ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

Read More

విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!

సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…

Read More

ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?…

Read More

రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరిగింది! పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తెగేసి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సిద్ధం కావడంతో, రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టాయి. ‘ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు’ అంటూ హితవు పలికిన సీఎంకు,…

Read More

బ్రాహ్మణుల “అతి”వాదం

సహనం వందే, బెంగళూరు: దేశంలో పరీక్షలంటే విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ కొందరు మాత్రం తమ ఆచారాలను అడ్డుపెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని నీట్ పరీక్షా కేంద్రంలో జరిగిన జంధ్యం వివాదం ఇందుకు నిదర్శనం. సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో పరీక్షల్లో అనేక ఆంక్షలు సహజం. రింగులు, షూలు, గడియారాలు వంటి వాటితో పాటు, ఇప్పుడు ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా…

Read More

తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల

సహనం వందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు….

Read More

దివ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రకు శ్రీకారం

సహనం వందే, చమోలి: ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న పవిత్ర బద్రీనాథ్ ధామ్, ఆరు నెలల నిరీక్షణ తర్వాత తన దివ్య ద్వారాలు తెరుచుకుంది. ఆదివారం ఉదయం వేద మంత్రాల దివ్య ధ్వనులు మారుమోగుతుండగా, మంగళకరమైన సంగీతాల నడుమ, 40 క్వింటాళ్ల సుగంధ భరిత పుష్పాల అలంకరణతో శోభాయమానంగా ఆలయ గర్భగుడి తలుపులు తెరిచారు. ఈ శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొని తొలి పూజలు నిర్వహించారు. భక్తుల హృదయాలు…

Read More

జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు….

Read More

రాముడు ‘పురాణ పాత్ర’

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాముడిని పురాణ పాత్రగా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని కలిగి ఉందని, రాహుల్ రామ వ్యతిరేకి అని విమర్శించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో రాముడిని పురాణ పాత్రగా పేర్కొన్నారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే లౌకిక రాజకీయాలను…

Read More

‘సర్జికల్ స్ట్రైక్‌లు ఎవరూ చూడలేదు’

సహనం వందే, ఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్‌లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది. సర్జికల్ స్ట్రైక్‌పై చన్నీ…

Read More