అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

గ్రూప్‌–1లో…దగాపడ్డ తెలుగు అభ్యర్థి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్‌–1 ఉద్యోగాలకు…

Read More

భాస్కర మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌ల వేదన

సహనం వందే, హైదరాబాద్: మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్‌గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్‌ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు…

Read More

సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More

సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై ఈడీ కొరడా

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…

Read More

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…

Read More

పదేళ్ల చిన్నారి మద్యంపై ఉద్యమం

సహనం వందే, ఆగ్రా: పదేళ్ల చిన్నారి ……. కానీ మనసు మాత్రం ఉక్కు సంకల్పం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పదేళ్ల వంశిక సికర్వార్ అనే బాలిక చేసిన ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గ్రామంలోని మహిళలకు నిత్యం ఇబ్బంది కలిగిస్తున్న ఒక మద్యం దుకాణాన్ని తరలించేలా చేసి… నిజంగానే చిన్నారి పోరాట యోధురాలు అనిపించుకుంది. తాగొచ్చి గొడవ చేసేవారు..‌.కోలారా కలాన్ అనే చిన్న గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండేది. దాని వల్ల ఆ ఊరి మహిళలు…

Read More

జపాన్‌లో తెలంగాణ జాతర!

పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం! సహనం వందే, జపాన్ వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్…

Read More

ఐఐటీపై ఆరు’గురి’

సహనం వందే, కోట: ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్‌ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్‌లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్…

Read More

భార్య చేతిలో మాజీ డీజీపీ హత్య

సహనం వందే, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. “నేనే రాక్షసుడిని చంపాను!”పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి…

Read More