నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

దళితులపై దాష్టీకం హక్కుల ఉల్లంఘనే!

సహనం వందే, ఢిల్లీ: తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More

విజ‌య‌సాయిరెడ్డిపై వైసీపీ సంచలన ట్వీట్‌

సహనం వందే, అమరావతి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. ‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు… 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

మావోయిస్టు నేతకు విషమిచ్చి చంపారా?

నంబాల ఎన్‌కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు…

Read More

జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

సహనం వందే, హైదరాబాద్: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,…

Read More

తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ సహనం వందే, మైసూర్: ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక…

Read More