ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…

Read More

ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…

Read More

సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

నకిలీ ఎండీల బురిడీ-ఎంబీబీఎస్ కు సమానంగా విదేశీ ఎండీ కోర్స్

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నారు. అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. అంటే అక్కడ ఎండీ చేసినవాళ్లు ఇక్కడి ఎంబీబీఎస్ తో సమానం. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు అలా చదివిన వారు తప్పుడు డిగ్రీతో దాదాపు 150 ఆసుపత్రులు నడిపిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి….

Read More

రాముడిపై భక్తి… గోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ జీవితం

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్‌ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా…

Read More

హిందీకి ‘మహా’దెబ్బ – త్రిభాషా విధానంపై వెనక్కు తగ్గిన మహారాష్ట్ర

సహనం వందే, ముంబై:బాలీవుడ్ కు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో హిందీ భాషకు ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానంపై ఇంతకాలం కొనసాగిన వివాదాలకు తెరదించుతూ వివాదాస్పదమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More

నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More