Justice Kurian Committee Report on Delimitation

ఢిల్లీ పెత్తనం… దక్షిణాదిపై ఉక్కుపాదం – జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఆవేదన

సహనం వందే, తమిళనాడు: భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధిని సాధించినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించడం ద్వారా శిక్షించడం ఏమాత్రం…

Read More
Thorium at Southern States

దక్షిణాది సూర్యుడితో వెయ్యేళ్ల వెలుగు – తమిళనాడు, కేరళలో థోరియం నిల్వలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ యురేనియం కోసం ఆరాటపడతాం కానీ మన కాళ్ళ కింద ఉన్న మట్టిలోనే మహా నిధి దాగి ఉంది. కేరళ, తమిళనాడు తీరాల్లో అలలు తాకి వెళ్లే ఆ ఇసుక రేణువులే రేపటి భారత అగ్రరాజ్య స్వప్నానికి ప్రాణం పోయనున్నాయి. అగ్రరాజ్యాల ఆంక్షలను ధిక్కరిస్తూ మన శాస్త్రవేత్తలు గీసిన మూడు అంచెల వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని దద్దరిల్లేలా…

Read More
Tamilnadu Judgement

దద్దరిల్లిన తమిళనాడు కోర్టు జడ్జిమెంట్ – ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

సహనం వందే, తమిళనాడు: జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. కానీ కొందరి ప్రయాణాన్ని అధికార గర్వం అర్ధాంతరంగా ముగించేస్తుంది. రక్షించాల్సిన చేతులే రాక్షసంగా మారినప్పుడు చట్టం తన విశ్వరూపం చూపిస్తుంది. లాఠీకి రక్తం అంటుకున్నప్పుడు న్యాయం నిశ్శబ్దంగా ఉండదు. సాతంకుళం వీధుల్లో ఆ రాత్రి మరణం అధికార అహంకారం రూపంలో వచ్చింది. న్యాయం ఆలస్యమైనా అది విధించిన శిక్ష ఇప్పుడు చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది. ప్రాణం తీసిన శాడిజంతమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతంకుళం పోలీస్…

Read More
Stalin

హిందీపై ఎదురు తిరిగిన ద్రవిడ గడ్డ – మూడు భాషలపై స్టాలిన్ నిప్పులు

సహనం వందే, తమిళనాడు: దక్షిణాది గడ్డపై మళ్ళీ భాషా యుద్ధం మొదలైంది. కేంద్రం తెచ్చిన విద్యా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిప్పులు చెరిగారు. హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. నిధుల ఆంక్షలతో రాష్ట్రాన్ని లొంగదీసుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఈ గొడవ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సెగలు పుట్టిస్తోంది. తమిళనాడుకు నిధుల వేటుతమిళనాడుకు రావాల్సిన విద్యా నిధులను కేంద్రం కావాలనే తొక్కి పెడుతోంది. మూడు భాషల విధానాన్ని అమలు…

Read More
Vijay Politics

తమిళ’నోట’ విజయ్ మాట – ద్రవిడ రాజ్యంలో దళపతి గర్జన

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయ యవనికపై యువ దళపతి అడుగుపెట్టారు. సినీ గ్లామర్ అండతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగంతో గెలుపుపై కన్నేశారు. పాత పార్టీలకు దీటుగా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఈ సినీ హీరో సృష్టించబోయే సంచలనంపై అందరి చూపు నిలిచింది. సినిమా వర్సెస్ రాజకీయాలుతమిళనాడులో సినిమాకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ఆ బాటలోనే విజయ్ తన…

Read More
Hindi Language issue at Thiruchurapalli

హిందీ రాతపై రగిలిన జ్వాల – తిరుచి రైల్వే కార్యాలయం వద్ద తమిళ గర్జన

సహనం వందే, తిరుచిరాపల్లి: భాషా ప్రాతిపదికన దేశంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హిందీ పేరు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాల్ చేసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది కేవలం ఒక బోర్డు తొలగింపు మాత్రమే కాదు. ద్వారం వద్ద వివాదంతిరుచిరాపల్లి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద కొత్తగా…

Read More
Madras High Court

న్యాయపీఠం ‘యాభై లక్షల’ బేరం – మద్రాస్ హైకోర్టు జడ్జి పేరుతో భారీ లంచం

సహనం వందే, తమిళనాడు: భారత న్యాయవ్యవస్థ పవిత్రతను ఒక న్యాయవాది అంగడి సరుకుగా మార్చేశాడు. సాక్షాత్తూ హైకోర్టు జడ్జికే లంచం ఇవ్వాలంటూ క్లయింట్ నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దారుణం వెలుగుచూసింది. తీర్పును కొనుగోలు చేయవచ్చనే భ్రమ కల్పించి న్యాయమూర్తి ప్రతిష్టను బజారున పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జడ్జి పేరుతో లాయర్ మాయాజాలం…చెన్నైలోని 12వ అడిషనల్ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై గణేష్ అగర్వాల్, నరేష్…

Read More
Durai

గోల్డ్‌ ‘మెన్‌’కు కలిశెట్టి గ్రాండ్ సెల్యూట్

సహనం వందే, న్యూఢిల్లీ: కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్‌ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కుబేర మనసు…తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో…

Read More
South Vs North - Pani Puri Issue

తమిళనాడులో పానీపూరి రగడ

సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వివాదం వెనుక రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వివక్ష కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పానీపూరీ మంటలుతమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉత్తరాది వారు ఇక్కడికి కేవలం పానీపూరీ అమ్మడానికి,…

Read More
CBI Vijay Karur Incident

సీబీఐ వేట… కమలం ఆట – ‘తొక్కిసలాట’లో విజయ్ ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను విజయ్ పై పడింది. ఒకవైపు కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతం కాగా… మరోవైపు పొత్తుల రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సీబీఐ విచారణల వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఆయన…

Read More
Temple for Aliens

గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!

సహనం వందే, తమిళనాడు:దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ…

Read More

రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

కారం చల్లి… సిగరెట్లతో కాల్చి…బహుజనుడిపై పోలీసుల రాక్షసత్వం

సహనం వందే, చెన్నై:పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఏ…

Read More

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి

సహనం వందే, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ భాషా సంస్కృతులపై తమకున్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లలకు, అలాగే తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఆయన సూచించారు. భాషా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ గుర్తింపును మరింతగా పెంపొందించే లక్ష్యంతో స్టాలిన్ నవదంపతులు, వ్యాపారులను ఉద్దేశించి ఈ పిలుపునిచ్చారు. ఆయన సందేశం తమిళ ప్రజల్లో భాషాభిమానాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. పెళ్లి వేడుకలో…

Read More