పేదల ఇళ్లు కూల్చొద్దు!

సహనం వందే వరంగల్: ‘హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. తెలంగాణను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే, ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతార’ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత దుస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు…

Read More

వైరస్‌తో వేగంగా వృద్ధాప్యం

సహనం వందే, బల్గేరియా: వేగంగా వృద్ధాప్యం చేసే వైరస్‌పై ప్రఖ్యాత బల్గేరియన్ జోతిష్యురాలు బాబా వాంగా మరోసారి ప్రపంచాన్ని కలవరపెట్టే జోస్యం చెప్పారు. ఆమె ఊహించిన ప్రకారం, 2088 సంవత్సరంలో ఒక భయంకరమైన వైరస్ మానవులను చుట్టుముట్టనుందట! ఈ రహస్యమైన వైరస్ మనుషులను చాలా వేగంగా వృద్ధాప్యం చేసేస్తుందని, వారి ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ జోస్యం ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సింథటిక్ బయాలజీ అభివృద్ధి,…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు

సహనం వందే హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల పదవి విరమణ చేస్తున్నడంతో రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించింది. మరోవైపు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట…

Read More

తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా…

Read More

నెలకు 60 కోట్ల సంపాదన లక్ష్యం!

సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలతో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగిందని…

Read More

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More

తెలంగాణ అభివృద్ధికి సహకారం కావాలి

భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శనివారం భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,…

Read More

‘లెఫ్ట్’కు ట్రంప్ బూస్ట్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న అనూహ్య నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన విధానాలు… వివిధ దేశాలపై సుంకాల విధింపుతో బలహీనపడిన లెఫ్ట్ రాజకీయ పార్టీలకు కొత్త ఊపిరినిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల్లో వామపక్ష పార్టీలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సర్వేలు కూడా ఈ దేశాల్లో లెఫ్ట్ పార్టీల ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడిస్తున్నాయని ప్రముఖ అమెరికా పత్రిక ‘వాల్ స్ట్రీట్…

Read More

‘అల్లాహ్’ సందేశంతో సైబర్ దాడి

సహనం వందే, ఢిల్లీ: ‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా…

Read More