IT Jobs Joru

ఐటీ జోరు… ఎంబీఏ బేజారు – ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2026 వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: నిజం మాట్లాడుకుందాం! జాబ్‌ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు…

Read More
Dalit IAS Santosh Verma comments on Reservations

దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్

సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…

Read More
Dr.Narahari TGGDA President raise voice on Allowances

అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…

Read More
Billionaires Brothers Nithin Chethan $570 Million Settlement by Supreme Court

వేల కోట్లు మోసం… కోర్టు అభయం – 13 వేల కోట్ల మోసకారులకు సుప్రీం బిగ్ ఆఫర్

సహనం వందే, న్యూఢిల్లీ: బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం…

Read More
ఐ-బొమ్మ రవి తండ్రి అప్పారావు 'మెగా' వార్నింగ్

ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి

సహనం వందే, హైదరాబాద్: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను,…

Read More
64Complaints to Hydra in One day

బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా

సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…

Read More
Sisters/Women in Politics

వారసుడిదే పీఠం… ఆడబిడ్డ శోకం – రాజకీయ మంటల్లో ఆడకూతురు ఆగమాగం

సహనం వందే, హైదరాబాద్:రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి…

Read More
16th Finance Commission Report

దక్షిణాది వాటాపై మళ్లీ కుట్ర – కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

సహనం వందే, హైదరాబాద్:16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగరియా తన నివేదికను గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీని ఈ నివేదిక నిర్ణయించనుంది. కీలకమైన ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయకుండా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిపై అప్పుడే తీవ్ర ఆందోళన మొదలైంది. కేంద్ర నిధుల పంపిణీ పాత పద్ధతిలోనే…

Read More
Doctor Arrested for Fake Currency Printing

డాక్టర్ ప్లాన్… నోట్ల స్కామ్ – ప్రభుత్వ వైద్యుడి సిగ్గుమాలిన నిర్వాకం

సహనం వందే, మధ్యప్రదేశ్:ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా నకిలీ నోట్ల రాకెట్‌కు హెడ్‌గా మారిపోయాడు! మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ కుంభకోణం వెనుక అసలు కుట్ర ఖండ్వా జైలు గోడల మధ్యే జరిగింది. ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ నవ్లాఖే అనే ఘనాపాఠీ కోట్లాది రూపాయల మోసంలో జైలుకు వెళ్లాడు. అక్కడే అతనికి పాత నేరగాళ్లతో స్నేహం కుదిరింది. జైలు నుంచి బయటకు రాగానే వీరంతా కలిసి మళ్లీ అక్రమ దందా మొదలుపెట్టారు. ఈ నేరగాళ్లంతా…

Read More
Suresh Chanda IAS complaints on Solar Electricity System

సోలార్ బిల్… ఐఏఎస్ ఫైర్ – చార్జీల పెంపుపై మాజీ సీఎండీ ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సోలార్ వినియోగదారుల బిల్లులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. డిస్కం అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను పక్కనబెట్టి నెట్ మీటరింగ్ స్థానంలో గ్రాస్ మీటరింగ్‌ను అమలు చేయడమే దీనికి కారణం. గ్రిడ్‌కు ఇచ్చిన కరెంటుకు తక్కువ ధర చెల్లిస్తూ తీసుకున్న కరెంటుకు మాత్రం అధిక రిటైల్ ధర వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ సీనియర్…

Read More