ఉత్తరాదికి పుత్తడి… దక్షిణాదికి ఇత్తడి

సహనం వందే, హైదరాబాద్:భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…ఉపరాష్ట్రపతి…

Read More

తమిళనాడు వర్సెస్ తెలంగాణ – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ మధ్య వార్

సహనం వందే, హైదరాబాద్:ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు జాతీయ పార్టీల తరఫు కూటములు దక్షిణాదిని రాజకీయ వేదికగా తయారు చేసుకున్నాయి. తమిళనాడు (టి), తెలంగాణ (టి) రాష్ట్రాలను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దక్షిణాది కేంద్రంగా ఉత్తరాది పెద్దలు ఉపరాష్ట్రపతి ఎన్నికల…

Read More

‘ముప్పై’తో పదవికి ముప్పు – నెల రోజులు జైలులో ఉంటే పదవి ఊస్ట్

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఎం, పీఎం తొలగింపు బిల్లు రాజకీయ రగడ రేపుతోంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి తొలగించే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే కుట్రగా విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అధికార దుర్వినియోగం ద్వారా విపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు చేస్తున్న పన్నాగంగా ఈ…

Read More

యుద్ధ విషాదం… అందంతో సందేశం – మిస్ యూనివర్స్ వేదికపై పాలస్తీనా గొంతుక

సహనం వందే, పాలస్తీనా:యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందం నీడలో సందేశం..‌.అందాల పోటీలు…

Read More

అటు ట్రంప్… ఇటు సుప్రీం – బ్యాలెట్ ఎన్నికలకు బలం ఇచ్చిన ఘటనలు

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఆ ఓటును నమోదు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎంలు) ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఈ యంత్రాలు గొడ్డలిపెట్టుగా మారాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలకు బదులు కాగితపు బ్యాలెట్ కు మారుతామని ప్రకటించడం, భారత్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలలోని లోపాలను బయటపెట్టడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అమెరికాలో ఈవీఎంల మీద అనుమానాలు…అమెరికా దేశీయ నిఘా…

Read More

మా’ర్వౌడీ’ బిజినెస్ – ఉత్తరాది నుంచి దక్షిణాదికి మార్వాడీ విస్తరణ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. వారిని తట్టుకోలేక వైశ్య కుటుంబాలు వ్యాపారాలను వదిలేస్తున్నాయి. అంతే కాదు అనేక ఇతర వ్యాపార కుటుంబాలు కూడా మార్వాడీల ముందు చిత్తయిపోతున్నాయి. కిరాణం కొట్టు మొదలు… బంగారం వ్యాపారం వరకు మార్వాడీలదే రాజ్యం నడుస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వారి హవా కొనసాగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసేసుకుంటున్నారు. వారిని తట్టుకొని నిలబడటం సాధ్యం కావడం లేదు. భారత్‌ ధనవంతుల్లో 42 శాతం…

Read More

ఉత్తరాధిపత్యంపై ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు

సహనం వందే, హైదరాబాద్:దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాధిపత్యం ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో…

Read More

బీహార్ లో రాహుల్ ‘వార్’ – నేటి నుంచి ఓటర్ అధికార్ యాత్ర

సహనం వందే, పాట్నా:రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్నికల కమిషన్ కు చుక్కలు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాలో నెలకొన్న తప్పులను ఎండగడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను పరిరక్షించేందుకు ఆయన యుద్ధమే చేస్తున్నారు. వార్-1లో ఢిల్లీ కేంద్రంగా తన ప్రతాపం చూపగా… వార్-2లో క్షేత్రస్థాయిలో బీహార్ కేంద్రంగా యుద్ధం ప్రకటించారు. ఆదివారం నుంచి ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు 1300…

Read More

బెంగాల్ ‘టైగర్’తో ‘అగ్ని’హోత్రి – ‘బెంగాల్ ఫైల్స్’ కు సీఎం మమత ఝలక్

సహనం వందే, కోల్‌కతా:ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కోల్‌కతాలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తన తాజా చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు, థియేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. అగ్నిహోత్రి తన సినిమాలతో అగ్గి రాజేయడం అలవాటే కాబట్టి, బెంగాల్‌లో కూడా అదే జరుగుతుందని ఊహించవచ్చు. వివాదాస్పద సినిమాలు…వివేక్ అగ్నిహోత్రి గతంలో కశ్మీర్…

Read More

ధర్మస్థల సమాధుల్లో ఘోషిస్తున్న ఆత్మలు – 90 శాతం మంది మహిళలు…

సహనం వందే, బెంగళూరు:సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు. ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…తాను, తన బృందం…

Read More