రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ. 1,58,000 కోట్ల అప్పు చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 4,17,000 కోట్ల అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ప్రజల్లో కేసీఆర్ ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల…

Read More

తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్ష్ చేతుల మీదుగా ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా తన తాతతోపాటు భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డించి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రణాళిక – మంత్రి దామోదర రాజనర్సింహ

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, వైద్య సిబ్బంది నియామకం, డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై గురువారం మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్… ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. “అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా…

Read More

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్

– యాదగిరిగుట్ట ఆలయం అనుభూతి ఇచ్చిందన్న 2024 ప్రపంచ సుందరి – మే నెలలో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అద్వితీయ ఆతిథ్యం! సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గురువారం ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్…

Read More

ఉస్మానియాలో ఆంక్షలు ఎత్తివేయాలి – సీపీఎం నాయకులు వీరయ్య డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య ప్రకటన విడుదల చేశారు. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. “వైస్ ఛాన్సలర్ చేత ఇలాంటి…

Read More

మంత్రి దామోదరకు నాయకుల కృతజ్ఞతలు

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య మరియు ఇతర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కృషిని కొనియాడారు. “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేర్చడంలో మంత్రి…

Read More

తెలంగాణ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం – జర్మనీ సహకారంతో ఆధునిక సాగుకు శ్రీకారం!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జర్మనీ ప్రతినిధుల బృందంతో గురువారం సచివాలయంలో సమావేశమై, నూతన సాంకేతికతల వినియోగం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తాం” అని అన్నారు. సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్ట్: సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్మనీ సంస్థ…

Read More

కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ

సహనం వందే, సూర్యాపేట: “నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు…

Read More

దశాబ్దాల నిరీక్షణకు తెర – 57,924 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో రేవంత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు!

సహనం వందే, హైదరాబాద్: “కొలువుల పండుగ” సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మీ కల నేడు నిజమైంది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి తావులేదు… గత…

Read More

కాంగ్రెస్ బడ్జెట్ ‘బడా జూట్’.. అబద్ధాల పుట్ట: హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా ఉందని, పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ను ‘బడా జూట్’ బడ్జెట్‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయటా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు….

Read More