సినీనటి దియామీర్జాపై యాక్షన్

సహనం వందే, హైదరాబాద్:కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ వివాదంలో సినీ నటి దియా మీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐతో రచ్చ రచ్చ…హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు…

Read More

ప్రయాగ్‌రాజ్‌లో దర్గా ఎక్కి జైశ్రీరామ్ నినాదాలు

సహనం వందే, ప్రయాగ్‌రాజ్:ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హిందుత్వ సంస్థల సభ్యులు సికంద్రా ప్రాంతంలోని సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ మియాన్ దర్గాపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో హిందుత్వ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకుని దర్గాపైకి ఎక్కుతూ జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక…

Read More

బండి సంజయ్ ఖబర్దార్!

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు…

Read More

మజ్జిగ తాగండి… ఆశీర్వదించండి

సహనం వందే, రాజేంద్రనగర్:మజ్జిగ తాగండి… తనను ఆశీర్వదించండి అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల పిలుపునిచ్చారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దురెడ్డి మాట్లాడుతూ… వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

Read More

భార్యకు తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి గెంటేసి

సహనం వందే, రాజేంద్రనగర్:విడాకులు ఇస్తున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పాడు. అనంతరం భార్యపిల్లలను చితకబాదాడు. ఆపై వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్ వహీద్ కింగ్స్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వీరు గొడవ…

Read More

కంచ గచ్చిబౌలి భూములపై ‘ఏఐ’ రచ్చ

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఏఐని ఉపయోగించి సృష్టించిన తప్పుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవాలు వెల్లడించే లోపే అబద్ధాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అభిప్రాయపడుతుంది. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా ఆడియోలు,…

Read More

పిఠాపురంలో ఫైట్

సహనం వందే, పిఠాపురం:జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇటీవల పిఠాపురం పర్యటనలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కుమారపురంలో జరిగిన ఈ సంఘటనలో వర్మ వర్గీయులు నాగబాబును చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్మల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణలను మరోసారి ఉద్ధృతం చేసింది. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

Read More

విత్తనం రైతు హక్కు

   ప్రభుత్వానికి రైతు కమిషన్ స్పష్టీకరణ – ములుగు ఘటన నేపథ్యంలో నివేదిక – వ్యవసాయశాఖను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సూచన సహనం వందే, హైదరాబాద్: విత్తనం రైతు హక్కు అని, దానిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రూపంలో రైతు కమిషన్ నివేదికను అందించింది. విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు…

Read More

హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ పంజా

   వేల కోళ్లు మృతి… ప్రజల్లో భయాందోళనలు – నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతితో అప్రమత్తం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫార్మ్‌లో వేల కోళ్లు చనిపోవడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా, బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కోడిగుడ్లు, చికెన్ విక్రయాలను నిషేధించారు. ఈ విషయం తెలియడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళనలో ఉండగా,…

Read More

ఏడు లక్షలు దాటిన యువ వికాసం దరఖాస్తులు

బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు సహనం వందే, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించాలనుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు…

Read More