మరణమే లేకుండా… అధికారమే శాశ్వతంగా! – చైనాలో పుతిన్‌, జిన్‌పింగ్, కిమ్ సమాలోచన

సహనం వందే, చైనా:చైనాలో చారిత్రక తియాన్మెన్ చౌక్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఓ రహస్య సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీరు ఇప్పటికే అనేక వ్యూహాలు రచిస్తుంటారు. అయితే ఈసారి వీరి సంభాషణ చావును జయించి శాశ్వతంగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై జరిగినట్లు సీక్రెట్ చర్చ బయటపడింది. జీవశాస్త్ర సాంకేతికతతో అవయవ మార్పిడి ద్వారా…

Read More

రాజకీయ ఎజెండాగా కుటుంబ తగాదాలు – కవిత రాజీనామా… భవిష్యత్తుపై గందరగోళం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలు ఈ విషయాలపై పునరాలోచించాలని ఆమె కోరారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు…

Read More

అగ్రరాజ్యంగా చైనా – నాటి రష్యా పాత్రను పోషిస్తున్న డ్రాగన్ కంట్రీ

సహనం వందే, చైనా:ఒకప్పుడు కమ్యూనిస్ట్ రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రపంచానికి అండగా నిలబడింది. ఇప్పుడు అదే బాధ్యతను కమ్యూనిస్ట్ చైనా భుజానికెత్తుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాపై విమర్శల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికా విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ సుంకాల విధానాల వల్ల అనేక దేశాలు నష్టపోతున్నాయి. చైనా, భారత్‌ వంటి దేశాలను లెక్కచేయకుండా సుంకాలు విధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంపై షీ…

Read More

హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…

Read More

అమెరికాలో హై’డ్రగ్స్’బాద్ నరమేధం – ఫెంటానిల్‌ వాడి వందల మంది మృతి

సహనం వందే, హైదరాబాద్:వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్‌ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే…

Read More

కిమ్ ట్రైన్… మిస్సైల్ రైడ్ – బాంప్రూఫ్ రైల్లో కిమ్ చైనాకు ప్రయాణం

సహనం వందే, ఉత్తర కొరియా:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆరేళ్ల తర్వాత పొరుగు దేశం చైనాలో పర్యటించిన ఆయన విమానంలో కాకుండా తన ప్రత్యేకమైన బాంప్రూఫ్ రైలులో ప్రయాణించడం అంతర్జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం కాదు. ఒక కదిలే భద్రతా కోట. సుమారు 90 కోచ్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ, మిస్సైల్ వ్యవస్థ, బాంబు నిరోధక వ్యవస్థలు, అత్యంత విలాసవంతమైన…

Read More

ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆదేశాలు పట్టవా? ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఆదేశాలనే తుంగలో తొక్కుతున్నారు. వారం క్రితమే ఆయన ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

గాజా యుద్ధంలో జర్నలిస్టుల ఊచకోత – 210 మంది హత్య

సహనం వందే, న్యూయార్క్:గాజా యుద్ధంలో జర్నలిస్టులను టార్గెట్ చేసి ఇజ్రాయిల్ హత్య చేస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి 200కు పైగా మీడియా సంస్థలు సోమవారం భారీ నిరసనలకు దిగాయి. పత్రికలు నల్లటి ముఖ చిత్రాలను ప్రచురించగా… టెలివిజన్, రేడియోలు తమ ప్రసారాలను నిలిపివేశాయి. ఈ నిరసన ద్వారా గాజాలో స్వేచ్ఛాయుత వార్తా కవరేజీకి అనుమతించాలని, అమాయక జర్నలిస్టుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్,…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More