కుల వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం

నేడు జ్యోతి రావ్ ఫూలే జయంతి (కె.రాములు, ఎండీ, ఆగ్రోస్)భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థ ఒక చీకటి అధ్యాయం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ సమాజంలో అసమానతలను, అణచివేతను సృష్టించిన కాలంలో దానిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గొప్ప సంఘ సంస్కర్తలలో జ్యోతి రావ్ ఫూలే అగ్రగణ్యులు. ఆయన చేసిన సామాజిక పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. కుల వివక్షతో అణగారిన వర్గాల విముక్తి కోసం, స్త్రీ విద్య యొక్క…

Read More

నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’

సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్‌ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్‌ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్‌ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్‌ ఇండియా స్కూల్‌ ఈజ్‌ మై బ్రాండ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….

Read More

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

సహనం వందే, అమరావతి:మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. మహిళల పట్ల ఇలాంటి తప్పుగా మాట్లాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పార్టీ అధిష్టానం వెంటనే చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ…

Read More

సిద్ధు కామెడీ ఉన్నా.. కథలో ‘క్రాక్’ మిస్!

‘జాక్’ రివ్యూ: సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “జాక్ – కొంచెం క్రాక్” చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. “టిల్లు స్క్వేర్” వంటి హిట్ తర్వాత సిద్ధు నుండి వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథాబలం లేకపోవడం వల్ల నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే…జాక్ అనే తెలివైన హ్యాకర్ రా ఏజెంట్ కావాలని…

Read More

మహారాష్ట్రలో మరాఠీ భాషోద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలోని డోంబివలిలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు తాజాగా ఇద్దరు మహిళలపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా భాషా వివాదాలపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, మహారాష్ట్రలో నాన్-మరాఠీ వ్యతిరేక ఉద్యమాలు, దక్షిణ రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు… ఎక్కడ చూసినా భాషా ప్రాముఖ్యత పెరుగుతోంది. గతంలో…

Read More

భారత్‌తో మైత్రికి చైనా తహ తహ

సహనం వందే, ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల దెబ్బకు చైనా కౌంటర్ ఎటాక్‌తో స్పందించింది. ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా టారిఫ్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా భారత్ వైపు దృష్టి సారించి, మైత్రి బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు అమెరికా దిగుమతులపై సుంకాలను 34 శాతం నుంచి భారీగా 84 శాతానికి పెంచి ట్రంప్‌కు షాక్ ఇచ్చిన చైనా, మరోవైపు భారత్‌తో కలిసి నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్థిక…

Read More

మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ప్రస్తుతానికి నిలిచినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలోని సీనియర్ నాయకులు, అధిష్ఠానం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రేవంత్ నిర్ణయాలకు పెద్దల అడ్డుకట్ట…రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో ముందుకు…

Read More

జేఈఈ కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌

సహనం వందే, హైదరాబాద్:జేఈఈ మెయిన్‌–2025లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్‌ కొంత తగ్గే అవకాశం ఉంది. 2024లో జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్‌ 94 ఉండగా, ఈసారి అది 92 ఉండొచ్చని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లలోనూ ప్రశ్నలు గతం కంటే కొద్దిగా కష్టతరంగా ఉండటమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షలు ఈ మంగళవారం ముగిశాయి. దాదాపు 12 లక్షల…

Read More

గూడు కోసం జర్నలిస్టుల గోడు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్…

Read More