మంత్రిపైనే ముఖ్యమంత్రి ‘గన్’ – ఏకంగా సొంత మంత్రి ఇంటిపైనే పోలీస్ ఎటాక్

సహనం వందే, హైదరాబాద్:సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది….

Read More

వీసా బజార్‌… ఇండియా లూజర్! – ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్‌ పతనం

సహనం వందే, లండన్:అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్‌ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా..‌. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి……

Read More

కర్ణాటకలో ‘గూగుల్’ గోల – బెంగళూరులో వైజా’గూగుల్’ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి:విశాఖపట్నంలో ‘గూగుల్’ ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ఉన్న అత్యంత దారుణమైన రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వ్యాపార వర్గాలను విసిగించాయని… అందుకే గూగుల్ సంస్థ విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిందని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే బెంగళూరు తన వ్యాపార సౌహార్ద్రతను కోల్పోయి అంతర్జాతీయ పోటీలో…

Read More

గూగుల్ డీల్… పవన్ ఫీల్ – పవర్ స్టార్ లేకుండానే అంతర్జాతీయ డీల్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్రానికి అతి కీలకమైన, దేశంలోనే ప్రథమమైన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం కోసం మంగళవారం ఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం కూటమిలో విభేదాలను బహిర్గతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఈ చారిత్రక ఒప్పందానికి పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అనేక చిన్నపాటి ప్రభుత్వ…

Read More

జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు…

Read More

‘కారం’తో రగిలిన కోల్ కతా – పశ్చిమబెంగాల్లో మిరప పొడితో నిరసన

సహనం వందే, కోల్ కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు. దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన…

Read More

తెలంగాణ కలెక్టర్… ఏపీ మంత్రికి కనెక్ట్ – ఒక్క ఫోన్ తో పని చేసిపెట్టిన ఉన్నతాధికారి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల వైఖరిపై తీవ్ర చర్చకు దారితీసింది. సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తన భూమి వివరాలు సరిచేయడానికి ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… చివరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి చేసిన ఒక్క…

Read More

‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు

సహనం వందే, మడ్ గాస్కర్:‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు తిరుగుబాటుతో మడ్ గాస్కర్ అధ్యక్షుడు అండ్రీ రాజోయెలినా దేశం విడిచి పారిపోవడం ప్రపంచ రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. వేలాది మంది యువకులు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉద్ధృతం చేయడంతో ఆర్మీ కూడా సహకరించింది. సైన్యం మద్దతు కోల్పోయిన రాజోయెలినా రహస్యంగా దేశం వదిలి వెళ్లిపోయాడు. రాజోయెలినా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒప్పందం చేసుకుని ఫ్రెంచ్ సైనిక విమానంలో పారిపోవడం…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్

సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…

Read More

ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…

Read More