బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే

సహనం వందే, బీహార్:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది….

Read More

‘దృశ్యం’ రివర్స్ – భార్య, ప్రియుడి క్రూరత్వం

సహనం వందే, అహ్మదాబాద్‌:దృశ్యం సినిమాను తలపించే అత్యంత క్రూరమైన హత్యోదంతం అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సరిగ్గా ఏడాది క్రితం అదృశ్యమైన 35 ఏళ్ల సమీర్ అన్సారీ అనే వ్యక్తి అస్థిపంజరం మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బయటపడింది. అతడి ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద శవం లభ్యమైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో అతనిని అడ్డు తొలగించుకోవడానికి నిందితులు పక్కా…

Read More

బస్టాండ్‌ పై హెలిప్యాడ్‌ – 150 ప్లాట్‌ ఫారాలతోపాటు ఐమాక్స్‌

సహనం వందే, తిరుపతి:శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. వెంకన్న భక్తులు రోజుకు లక్షల్లో తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని తట్టుకునేలా 11 అంతస్తుల అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేవలం బస్సులు నిలిపే స్థలంగా కాకుండా దివ్యక్షేత్రానికి తగిన విధంగా ఆధునిక వసతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అన్ని సౌకర్యాలతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఆశ్చర్యకరంగా…

Read More

భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్

సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…

Read More

రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు…

Read More

రీల్స్ మత్తు… మోడీ ఎత్తు – 21 శతాబ్దపు మత్తు పదార్థం ‘రీల్స్’

సహనం వందే, హైదరాబాద్:బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన విమర్శల తూటాలను సంధించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ… దేశంలోని యువతను సామాజిక మాధ్యమాల ‘రీల్స్’ మత్తులో ముంచేసి ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు పట్టించుకోకుండా చేయాలని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ రీల్స్ మత్తు యువతను బానిసత్వం వైపు నెడుతోందని… ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో టెక్నాలజీని…

Read More

ఇండియన్ కుర్రాళ్ళు… 22 ఏళ్లకే బిలియనీర్లు – అమెరికాలో ఇద్దరు యువకుల సంచలనం

సహనం వందే, న్యూయార్క్:సిలికాన్ వ్యాలీ సాక్షిగా ఇద్దరు భారతీయ యువ కెరటాలు చరిత్ర సృష్టించారు. 22 ఏళ్లకే స్వయం కృషితో ప్రపంచ బిలియనీర్ల రికార్డును బద్దలు కొట్టారు. ఆదర్శ్ హిరేమఠ్, సూర్య మిడ్హా అనే ఈ ఇద్దరు యువకులు ఏఐ రిక్రూట్‌మెంట్ యాప్ ‘మెర్కోర్’తో సంచలనం సృష్టించారు. తాజాగా రూ. 2,900 కోట్ల భారీ ఫండింగ్ గెలుచుకోవడంతో ఈ కంపెనీ విలువ ఒక్కసారిగా రూ. 83,000 కోట్లకు ఎగబాకింది. తద్వారా మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును చెరిపేసి…

Read More

క్రికెట్ క్వీన్స్… ప్రైజ్ మనీ అదుర్స్ – ప్రపంచ కప్ విజయంతో రూ. 90 కోట్ల ప్రైజ్

సహనం వందే, న్యూఢిల్లీ:క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి భారత నారీశక్తి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో ఈ చరిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. దేశం గర్వించేలా చేసిన ఈ క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐవిశ్వవిజేతగా…

Read More

తులం తుస్… బంగారం మిస్ – ఎన్నికల హామీపై చేతులెత్తేసిన కాంగ్రెస్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఎంతో వాడీవేడిగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలుగుతున్నాయి. దీంతో మహిళల తులం బంగారం ఆశ అడియాశగా మారింది. మహాలక్ష్మి పథకం పేరుతో కొత్తగా పెళ్లయిన వారికి పసిడి బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఆ హామీ ఇప్పుడు…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More