రాహుల్ దూరం… రేవంత్ పరేషాన్ – బీసీ ధర్నా వైపు కన్నెత్తి చూడని అధిష్టానం

సహనం వందే, న్యూఢిల్లీ:ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నా కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధిష్టానం నుంచి ఎవరూ రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాహుల్ గాంధీ…

Read More

నేత్రావతి ఒడ్డున శవాల గుట్టలు – ధర్మస్థల నరబలుల మారణకాండ

సహనం వందే, కర్ణాటక:కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం…

Read More

10,000 మందిపై… డెంగీ క్లినికల్ ట్రయల్స్

సహనం వందే, హైదరాబాద్:డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20…

Read More

బెంగాలీ … బంగ్లాదేశ్ భాష’ – బెంగాల్ భగ్గు… సీఎం మమత ఆగ్రహం

సహనం వందే, కోల్‌కతా:ఢిల్లీ పోలీసులు బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొనడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది భారత రాజ్యాంగాన్ని, బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడమేనని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొంటూ ఢిల్లీలోని బంగా భవన్‌కు లోధి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలేం జరిగింది?ఢిల్లీలో ఎలాంటి పత్రాలు…

Read More

2 రూపాయల ఫీజు… 18 లక్షల రోగులు – 50 ఏళ్లుగా అదే ఫీజుతో వైద్య వృత్తికి గౌరవం

సహనం వందే, కన్నూర్:500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన…

Read More

రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం

సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

శుక్రకణాలకు శనిగ్రహం – పురుషుల్లో పునరుత్పత్తి వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ప్రమాదకరంగా క్షీణిస్తోందని అంతర్జాతీయ అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు శుక్రకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కోట్లాది జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి, దీంతో అనేక చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అనేక మోసాలకు పాల్పడుతున్నాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతంతో అసలు సంతాన వైఫల్యానికి కారణాలపై…

Read More

అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

సహనం వందే, హైదరాబాద్:మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన…

Read More

లైవ్ సర్జరీల వ్యాపారానికి చెక్ – ప్రైవేట్ ఆసుపత్రులకు కేంద్రం ముకుతాడు

సహనం వందే, న్యూఢిల్లీ:ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు…

Read More