‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

కరోనా విపత్తు… రెమెడెసివిర్ రాకెట్ – హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల చుట్టూ జరిగిన అవినీతి దారుణాలు ఇప్పటికీ ప్రజలను కలవరపరుస్తున్నాయి. అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను శాసించిన మాజీ మంత్రి హరీష్ రావును పాలనలో ఈ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతని నియంత్రణలో వైద్య వ్యవస్థ అవినీతి మయమైందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాలను ఎండగడుతూ హరీష్ రావును నిలదీస్తోంది. మందుల సరఫరా నుంచి వ్యాక్సిన్ల…

Read More

విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…

Read More

దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

సహనం వందే, న్యూఢిల్లీ:మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

ఫ్యాషన్ ఉప్పు… థైరాయిడ్ ముప్పు – రాక్, పింక్ సాల్టుల్లో అయోడిన్ ఉండదు

సహనం వందే, న్యూఢిల్లీ:పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం. ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…డబ్ల్యూహెచ్ఓ ప్రకారం……

Read More

టీసీఎస్‌ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి

సహనం వందే, న్యూఢిల్లీ:టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన…

Read More

పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…

Read More

అభిమానులతో ‘ఫుట్‌బాల్’ – ప్రపంచ కప్ ఒక్క టికెట్ రూ. 8.87 లక్షలు

సహనం వందే, అమెరికా:అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ కప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. మొదట ధరలను గోప్యంగా ఉంచిన ఫిఫా… అతి తక్కువ ధరలు సుమారు రూ. 5,300 నుంచి మొదలవుతాయని మాత్రమే సెప్టెంబర్‌లో ప్రకటించింది. కానీ టికెట్ లాటరీలో గెలిచిన అభిమానులు ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధరలు సామాన్య అభిమానులకు ఆకాశాన్ని తాకే విధంగా ఉండటం…

Read More