రైతన్న నోట్లో మార్క్ ఫెడ్ మట్టి – పరిశ్రమలకు తరలుతున్న యూరియా

సహనం వందే, హైదరాబాద్:యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంటలకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలకు కేటాయించిన యూరియాను కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియాను పైవుడ్, రెసిన్, పెయింట్స్, వార్నిష్ పరిశ్రమలు, జంతు, పౌల్ట్రీ, ఫీడ్ యూనిట్లలో, సారాయి తయారీలో వినియోగిస్తారు. కేంద్ర…

Read More

తమిళనాడు వర్సెస్ తెలంగాణ – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ మధ్య వార్

సహనం వందే, హైదరాబాద్:ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు జాతీయ పార్టీల తరఫు కూటములు దక్షిణాదిని రాజకీయ వేదికగా తయారు చేసుకున్నాయి. తమిళనాడు (టి), తెలంగాణ (టి) రాష్ట్రాలను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దక్షిణాది కేంద్రంగా ఉత్తరాది పెద్దలు ఉపరాష్ట్రపతి ఎన్నికల…

Read More

కాళ్లు పట్టు… పదవి కొట్టు – రిటైర్డ్ ఐఏఎస్ శరత్ కు చైర్మన్ పదవి

సహనం వందే, హైదరాబాద్:ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు తమ హుందాతనాన్ని మరిచి రాజకీయ నాయకుల ముందు తలవంచడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సంచలనం రేపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్‌కు కీలక పదవి దక్కడంతో ఈ చర్చ మరోసారి రాజుకుంది. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. పాలకుల వద్ద ఆశ్రయం పొందిన అధికారులు ఉన్నతాశయాలను పక్కన పెట్టి, పదవుల కోసం…

Read More

పంట కోర్సుల్లో వాటా మంట – వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కోటా కిరికిరి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ రైతులు, వ్యవసాయ కూలీల కోటా అమలుపై విమర్శలు వచ్చాయి. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నా, కోటా నిబంధనలు గ్రామీణ వర్గాలకు నిజంగా న్యాయం చేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రైతు, కూలీ కుటుంబాలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, కొన్ని విధానపరమైన లోపాలు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం కంటే తక్కువ…

Read More

మా’ర్వౌడీ’ బిజినెస్ – ఉత్తరాది నుంచి దక్షిణాదికి మార్వాడీ విస్తరణ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. వారిని తట్టుకోలేక వైశ్య కుటుంబాలు వ్యాపారాలను వదిలేస్తున్నాయి. అంతే కాదు అనేక ఇతర వ్యాపార కుటుంబాలు కూడా మార్వాడీల ముందు చిత్తయిపోతున్నాయి. కిరాణం కొట్టు మొదలు… బంగారం వ్యాపారం వరకు మార్వాడీలదే రాజ్యం నడుస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వారి హవా కొనసాగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసేసుకుంటున్నారు. వారిని తట్టుకొని నిలబడటం సాధ్యం కావడం లేదు. భారత్‌ ధనవంతుల్లో 42 శాతం…

Read More

యూరియా లోటు… షరతుల పోటు – పట్టాదారు పాస్ పుస్తకం ద్వారానే అమ్మకం

సహనం వందే, హైదరాబాద్:కీలకమైన వర్షాల సమయంలో యూరియాను రైతులకు అందజేయడంలో తెలంగాణ మార్క్ ఫెడ్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న కొందరు దళారులతో… మరికొందరు అధికారులు కుమ్మక్కైనట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్లు స్వయానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి….

Read More

‘చిరు’ చొరవ – టాలీవుడ్ కార్మికుల సమస్యపై చర్చ

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 15 రోజులుగా జరుగుతున్న సమ్మెను నిలుపుదల చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు నిర్మాతలతో ఆయన చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటు నిర్మాతల మధ్య, అటు కార్మికుల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు. 15 రోజుల పోరాటం…వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత 15…

Read More

అబార్షన్ల మాఫియా – తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి దందా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలోని తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి చేతిలో ఒక గర్భిణీ మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ వైద్య మండలి సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా నకిలీ వైద్యుడు శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కేవలం చికిత్స మాత్రమే కాదు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చికిత్స పేరుతో ప్రాణం తీశాడు…తుంగతుర్తిలో నకిలీ వైద్యుడు/ఆర్ఎంపీ శ్రీనివాస్ చేసిన…

Read More

‘పదవులు మీకే… పైసలు మీకేనా’ – రేవంత్‌ రెడ్డి పై రగులుతున్న కోమటిరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీని విస్మరించడం, నియోజకవర్గానికి నిధులు రాకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనతో మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి తన దండయాత్రను ఆపడం లేదు. మంత్రి పదవి వివాదం.. విభేదాలకు కారణంరాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే…

Read More

సరోగసి కేసులో 7 ఆస్పత్రులకు నోటీసులు

సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్‌ సరోగసి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఏడు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి పలు ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు అనుమానిస్తున్న హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య…

Read More