స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More

హంతకుడి చర్మంతో పుస్తకం

సహనం వందే, లండన్: బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా నిలిచిన పుస్తకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హంతకుడు విలియం కోర్డర్ చర్మంతో చేసిన అరుదైన పుస్తకం సఫోల్క్‌లోని మోయిసెస్ హాల్ మ్యూజియంలో త్వరలో సందర్శకులకు అందుబాటులో రానుంది. ఈ పుస్తకం ఊహించని విధంగా బయటపడటంతో దీని చుట్టూ చరిత్ర, నైతికతకు సంబంధించిన ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో సంచలనం సృష్టించిన “రెడ్ బార్న్ మర్డర్” కేసుతో ఈ పుస్తకానికి సంబంధం ఉంది. ఆనాటి…

Read More

హిందీ హిందువుల భాష… ఉర్దూ ముస్లింల భాష కాదు

సహనం వందే, ఢిల్లీ: హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి…

Read More

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More

న్యూయార్క్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సహనం వందే, న్యూయార్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్ సిటీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డేగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్…

Read More

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్

1248 నామినేషన్లు సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు భారీ స్పందన లభించింది. ఈ అవార్డుల ఎంపిక కోసం సినీనటి జయసుధ చైర్మన్‌గా జ్యూరీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు జ్యూరీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు. తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జ్యూరీ…

Read More

సూర్యాపేట శరత్ కార్డియాక్ సెంటర్‌లో తనిఖీలు

బయటపడ్డ అక్రమాలు… టీజీఎంసీ నోటీసులు సహనం వందే, సూర్యాపేట సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్‌లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్డియాక్ సెంటర్‌లో జరుగుతున్న పలుఅక్రమాలు బయటపడ్డాయి. తనిఖీల్లో డాక్టర్లు తమ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన గుండె డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ స్కాన్ చేసి డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నట్టు తేలింది. ప్రశాంత్ అనే పేషెంట్‌కు వనం శరత్ చంద్ర అనే…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More