ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

   వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదిస్తాం – మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సహనం వందే, కరీంనగర్:   ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జరిగిన న్యాయవాదుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు…

Read More

బహుజనుల్లోకి ‘హస్తం’

   బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? – బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో కేంద్ర సహకారం కష్టమే – అమలు చేయకుండా కేంద్రం పైకి నెట్టినా విశ్వసనీయత అసాధ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42…

Read More

శక్తిమంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి

– మొదటి 10 స్థానాల్లో మోదీ, రాహుల్ గాంధీ సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలనా నైపుణ్యంతో, ప్రభావవంతమైన రాజకీయంతో దేశవ్యాప్తంగా శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన 2025 సంవత్సరానికి సంబంధించిన అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆయన 28వ స్థానం సంపాదించారు. 2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న ఆయన ఒక్క ఏడాది వ్యవధిలోనే 11 స్థానాలు ఎగబాకి ఈ ఘనత సాధించారు. కీలక…

Read More

పుట్టినరోజే పరువు హత్య

 – కూతురు ప్రేమ వ్యవహారంతో రగిలిన తండ్రి సహనం వందే, పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో ఓ పరువు హత్య గుండెలు పిండేసేలా చేసింది. కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ తండ్రి, యువకుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణం జరిగిన రోజే బాధితుడు పుట్టినరోజు హత్యకు గురి కావడం ఆవేదన కలిగిస్తుంది. ప్రేమకు అడ్డంగా కులం… ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ…

Read More

అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు…

   వాటిని 153కి పెంచాలి… పార్లమెంటు స్థానాలను యథాతథంగా కొనసాగించాలి – కేంద్రానికి విన్నవిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం – పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర అభ్యంతరం – దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ – కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక సహనం వందే, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను యధాతధంగా ఉంచాలని… అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు…

Read More

మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

‘ఎల్ 2: ఎంపురాన్’

AI –  ‘గ్రోక్’ యాప్ ఇచ్చిన సినిమా రివ్యూ – రేటింగ్: 3.5/5 సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్ ఈ సినిమా గురువారం విడుదలైంది. మోహన్‌లాల్ నటనతో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక యాక్షన్ థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా. ఇది “లూసిఫర్” సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. దీనికి ప్రముఖ ఏఐ యాప్ గ్రోక్ ఇచ్చిన రివ్యూ… సినిమా ఎలా ఉందంటే? “ఎల్ 2: ఎంపురాన్” ఒక గ్రాండ్ స్కేల్‌లో తీసిన గ్రూప్ సినిమా. ఇందులో…

Read More

బెట్టింగ్ యాప్‌లపై సిట్

   అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి – బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు – ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు – విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సహనం వందే, హైదరాబాద్ తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన…

Read More

అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య సహనం వందే, ఢిల్లీ: మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన…

Read More

డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం

– లక్షల సిమ్‌లు, వాట్సప్ ఖాతాలు నిషేధం – పార్లమెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు, 3,962 స్కైప్ గుర్తింపులు, 83,668 వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలిపారు. సైబర్ నేరస్థుల చేతుల్లోకి డబ్బు చేరకుండా నిరోధించేందుకు…

Read More