ప్రయాగ్‌రాజ్‌లో దర్గా ఎక్కి జైశ్రీరామ్ నినాదాలు

సహనం వందే, ప్రయాగ్‌రాజ్:ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హిందుత్వ సంస్థల సభ్యులు సికంద్రా ప్రాంతంలోని సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ మియాన్ దర్గాపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో హిందుత్వ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకుని దర్గాపైకి ఎక్కుతూ జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

జగన్ టెన్షన్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వరుస కేసులతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి కీలక నేతలు ఇప్పటికే జైలు పాలవగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఇప్పటికే నమోదైన క్విడ్ ప్రోకో వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఆధారంగా చేసుకుని ఆయన బెయిల్‌ను రద్దు…

Read More

బండి సంజయ్ ఖబర్దార్!

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు…

Read More

మజ్జిగ తాగండి… ఆశీర్వదించండి

సహనం వందే, రాజేంద్రనగర్:మజ్జిగ తాగండి… తనను ఆశీర్వదించండి అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల పిలుపునిచ్చారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దురెడ్డి మాట్లాడుతూ… వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

Read More

భార్యకు తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి గెంటేసి

సహనం వందే, రాజేంద్రనగర్:విడాకులు ఇస్తున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పాడు. అనంతరం భార్యపిల్లలను చితకబాదాడు. ఆపై వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్ వహీద్ కింగ్స్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వీరు గొడవ…

Read More

అసెంబ్లీకి రారు… ప్రజల వద్దకు పోరు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు నిర్వహించిన సర్వే రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలక, ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో స్థానంలో నిలవడం తీవ్ర దుమారానికి రేకెత్తిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, ప్రజల్లో కూడా తిరగడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ, సర్వేలో ఆయనకు రెండో స్థానం దక్కడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కేసీఆర్ మేనల్లుడు ఎమ్మెల్యే హరీష్…

Read More

కంచ గచ్చిబౌలి భూములపై ‘ఏఐ’ రచ్చ

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఏఐని ఉపయోగించి సృష్టించిన తప్పుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవాలు వెల్లడించే లోపే అబద్ధాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అభిప్రాయపడుతుంది. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా ఆడియోలు,…

Read More

పిఠాపురంలో ఫైట్

సహనం వందే, పిఠాపురం:జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇటీవల పిఠాపురం పర్యటనలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కుమారపురంలో జరిగిన ఈ సంఘటనలో వర్మ వర్గీయులు నాగబాబును చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్మల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణలను మరోసారి ఉద్ధృతం చేసింది. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

Read More