ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

సహనం వందే, కోల్ కతా: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి…

Read More

ఉగ్రదాడిపై ముస్లింల ఆగ్రహజ్వాల

సహనం వందే, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ…

Read More

కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

బ్యాన్ చేయాలంటూ డిమాండ్! సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం… ‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య,…

Read More

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

రాహుల్ – హిండెన్‌బర్గ్ ల ఉమ్మడి ఆపరేషన్

సహనం వందే, ఢిల్లీ: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హిండెన్‌బర్గ్…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

సహనం వందే, విశాఖపట్నం: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. మోడీకి పాలించే హక్కు లేదు! కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై…

Read More

ఫిట్జీ కోచింగ్ సంస్థపై ఈడీ దాడులు

సహనం వందే, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు…

Read More

పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…

Read More

దేవుడి చెంత వైద్య ఉద్యోగి దందా

సహనం వందే, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక సబ్ యూనిట్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ఆ ఉద్యోగి, డబ్బు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుండి ప్రమోషన్ పై సబ్ యూనిట్ ఆఫీసర్ అయిన ఇతను, ప్రైవేట్ ఆస్పత్రులు,…

Read More