మైనారిటీ గురుకులాల్లో జీతాల గోస

సహనం వందే, ఖమ్మం:తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీ వేజెస్ ఉద్యోగుల బతుకులు మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారాయి. ప్రజాపాలనలో జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు షేక్ మక్బూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వం గురుకుల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More

న్యూ యా’ఫీల్’ – నేటి రాత్రి 10.30 గంటలకు ఐఫోన్ 17 ఆవిష్కరణ

సహనం వందే, అమెరికా:టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఈవెంట్ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాపిల్ ఈసారి టెక్ ప్రపంచంలో ఏ సంచలనాలు సృష్టిస్తుందో అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఐఫోన్ 17 సిరీస్… సన్నగా,…

Read More

నేపాల్‌లో ‘జెన్-జెడ్’ విప్లవం – సోషల్ మీడియా నిషేధంపై కన్నెర్ర

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా…

Read More

విజయనగరం ఎంపీకి విశిష్ట గౌరవం – మహారాష్ట్ర తెలుగు సంఘం సభకు కలిశెట్టి

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో మహారాష్ట్ర తెలుగు మేళవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలోని థానే వెస్ట్ వసంత విహారలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కోటికి పైగా సభ్యత్వం ఉన్న ఈ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా…

Read More

సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

గురువుల పాఠమే ‘విజయ’ పీఠం – మాస్టార్లకు ఎంపీ అప్పలనాయుడు సన్మానం

సహనం వందే, రణస్థలం:విజయనగరం ఎంపీగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అప్పలనాయుడు తన గురువులను ఏమాత్రం మర్చిపోలేదు. రోజువారీ బిజీగా ఉన్నప్పటికీ తనకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను గౌరవించడం మానలేదు.‌ గురువులు నేర్పిన పాఠమే తను ‘విజయ’నగరం ఎంపీ స్థాయికి ఎదగడానికి తోడ్పడిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురు పూజోత్సవం రోజున శుక్రవారం తనకు తొలి అక్షరాలు దిద్దిన గురువులను మర్చిపోని నిరాడంబరతను ప్రదర్శించారు. రణస్థలం మండలంలో ఉన్న తన ఆది గురువులు మేడూరి…

Read More

విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

సహనం వందే, న్యూఢిల్లీ:పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా…

Read More

ముంబై గణపతికి షాక్ – నిమజ్జనం ప్రాథమిక హక్కు కాదు

సహనం వందే, ముంబై:గణపతి విగ్రహాల నిమజ్జనం కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని చారిత్రక పవిత్ర బంగంగా తలావ్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను కూడా బంగంగాలో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ప్రజల హక్కుల కంటే సమాజ శ్రేయస్సు, వారసత్వ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. పర్యావరణానికి పెద్దపీట…బంగంగా తలావ్‌లో గణపతి…

Read More

పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More