రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

‘స్తోమత లేకుంటే సినిమాకు రాకండి’ – హైకోర్టులో ‘ఓజీ’ తరపు లాయర్ వింత వాదన

సహనం వందే, హైదరాబాద్:‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు…

Read More

సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

సహనం వందే, హైదరాబాద్:చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా…

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

భూమి కోసం బెజవాడ గర్జన – అన్నదాత ఆగ్రహం… ప్రభుత్వ దౌర్జన్యం

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని నిరసిస్తూ బెజవాడ వీధుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాలు పోటెత్తాయి. తమ జీవనాధారాన్ని బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఒక్కతాటిపైకి వచ్చి నినదించారు. భూమిని అమ్మేవారుగా కాకుండా, భూమిని నమ్ముకున్న రైతులుగా తమ హక్కును నిలబెట్టుకోవడానికి ఈ గర్జన ప్రారంభమైంది. ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో మార్మోగిన నినాదాలు, రాష్ట్రంలో నెలకొన్న…

Read More

డొనేషన్ల అడ్మిషన్… నోటీసుల పరేషాన్ – ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యంగా దందా

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ సీటు అంటే మెరిట్, ప్రవేశ పరీక్షల ర్యాంకుల మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అగ్రశ్రేణి కాలేజీలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశాయి. ఈ అక్రమాలకు పరాకాష్ఠగా ఇటీవల జరిగిన అడ్డగోలు యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు నిలిచాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి విద్యార్థుల మెరిట్‌ను పక్కకు పెట్టాయి. లక్షలకు లక్షలు డొనేషన్ల…

Read More

‘ఓజీ’పై అంబటి క్రేజీ – హిట్ అవుతుందన్న అంబటి రాంబాబు

సహనం వందే, విజయవాడ:ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ సినిమాకి హిట్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు భిన్నమైన వైఖరులు వైసీపీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క సోషల్ మీడియాలో ఓజీ సినిమాపై పార్టీ ట్రోల్స్, మీమ్స్‌తో విరుచుకుపడుతుంటే… అంబటి మాత్రం…

Read More

రోడ్డుపై ‘వందే భారత్’ – హైదరాబాదు నుంచి విశాఖకు 8 గంటలే

సహనం వందే, హైదరాబాద్:వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.‌ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి…

Read More

అప్పలనాయుడు… గిరిజన గుండెచప్పుడు – ఏజెన్సీలో విజయనగరం ఎంపీ పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పలనాయుడు… మాస్ లీడర్రాజకీయ హోదా, అధికారిక…

Read More

మోడీకి ఎంపీ కలిశెట్టి బర్త్ డే గిఫ్ట్ – ప్రధాని జన్మదినం సందర్భంగా పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:ప్రధాని మోడీకి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అదేదో వస్తువు అనుకునేరు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రత్యేకంగా పర్యటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ అప్పలనాయుడు ఒక గిరిజన గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు.ఆ తర్వాత గురువారం ఉదయం లుంగీ మీద పొలాల గట్లపై తిరుగుతూ రైతులతో సంభాషించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత…

Read More