నారా వారి నయా నాటకం – యూరియా తగ్గించే రైతులకు బోనస్ ఎర

సహనం వందే, అమరావతి:యూరియా కొరత సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాన్నే రచించారు. యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ఒక్కో బస్తాకు రూ. 800 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్నా ఈ ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో వాడకం తగ్గించమని చెప్పడం… ఒకవేళ అవసరమైతే డోర్ డెలివరీ…

Read More

అమెరికా రాజకీయల్లో ‘మస్క్’ మజా..

సహనం వందే, అమెరికా:ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం…

Read More

మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం…

Read More

దళితులపై దాష్టీకం హక్కుల ఉల్లంఘనే!

సహనం వందే, ఢిల్లీ: తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్…

Read More