
భద్రాచలం శ్రీరామనవమికి సీఎంకు ఆహ్వానం
సహనం వందే, హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కలిసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్…