యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

Read More

మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…

Read More

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

సహనం వందే, బెంగళూరు: ‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేశం…ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్…

Read More

మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక…

Read More

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఘోరం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆసుపత్రి యంత్రాంగంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒకరు మృతి…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది….

Read More

రూ.300 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం

జయత్రి గ్రూప్స్‌ పేరుతో మోసం సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో సుమారు రూ.300 కోట్ల స్కామ్‌కు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 జనవరిలో పోలీసులు సంబంధిత డైరెక్టర్ ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యతరగతి కుటుంబాలను, రిటైర్డ్ ఉద్యోగులను ఆర్థికంగా నిలువునా దోచుకున్న సంఘటనగా నిలిచింది. ప్రీ-లాంచ్…

Read More

వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై…

Read More

మార్క్ ఫెడ్ కు రూ. 93 కోట్ల నష్టం

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ అధికారుల నిర్వాకం వల్ల ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. కొందరు అధికారులు వ్యాపారులతో సిండికేట్ కావడం వల్లనే నష్టాలు మూటగట్టుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు తాజాగా జొన్నల విక్రయంలో జరిగిన లావాదేవీలే నిదర్శనం. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను వ్యాపారులకు అమ్మడం ద్వారా మార్క్ ఫెడ్ కు ఏకంగా రూ. 93 కోట్లు నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది జొన్నల మద్దతు…

Read More

తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More