‘స్తోమత లేకుంటే సినిమాకు రాకండి’ – హైకోర్టులో ‘ఓజీ’ తరపు లాయర్ వింత వాదన

సహనం వందే, హైదరాబాద్:‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు…

Read More

హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17

సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…

Read More

అసెంబ్లీలో అఖండ ‘చంద్ర’ప్రచండ – చంద్రబాబునూ వదలని బాలయ్య బాబు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల…

Read More

పచ్చబొట్టుకు పండగ – దక్షిణ కొరియాలో టాటూకు చట్టబద్ధత!

సహనం వందే, సియోల్:కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు. కళాకారుల జీవితాల్లో వెలుగు…దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం….

Read More

సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

సహనం వందే, హైదరాబాద్:చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా…

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

అభిమానంతో కోట్ల వ్యాపారం – ఫ్యాన్స్ టిక్కెట్లే… పవన్ కల్యాణ్ కు కోట్లు

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పుడు అభిమానం, వ్యాపారం మధ్య చిక్కుకుంది. కేవలం అభిమానుల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాలను జేబులో వేసుకుంటున్నారని సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు పవన్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వస్తున్న వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. 250 కోట్ల రూపాయల బడ్జెట్‌లో దాదాపు అటు ఇటుగా సగం పవన్ రెమ్యునరేషనే…

Read More

భూమి కోసం బెజవాడ గర్జన – అన్నదాత ఆగ్రహం… ప్రభుత్వ దౌర్జన్యం

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని నిరసిస్తూ బెజవాడ వీధుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాలు పోటెత్తాయి. తమ జీవనాధారాన్ని బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఒక్కతాటిపైకి వచ్చి నినదించారు. భూమిని అమ్మేవారుగా కాకుండా, భూమిని నమ్ముకున్న రైతులుగా తమ హక్కును నిలబెట్టుకోవడానికి ఈ గర్జన ప్రారంభమైంది. ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో మార్మోగిన నినాదాలు, రాష్ట్రంలో నెలకొన్న…

Read More

‘ఓజీ’ బ్లాక్ టికెట్ల మాఫియా ‘కింగ్’ – అధిక ధరకు అమ్ముతున్న ఓ బడా నిర్మాత

సహనం వందే, హైదరాబాద్:మెగా అభిమానుల ఆశలకు అడ్డుపడుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే బ్లాక్ టిక్కెట్ల మాఫియా ప్రబలుతోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని అస్త్రంగా వాడుకొని కొందరు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కీలకమైన పదవిలో ఉన్న ఒక సినీ నిర్మాత ఈ దందా వెనుక ఉన్నారని, ఈయన ఒక బ్లాక్ టిక్కెట్ల నిర్మాతగా మారి వ్యవస్థను పక్కనపెట్టి కాసుల కోసం కక్కుర్తి…

Read More

డొనేషన్ల అడ్మిషన్… నోటీసుల పరేషాన్ – ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యంగా దందా

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ సీటు అంటే మెరిట్, ప్రవేశ పరీక్షల ర్యాంకుల మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అగ్రశ్రేణి కాలేజీలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశాయి. ఈ అక్రమాలకు పరాకాష్ఠగా ఇటీవల జరిగిన అడ్డగోలు యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు నిలిచాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి విద్యార్థుల మెరిట్‌ను పక్కకు పెట్టాయి. లక్షలకు లక్షలు డొనేషన్ల…

Read More