ఐయ్యా’ఎస్’… నీ కాల్మొక్తా!

సహనం వందే, హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి, తమ గౌరవాన్ని తామే పణంగా పెడుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సర్వీసులు ప్రజాసేవ కోసం ఉద్దేశించినప్పటికీ, కొందరు అధికారులు మంచి పదవులు, అక్రమ లాభాల కోసం రాజకీయ నాయకులకు దాస్యం చేస్తూ, బ్యూరోక్రసీకి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా తెలంగాణలోని అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన ఈ అనైతిక…

Read More

తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ సహనం వందే, మైసూర్: ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక…

Read More

నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More

ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

సహనం వందే, హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా…

Read More

గుల్జార్ ఘటన…వ్యవస్థాగత ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది చనిపోతే, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. మరి హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగి 17 మంది చనిపోతే ఎవరిపై మనం యుద్ధం చేయాలి? నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు? అధికారులు కాదా? ఇది అంతర్గత వ్యవస్థాగత ఉగ్రవాదం కాదా? ఈ ఉగ్రవాదులపై చర్యలు ఉండవా? ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా? ఇది కేవలం దుర్ఘటన కాదు….

Read More

పుచ్చలపల్లి ‘నిరాడంబ’రయ్య

సహనం వందే, హైదరాబాద్: పుచ్చలపల్లి సుందరయ్య… ఒక పేరు కాదు, ఒక తరం ఆదర్శం. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన ఒక శిఖరం. సామాన్యుల కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు. నిరాడంబర జీవనశైలితో గాంధీజీని తలపించిన నాయకుడు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ఆయన జీవితం నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. బాల్యం నుండి స్వాతంత్ర్య పోరాటం వైపు…1913 మే 1న నెల్లూరు జిల్లా అలగనిపాడులో ఒక సంపన్న కుటుంబంలో…

Read More

ఫిలింసిటీలో ‘మిస్ వరల్డ్’ రచ్చ

సమన్వయ లోపం.. కార్యక్రమం ఆలస్యం సహనం వందే, హైదరాబాద్: ఫిలిం సిటీలో అందాల బామల పర్యటన కార్యక్రమం ఆలస్యంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుందరీమణుల ప్రోగ్రాంలు సమయనుకూలంగా జరుగుతుండగా.. ఫిలిం సిటీ శనివారం నాటి కార్యక్రమం మాత్రం ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి ఫిలిం సిటీకి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే అందాల తారాలంతా చేరుకున్నప్పటికి అక్కడి సిబ్బంది, అధికారులు, పోలీసుల మధ్యన సమన్వయ లోపంతో కార్యక్రమ నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకుందని…

Read More