నర్మెట్ట వెనుక త్రిబుల్ ‘ఎస్’ల కుట్ర – సురేందర్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డీల స్కెచ్

సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా?…

Read More

ఆయిల్‌ఫెడ్ ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్ కు బీటలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణకు చెందిన ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్‌ను కాపాడుకునే పేరుతో ఆయిల్‌ఫెడ్ ఓ ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ‘విజయ హైదరాబాద్’ నూనెలను విక్రయిస్తున్న టీఎస్‌-ఆయిల్‌ఫెడ్… కేవలం బ్రాండ్ పేరును, తమ గోదామును అత్యంత తక్కువ అద్దెకు ఇచ్చి చేతులు దులుపుకుందనే విమర్శలు వచ్చాయి. ప్రైవేటుకు అపరిమిత లబ్ధి…ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ గా తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కీలకమైన వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో విలువైన విజయ హైదరాబాద్…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశునికి దెబ్బ మీద దెబ్బ

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై…

Read More

ఆయిల్ పామ్ కంపెనీలకు విత్తన ‘చుట్టం’

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంటను ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తున్నా… ఆ మేరకు రైతులకు భరోసా కల్పించే విషయంలో ఆయిల్ ఫెడ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఇతర పంటలకు బదులు లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని చెబుతూనే… మరోవైపు ఆ పంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ పంటకు నష్టం జరిగితే పరిహారం ఉంటుందా? అన్న రైతుల…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు.. ఫైనాన్స్ విభాగం తొలగింపు

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ లో ప్రక్షాళన పర్వం ఊపందుకుంది. ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వరుస కథనాలతో ఈ కార్పొరేషన్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల అక్రమాలు, నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణ వివాదం… కొందరు అధికారులు కీలకమైన విభాగాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడుతుండటం… ఇలాంటి అన్ని విషయాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ కొత్త ఎండీ శంకరయ్య…

Read More

ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కేంద్ర బృందం

సహనం వందే, అశ్వారావుపేట: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు గురువారం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటించారు. నర్సరీలు, జన్యు లోపం ఉన్న మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు సహా ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే అశ్వారావుపేట ఆయిల్…

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More