సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై ఈడీ కొరడా

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…

Read More

‘రక్త’ సంబంధాలు

సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో…భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల…

Read More

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…

Read More

‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’

సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్‌ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…

Read More

పదేళ్ల చిన్నారి మద్యంపై ఉద్యమం

సహనం వందే, ఆగ్రా: పదేళ్ల చిన్నారి ……. కానీ మనసు మాత్రం ఉక్కు సంకల్పం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పదేళ్ల వంశిక సికర్వార్ అనే బాలిక చేసిన ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గ్రామంలోని మహిళలకు నిత్యం ఇబ్బంది కలిగిస్తున్న ఒక మద్యం దుకాణాన్ని తరలించేలా చేసి… నిజంగానే చిన్నారి పోరాట యోధురాలు అనిపించుకుంది. తాగొచ్చి గొడవ చేసేవారు..‌.కోలారా కలాన్ అనే చిన్న గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండేది. దాని వల్ల ఆ ఊరి మహిళలు…

Read More

జపాన్‌లో తెలంగాణ జాతర!

పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం! సహనం వందే, జపాన్ వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్…

Read More

మాత్రతో బరువుకు చెక్

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే! అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఎలి లిల్లీ ఊబకాయానికి చెక్ పెట్టే ఒక అద్భుతమైన మాత్రను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ‘ఓర్ఫోర్గ్లిప్రాన్’ మాత్ర, ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా ఉండటమే కాకుండా, వాడటానికి కూడా చాలా సులభంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని పంపిణీ మరింత సులభతరం కానుంది. సగటున 7.2 కిలోల బరువు తగ్గుదల!ఓర్ఫోర్గ్లిప్రాన్ ఫేజ్-3…

Read More

ఐఐటీపై ఆరు’గురి’

సహనం వందే, కోట: ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్‌ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్‌లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్…

Read More

భార్య చేతిలో మాజీ డీజీపీ హత్య

సహనం వందే, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. “నేనే రాక్షసుడిని చంపాను!”పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి…

Read More

ఫ్యాషన్ రంగంలో ‘ఓలో’ విప్లవం

సహనం వందే, హైదరాబాద్: శాస్త్ర ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా శాస్త్రవేత్తల బృందం మానవులు ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త రంగును కనుగొనడం సంచలనం సృష్టిస్తుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ శాస్త్రీయ పరిశోధనల్లో ఒక గొప్ప మలుపుగా నిలుస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. మనకు తెలిసిన ఏడు రంగులతో పాటు, ఈ కొత్త రంగు చేరడంతో రంగుల ప్రపంచం మరింత విస్తృతం కానుంది. ఇది శాస్త్ర, సాంకేతిక, కళా రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశాభావం…

Read More