హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

సహనం వందే, న్యూఢిల్లీ:హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

వెండితెరపై బిచ్చగాడు – రా అండ్ రియలిస్టిక్ ‘దేవా’గా ధనుష్

సహనం వందే, హైదరాబాద్:సినిమా అంటే భావోద్వేగాలను కలిగించే కళ, మనుషులను ఆలోచింపజేసే కథల సౌరభం. సమాజంలో ఒక అంతర్భాగమైనా, వారి జీవితాలను లోతుగా స్పృశించే సినిమాలు చాలా తక్కువ. కానీ చార్లీ చాప్లిన్ లాంటి ప్రపంచ దిగ్గజం నుంచి తమిళ నటుడు ధనుష్ నటించిన ‘కుబేరా’ వరకు బిచ్చగాళ్ల పాత్రలు వెండితెరపై గొప్ప ప్రభావం చూపాయి. వారిలోని మానవత్వం, సామాజిక స్పృహ, పోరాట పటిమను ఈ చిత్రాలు అద్భుతంగా ఆవిష్కరించాయి. చార్లీ చాప్లిన్: ది ట్రాంప్మూకీ సినిమాల…

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More

ఆధునిక వైద్యంపై విషం – సొంత వైద్యంతో క్యాన్సర్…కూతురి బలి

సహనం వందే, లండన్:ఆమె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక యువతి. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమెకు కీమోథెరపీ చేస్తే 80 శాతం తగ్గుతుందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ తల్లి ఆధునిక వైద్యాన్ని తిరస్కరించి… అశాస్త్రీయ మొక్కల ఆధారిత థెరపి చేయించి కూతురి ప్రాణాలను బలిపొంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ సోదరి… తమ తల్లి ప్రచారం చేసిన వైద్య వ్యతిరేక సిద్ధాంతాల వల్లే కన్నుమూసిందని ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. అపోహల…

Read More

కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More

విమాన వేగంతో ఖమ్మం హైవే మీదుగా విశాఖకు ప్రయాణం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధం అవుతుంది. వచ్చే ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అంటే రాబోయే కీలకమైన సంక్రాంతి పండుగకు రయ్ రయ్ మంటూ విశాఖపట్నం దూసుకుపోవచ్చు. మధ్యలో ఉండే రాజమండ్రి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ఏకంగా 56 కిలోమీటర్లు తగ్గటం విశేషం. ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం అత్యంత…

Read More

వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

Read More