సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More

రాజమండ్రి శ్రీచైతన్యలో ర్యాగింగ్‌ భూతం – ఇస్త్రీ పెట్టెతో ఒళ్ళు కాల్చిన సీనియర్లు

సహనం వందే, రాజమండ్రి:విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన విద్యాసంస్థలు ముఖ్యంగా హాస్టళ్లు ఇప్పుడు హింసకు అడ్డాగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై సహచరులు దారుణంగా ర్యాగింగ్‌ కు పాల్పడిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గుఱ్ఱం విన్సెంట్ ప్రసాద్ అనే పదహారేళ్ల విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి…

Read More

యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More

1న పింఛన్ విద్రోహ దినం – సభా పోస్టర్ విడుదల చేసిన నేతలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నెల 1వ తేదీన పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర, జిల్లా శాఖలు మంగళవారం ఆర్థిక, గణాంకాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్లు శ్రీకాంత్, విక్రమ్, కన్వీనర్లు వెంకట్, కృష్ణ యాదవ్‌తో పాటు టీజీఓ, టీఎన్జీఓ వంటి ఇతర సంఘాల…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

సొంత గడ్డపై గడ్డుకాలం – గుజరాత్ నుండి రెండేళ్లు బహిష్కరణ

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

‘సీఎంలు వాళ్లు.. రోడ్లపై నేను’ – వి. హనుమంతరావు భావోద్వేగం

సహనం వందే, కరీంనగర్:‘నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్లమీద తిరుగుతున్నాన’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ మారని నేతపదవుల కోసం పార్టీలు మారిన నేతలు చాలామంది ఉన్నారని,…

Read More

ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More