వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More

సీక్రెట్ రొమాన్స్… కార్పొరేట్ క్రాష్ – రహస్య ప్రేమాయణాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్:కార్పొరేట్ ప్రపంచంలో నైతిక ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఒక సీఈవో వ్యక్తిగత వ్యవహారం కారణంగా తన పదవిని కోల్పోయారు. సంస్థాగత నియమాలకు వ్యతిరేకంగా ఒక సబార్డినేట్‌తో రహస్య సంబంధం పెట్టుకోవడమే ఆయన పతనానికి కారణమైంది. ఈ ఘటన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంస్థ నిబంధనలను పాటించాలన్న కఠిన సందేశాన్ని ఇచ్చింది. సీక్రెట్ రొమాన్స్ తో ఏడాదిలోనే వేటు…39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా…

Read More

విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

సహనం వందే, న్యూఢిల్లీ:పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా…

Read More

ముంబై గణపతికి షాక్ – నిమజ్జనం ప్రాథమిక హక్కు కాదు

సహనం వందే, ముంబై:గణపతి విగ్రహాల నిమజ్జనం కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని చారిత్రక పవిత్ర బంగంగా తలావ్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను కూడా బంగంగాలో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ప్రజల హక్కుల కంటే సమాజ శ్రేయస్సు, వారసత్వ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. పర్యావరణానికి పెద్దపీట…బంగంగా తలావ్‌లో గణపతి…

Read More

పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More

మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More