పొలిటికల్ ‘జనరేషన్ Z’

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 1997-2012 మధ్య జన్మించిన ‘జనరేషన్ జెడ్’ జీవితాల్లో ఇది ఒక అంతర్భాగమైపోయింది. ఈ తరం రాజకీయంగా అత్యంత అవగాహన కలిగినదిగా పేరు తెచ్చుకుంది. ఆన్‌లైన్ రాజకీయ చర్చల్లో వీరు మునిగిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు జనరేషన్ జెడ్ యువతకు రాజకీయాలపై జ్ఞానాన్ని అందిస్తున్నాయని అధ్యయన నివేదిక తెలుపుతుంది. ఎక్కడ ఏం జరిగినా…

Read More

పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సహనం వందే, ఢిల్లీ: సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి….

Read More

ఖమ్మంలో 10 ఆసుపత్రుల మూసివేత

సహనం వందే, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నకిలీ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మూసివేశారు. చికిత్సలు చేయకుండానే నిధులు కాజేయడం ఆయా ఆసుపత్రుల అక్రమాలకు పరాకాష్ట. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులను పొందిన కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య…

Read More

హిందీ వర్సెస్ మరాఠీ వర్సెస్ కన్నడ

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా? మరాఠీ ఓట్ల ఏకీకరణకు అవకాశం? కేంద్ర…

Read More

కేదార్‌నాథ్, బద్రీనాథ్ భక్తులకు శుభవార్త

సహనం వందే, హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లు త్వరలో భక్తుల కోసం తమ తలుపులు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్ వచ్చే నెల 2వ తేదీన ఉదయం 7 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుస్తారు. అలాగే బద్రీనాథ్ ధామ్ 4న ఉదయం 7 గంటలకు భక్తులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారీగా మంచు కురవడం…

Read More

భారతీయ విద్యార్థులే బలిపశువులా?

సహనం వందే, వాషింగ్టన్: ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం…

Read More

భార్య హిందువని అమెరికా ఉపాధ్యక్షుడిపైనే మత దాడి

సహనం వందే, వాషింగ్టన్: అమెరికాలో జాతి వివక్షతతోపాటు మత విద్వేషాలు రగిలిపోతున్నాయి. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌ను టార్గెట్ చేస్తూ మత, జాతి వివక్షా పూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ తెలుగు హిందూ కుటుంబం కావడం… జేడీ వాన్స్ అమెరికన్ క్రిస్టియన్ కావడంతో వారిపై మతపూరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుడ్ ఫ్రైడే సందర్భంగా రోమ్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్…

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

‘ముంబై మరాఠీల అడ్డా’

సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్‌లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…

Read More

‘ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్’

యుద్ధం మిగిల్చిన విషాదం! సహనం వందే, గాజా సిటీ: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో రెండు చేతులు కోల్పోయిన 9 ఏళ్ల పాలస్తీనియన్ బాలుడు మహమూద్ అజ్జౌర్ చిత్రం 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గాజా ఫోటోగ్రాఫర్ సమర్ అబూ ఎలౌఫ్ తీసిన ఈ చిత్రం యుద్ధం భయానక పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యుద్ధం మిగిల్చిన విషాదం! గత ఏడాది గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మహమూద్ తీవ్రంగా గాయపడ్డాడు….

Read More