థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More

పవన్ తో పెట్టుకుంటే పతనమే

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని…

Read More

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి…!

సహనం వందే, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గతేడాది జూన్‌ 3వ తేదీన రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించగా… ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది. కానీ ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో ముందస్తుగా రుతుపవనాల రాక రైతాంగాన్ని ఉత్సాహంలో నింపింది. వారం రోజులుగా కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులంతా దుక్కులు దున్ని సాగుపనులకు సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు ముందుగానే రావడంతో…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More

విజ‌య‌సాయిరెడ్డిపై వైసీపీ సంచలన ట్వీట్‌

సహనం వందే, అమరావతి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. ‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు… 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

Read More

మిస్ వరల్డ్ తారలను ఎవరు వేధించారు?

ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబిత డిమాండ్ సహనం వందే, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ కామెంట్స్‌పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదివారం స్పందించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ పరువును ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మ్యాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రపంచ దేశాల యువతులను ఎవరు వేధించారో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరో తేల్చాలని… మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More

జపాన్‌ను అధిగమించిన భారత్

సహనం వందే, ఢిల్లీ: భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక…

Read More

సినిమా థియేటర్ల వివాదంపై అల్లు…

సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.

Read More

మావోయిస్టు నేతకు విషమిచ్చి చంపారా?

నంబాల ఎన్‌కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు…

Read More