హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…

Read More

ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆదేశాలు పట్టవా? ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఆదేశాలనే తుంగలో తొక్కుతున్నారు. వారం క్రితమే ఆయన ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More

వ్యవసాయ వర్సిటీలో అవినీతి పంట – ఆచార్య ఎన్‌జీ రంగా వీసీపై ఫిర్యాదులు

సహనం వందే, గుంటూరు:ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అవినీతికి నిలయంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓ ప్రొఫెసర్‌ స్వయంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వర్సిటీలో జరుగుతున్న చీకటి కార్యకలాపాలకు అద్దం పడుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాలక మండలిని విస్మరించి కోరం లేకుండానే రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

రైల్వే సమస్యలపై ఎంపీ గళం -ప్రజల గొంతుకైన ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, భువనేశ్వర్:ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో…

Read More

ముఖ్యమంత్రి వినాయక్’రెడ్డి’ – రేవంత్ రెడ్డి వేషధారణతో గణపతి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆఘాపురాలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో వినాయకుడి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్యాంటు, షర్టు, బూట్లు, మెడలో కండువా ధరించి ఉన్న గణనాథుని రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయ నేతపై అభిమానం ఇక్కడి నిర్వాహకులను ఈ విధమైన…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More