ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…

Read More

ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక,…

Read More

విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి – టీడబ్ల్యూజేఎఫ్

కొత్త స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సిహెచ్. ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యతో పాటు ఇతర ప్రతినిధులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్లు,…

Read More

క్యాబినెట్ లో మెడికోలపై నివేదిక – మంత్రి దామోదర వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్…

Read More

‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి…

Read More

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో, దీనిని అడ్డుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని…

Read More

గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…

Read More

మెడికోలను బెదిరిస్తున్న యాజమాన్యాలు…

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేస్తున్న మెడికోలను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఇలా ధర్నాలు చేస్తే మీ డాక్టర్ డిగ్రీ ఎలా వస్తుందో చూడండని వార్నింగ్ ఇస్తున్నాయి. సోమవారం వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు స్టైఫెండ్ ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ యాజమాన్యం చెందిన ప్రతినిధి ఒకరు వారి…

Read More