జస్టిస్ వర్మ తీర్పులపై అనుమానాలు

– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్ – కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే సహనం వందే, ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల…

Read More

యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

   మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య – సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు… – 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్‌లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు…

Read More

కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే…

Read More

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు

   పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికం   – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60 కాగా, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. తమిళనాడులో పెట్రోల్ ధర రూ. 100.86, డీజిల్ ధర రూ. 92.39గా ఉంది. కర్ణాటకలో పెట్రోల్…

Read More

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన…

Read More

రైతులకు సాయం చేయండి

– ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి సహనం వందే, అమరావతి: ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి…..

Read More

అవయవ మార్పిడిలో కొత్త శకం!

మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం అమలు – బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు… – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అక్రమాలకు చెక్ సహనం వందే, హైదరాబాద్: 1994లో ఆమోదించిన మానవ అవయవాల మార్పిడి చట్టానికి 2011లో సవరణలు చేసి, దాన్ని మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (తోట)గా రూపొందించారు. ఈ చట్టం అవయవాలతో పాటు కణజాలాల మార్పిడిని చట్టబద్ధం చేసింది. 2014లో కేంద్రం విడుదల చేసిన నిబంధనలతో దేశంలో 24 రాష్ట్రాలు…

Read More

సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

వడగళ్ల వర్షంతో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి సహనం వందే, హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల తెలంగాణలో 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో రుణమాఫీ చేశాం… ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ….

Read More