ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

Read More

రేపు హైదరాబాదుకు ప్రభాకర్ రావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, అది మంజూరైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 9వ తేదీ ఉదయం…

Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

చంద్రబాబు సరికొత్త సంప్రదాయం

సామాన్యులకు సలహాదారు పదవులు సహనం వందే, అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ…

Read More

రోడ్‌షోలు అవసరమా..?

సహనం వందే, ముంబై: బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు….

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీ హింసాత్మక ఆందోళనలు

సహనం వందే, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద గుడిసెలు, పరికరాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం పెరుగుతుందని, నీరు కలుషితమవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారాయణపేట, దిలావర్‌పూర్‌లలోనూ ఇలాంటి ఆందోళనలు జరిగాయి.

Read More

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

సహనం వందే, బెంగళూరు: ‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేశం…ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్…

Read More

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఘోరం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆసుపత్రి యంత్రాంగంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒకరు మృతి…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది….

Read More

రూ.300 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం

జయత్రి గ్రూప్స్‌ పేరుతో మోసం సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో సుమారు రూ.300 కోట్ల స్కామ్‌కు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 జనవరిలో పోలీసులు సంబంధిత డైరెక్టర్ ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యతరగతి కుటుంబాలను, రిటైర్డ్ ఉద్యోగులను ఆర్థికంగా నిలువునా దోచుకున్న సంఘటనగా నిలిచింది. ప్రీ-లాంచ్…

Read More

వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై…

Read More