అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత

సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

జగన్ పై ట్రిగ్గర్ – ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ తో షాక్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిని టచ్ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే తుపాకీ గురిపెట్టినట్లు అయింది. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జగన్ పరివారం అందరూ టార్గెట్టే…జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో…

Read More

సీబీఐ వేట… ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీపై వేటు

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సీబీఐ వేట మొదలైంది. కాలేజీల గుర్తింపు, సీట్ల రెన్యువల్ కోసం ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచం ఇచ్చినట్టు అనేక కాలేజీలపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పై వేటు వేసిన అనంతరం ఇప్పుడు కాలేజీ మాఫియాలకు చుక్కలు చూపిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు కావడంతో వైద్య…

Read More

‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More

నారా భువనేశ్వరికి ఒక్కరోజే రూ. 78 కోట్లు లాభం

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఊహించని లాభం చేకూరింది. శుక్రవారం ఒక్కరోజే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ ధర 7 శాతం పైగా పెరగడంతో ఆమె వ్యక్తిగతంగా రూ. 78.80 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటికీ, హెరిటేజ్ స్టాక్ మాత్రం దూసుకుపోవడం విశేషం. హెరిటేజ్‌ ఎండీగా భువనేశ్వరి…నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు…

Read More

సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

సహనం వందే, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు…

Read More

రీజినల్ రింగ్ రైలుతో ట్రాఫిక్ కు చెక్

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణను సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో పాటు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రమంత్రి…

Read More

ఆర్ఎంపీలకు రాజకీయ అండ’దండలు’ – మెడికల్ కౌన్సిల్ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆర్ఎంపీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అనర్హులైన ఆర్ఎంపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా నకిలీ వైద్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కౌన్సిల్ మండిపడింది. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అవకాశవాద రాజకీయాల కోసం అనర్హులైన వైద్యులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టరు అయినందున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి వైద్యుడిగా ఆయన పేరును…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More