ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

సహనం వందే, న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ…

Read More

కారం చల్లి… సిగరెట్లతో కాల్చి…బహుజనుడిపై పోలీసుల రాక్షసత్వం

సహనం వందే, చెన్నై:పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఏ…

Read More

విశాఖ రైల్వేస్టేషన్‌లో జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్‌

సహనం వందే, విశాఖపట్నం:రైలు ప్రయాణికులకు విశ్రాంతి అందించేలా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సరికొత్త క్యాప్సుల్ హోటల్‌ ప్రారంభమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో తొలిసారిగా ఈ తరహా వసతి అందుబాటులోకి వచ్చింది. స్లీపింగ్ పాడ్స్ పేరుతో ఈ హోటల్‌ను మొదలుపెట్టారు. తక్కువ ధరకు ఏసీ గదులు, ఉచిత వైఫై, వేడి నీటి స్నానాలు, స్నాక్స్ వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు చక్కటి విశ్రాంతి కేంద్రంగా ఇది మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లోని మొదటి నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న మొదటి…

Read More

‘నాడి’పట్టే చెయ్యి’గాడి’తప్పుతోంది-డబ్బు కోసం వైద్యులు గడ్డి

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ ఇలా అనేకమంది వైద్యులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇప్పటికే లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు అందుతున్నా… ప్రైవేటు ప్రాక్టీస్ ఉన్నా కొందరు ఇంకా కోట్ల సంపాదనకు కుయుక్తులు చేస్తున్నారు. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా పేట్ల బుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసిన డాక్టర్ రజనీరెడ్డి ఎన్ఎంసీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆమె ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్…

Read More

సీబీఐ వలలో డాక్టర్ రజినీరెడ్డి – మాజీ సూపరింటెండెంట్ పై కేసు

సహనం వందే, హైదరాబాద్:నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉల్లంఘించి పలు వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో మరో కీలక పేరు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జ్ మాజీ సూపరింటెండెంట్ రజినీరెడ్డి ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు. తనిఖీ బృందంలో పాత్ర…ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలో మాజీ సూపరింటెండెంట్ సభ్యులుగా ఉన్నారు. గత నెల 30న…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశునికి దెబ్బ మీద దెబ్బ

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై…

Read More

పాడ్‌కాస్ట్‌లపై జెన్ జెడ్ (1997-12) జోరు

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక యువతరం… ముఖ్యంగా జెన్ జెడ్ కేవలం సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌లకే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం వారి ఆసక్తి కొత్త ధోరణి వైపు మళ్లింది – అదే పాడ్‌కాస్ట్‌. ఈ ఆడియో కంటెంట్ రూపం జెన్ జెడ్ తరంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరానికి చెందినవారు పాడ్‌కాస్ట్‌లలో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సమాచారాన్ని వెతుకుతున్నారు. పాడ్‌కాస్ట్‌లపై అమిత ఆకర్షణ…జెన్ జెడ్ అంటే 1997…

Read More

ఆయిల్ పామ్ కంపెనీలకు విత్తన ‘చుట్టం’

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంటను ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తున్నా… ఆ మేరకు రైతులకు భరోసా కల్పించే విషయంలో ఆయిల్ ఫెడ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఇతర పంటలకు బదులు లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని చెబుతూనే… మరోవైపు ఆ పంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ పంటకు నష్టం జరిగితే పరిహారం ఉంటుందా? అన్న రైతుల…

Read More