సెవెన్ రూల్… నాగ్ స్టైల్ – నాగార్జున యంగ్ మంత్ర

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడూ యవ్వనంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రత్యేక డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని జీర్ణకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు. చాలా సులువైన ఒకే ఒక్క సాధారణ నియమం పాటిస్తే సరిపోతుందని చెపుతున్నారు. ఆ రహస్యం మరేదో కాదు… రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేయడమే. 60 ఏళ్లు దాటినా తన యవ్వన శక్తితో ఆకట్టుకుంటున్న అగ్ర నటుడు నాగార్జున అలవాటు కూడా సరిగ్గా ఇదే కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే…

Read More

టెర్రరిజం… ఢిల్లీ & హైదరాబాద్ – ఈ రెండు నగరాలే కేంద్రాలుగా ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశ భద్రతకు ఏళ్లుగా ఒకే రకమైన ముప్పు పొంచి ఉంది. అది ఉగ్రవాదం. 2000వ సంవత్సరంలో దేశ రాజధాని ఎర్రకోటపై లష్కరే తోయిబా కాల్పులు జరిపింది. ఢిల్లీ పోలీసులు పాకిస్తానీ ఉగ్రవాది అష్ఫాక్ అహ్మద్‌ను పట్టుకున్న నాటి నుంచి దేశంలో ఐఎస్ఐ విషపు కోరలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ప్రపంచానికి తెలిసిందే. పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం, హైదరాబాద్ పాతబస్తీ జిహాదీ కార్యకలాపాలకు, నకిలీ నోట్లు, పేలుడు పదార్థాలు దాచడానికి ప్రధాన కేంద్రాలుగా…

Read More

అర లక్ష కోట్లకు హైడ్రా రక్షణ – కమిషనర్ రంగనాథ్ వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు,…

Read More

మా ‘కంత్రి’ కుటుంబం – మాగంటి మృతిపై అతని తల్లి సంచలనం

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

పగలు కోడ్‌… రాత్రి రోడ్ – హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లుగా టెక్కీలు

సహనం వందే, హైదరాబాద్:క్యాబ్ డ్రైవర్ మీకు ఫోన్‌లో కార్పొరేట్ భాషలో సమాధానమిస్తే ఆశ్చర్యపోకండి. అతను టెక్కీ అయి ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒంటరితనం, ఆఫీసులో అవిశ్రాంతంగా చేసిన పని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి రాత్రిళ్లు క్యాబ్‌లు నడుపుతున్నారు. ఇది మన కార్పొరేట్ సంస్కృతిలోని దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుంది. టెక్కీల కొత్త జీవనంఅభినవ్ అనే 27 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం…

Read More

ట్రంప్ బ్రాండ్… ‘రియల్’ ట్రెండ్ – భారత మార్కెట్లో ట్రంప్ ఎస్టేట్ మోజు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ…

Read More

స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More