపసోపాలు

సహనం వందే, సిద్దిపేట:ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల పాపాలకు నిదర్శనం నర్మెట్ట ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ద్వారా కొందరు అధికారులు ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరానికి మించి అధిక సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల వందల కోట్ల ప్రజాధనం లూటీ అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫ్యాక్టరీని ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించడంతో శుక్రవారం నుంచి ట్రయల్ రన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అధికారులకు…

Read More

‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More

రద్దయినా మారని బుద్ధి – ‘మహావీర్’ యాజమాన్యం ధిక్కరణ ధోరణి

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని ‘మహావీర్’ మెడికల్ కాలేజీ బాగోతం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేవని ఆ సంవత్సరం బ్యాచ్ లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు కాలేజీల్లో మహావీర్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని బోధనాసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండన్న…

Read More

దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం

వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి….

Read More

చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం – గురుకులలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది చావడమా?

సహనం వందే, హైదరాబాద్:మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? ఏఐ కాలంలోనూ పేద విద్యార్థులను కాపాడుకునే స్థితిలో కూడా లేమా? ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేకమంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 886 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి 48 మంది బహుజన పేద విద్యార్థులు మరణించారంటే… ఇవి సాధారణ మరణాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిన హత్యలుగా…

Read More

డాక్టర్లా? బూచోళ్ళా? – ఆసుపత్రుల్లో శిశువులకు రక్షణ కరువు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది….

Read More

‘సృష్టి’ వైద్యాధికారులపై చర్యలు? – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు…

Read More