రీ-రిలీజులే దిక్కా?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పుడు కొత్త కథలు, సృజనాత్మకతతో ప్రేక్షకులను అలరించేది. కానీ ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు మంచి సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. థియేటర్ల సంఖ్య, స్క్రీన్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, కొత్త సినిమాల కొరతతో బోరు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పాత సినిమాలతో పాటు, సీనియర్ ఎన్టీఆర్ లాంటి లెజెండ్‌ల చిత్రాలైన మాయాబజార్ వంటివి…

Read More

‘సుప్రీం’పై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

ఆదిలాబాద్‌లో ఆగని జొన్న దందా

సహనం వందే, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జొన్న అక్రమ వ్యాపారం ఆగడం లేదు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా జొన్నలను తరలించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే దందా జోరుగా సాగుతోంది. తాజాగా సిరికొండ మండలంలో 350 క్వింటాళ్ల జొన్నలను అధికారులు సీజ్ చేయగా, ఈ అక్రమ వ్యాపారంలో ఓ నియోజకవర్గ స్థాయి నేత హస్తం ఉన్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ఐచర్ వాహనాన్ని అధికారులు విడుదల చేయడం, కేసులు నమోదు చేసి చేతులు…

Read More

ఒకే వ్యూహం… ఒకే గేమ్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో…

Read More

ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

‘నకిలీ’ మాఫియా నీడలో వ్యవసాయశాఖ

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే దళారులు రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు నిషేధిత బీటీ-3 విత్తనాల దందాతో మోసపోతున్నారు. వ్యాపారులు, దళారులు అధిక దిగుబడి, తెగుళ్ల నిరోధకత పేరుతో ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టడంలో విఫలమవుతూ, కొందరు దళారులతో కుమ్మక్కై చూసీ చూడనట్టు…

Read More

మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

సహనం వందే, హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా…

Read More