ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…

Read More

ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినం – మంత్రివర్గం కీలక నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన…

Read More

చంద్రబాబుతో రేవంత్ రె’డ్ఢీ’ – వరద జలాలపై ఆంధ్రప్రదేశ్ వాదన

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరద…

Read More

యూరియా సకాలంలో సరఫరా చేయాలి – నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర రైతుల అవసరాల కోసం యూరియా సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను వివరించారు. రైతుల ఇబ్బందులపై దృష్టి…వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర…

Read More

రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ – రాష్ట్రంలో అంతర్జాతీయ స్టూడియో

సహనం వందే, ఢిల్లీ:ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణానికి కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సదుపాయాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. నైపుణ్య…

Read More

గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం…

Read More

తెలంగాణలో జపానీస్ భాష

సహనం వందే, హైదరాబాద్: ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు…

Read More