‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

సహనం వందే, విశాఖపట్నం: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. మోడీకి పాలించే హక్కు లేదు! కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై…

Read More

ఫిట్జీ కోచింగ్ సంస్థపై ఈడీ దాడులు

సహనం వందే, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు…

Read More

పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…

Read More

భారత్ కూ కావాలి…ఘోస్ట్ ఆర్మీ ‘మొసాద్’

సహనం వందే, హైదరాబాద్: ఇజ్రాయెల్… మధ్యప్రాచ్యంలో నిత్యం అగ్నిగుండంలా ఉండే ఒక చిన్న దేశం. చుట్టూ శత్రుదేశాలు… నిత్యం ఉగ్రవాద దాడుల ముప్పు. కానీ ఇజ్రాయెల్ ధైర్యంగా నిలబడుతోంది. దానికి ఒక ముఖ్య కారణం దాని శక్తివంతమైన గూఢచర్య సంస్థ మొసాద్. మొసాద్ అంటే హెబ్రీ భాషలో “నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”. ఇది ఇజ్రాయెల్ కు కళ్లు, చెవులు మాత్రమే కాదు… దాని రహస్య ఆయుధం కూడా. మొసాద్ తన దేశ భద్రత కోసం ఎంతటి సాహసానికైనా…

Read More

దేవుడి చెంత వైద్య ఉద్యోగి దందా

సహనం వందే, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక సబ్ యూనిట్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ఆ ఉద్యోగి, డబ్బు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుండి ప్రమోషన్ పై సబ్ యూనిట్ ఆఫీసర్ అయిన ఇతను, ప్రైవేట్ ఆస్పత్రులు,…

Read More

మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More

గ్రూప్‌–1లో…దగాపడ్డ తెలుగు అభ్యర్థి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్‌–1 ఉద్యోగాలకు…

Read More

హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

సహనం వందే, జమ్ము కాశ్మీర్‌: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన…

Read More